జగన్ దండాలు.. జనానికి గండాలు: బస్సు యాత్రతో ట్రాఫిక్ ఆంక్షలు
విశాఖలో ముఖ్యమంత్రి జగన్ ఆదివారం నిర్వహించిన బస్సు యాత్ర ప్రజలకు చుక్కలు చూపించింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలతో ప్రయాణికులు విసిగెత్తిపోయారు.
మండుటెండలో జనం పాట్లు
గంటలకొద్దీ నిరీక్షణతో అసహనం
జగన్ యాత్రలో... కరాస బీఆర్టీఎస్ రహదారిలో దీపం లేని విద్యుత్తు స్తంభం
ఈనాడు, విశాఖపట్నం: విశాఖలో ముఖ్యమంత్రి జగన్ ఆదివారం నిర్వహించిన బస్సు యాత్ర ప్రజలకు చుక్కలు చూపించింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలతో ప్రయాణికులు విసిగెత్తిపోయారు. గంటలకొద్ది నిరీక్షించలేక అల్లాడిపోయారు. ఆదివారం యాత్ర పినగాడి కూడలి నుంచి లక్ష్మీపురం మీదుగా వేపగుంట, గోపాలపట్నం, ఎన్ఏడీ కూడలి, ఊర్వశి, కంచరపాలెం మెట్టు, దొండపర్తి, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, ఇసుకతోట, వెంకోజిపాలెం, హనుమంతువాక మీదుగా ఎండాడకు చేరుకుంది. రాత్రి అక్కడ సీఎం జగన్ బస చేశారు. యాత్రలో అక్కడక్కడ బస్సు నుంచి బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేయగా.. చాలా సమయం బస్సు లోపల నుంచే ప్రజలకు చేయి ఊపుతూ కనిపించారు. ఎక్కడా ప్రసంగించలేదు. ప్రజలకు దండాలు పెడుతూ వెళ్లారు.
ఎండలో జనం ఉక్కిరిబిక్కిరి
వేపగుంట నుంచి పినగాడి వెళ్లే రోడ్డులోకి ఎవర్నీ అనుమతించకుండా ఆదివారం ఉదయం నుంచే ఆ మార్గాన్ని మూసివేశారు. దీంతో జీవీఎంసీ పరిధిలోని పది కాలనీలతోపాటు, పినగాడి, రాంపురం, పెదగాడి, చింతల అగ్రహారం ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సబ్బవరం, కోటపాడు వైపు వెళ్లాలంటే ఈ మార్గమే కీలకం. దీనిని మూసి వేయడంతో 6 కి.మీ. ముందుకెళ్లి పెందుర్తి జంక్షన్ చుట్టూ తిరిగి వెళ్ల్లాల్సి వచ్చింది. సీఎం పినగాడి కూడలి బ్రిడ్జి వద్దకు రాగానే పినగాడి-పెందుర్తి రోడ్డులో గంటపైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎండలో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పినగాడి జంక్షన్ నుంచి పెదగాడి వరకు 3 కి.మీ. పైగా కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. వేపగుంట జంక్షన్ వద్ద రెండు గంటల పాటు ట్రాఫిక్ నిలిపి వేశారు. బీఆర్టీఎస్లో రాకపోకలు నిలిపి వేయడంతో మిట్ట మధ్యాహ్నం ఎండలో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరైపోయారు. పెందుర్తి నుంచి వచ్చే వాహనాలు నగరంలోకి రావడానికి మూడు గంటల సమయం పట్టింది. చిన్నపిల్లలు, మహిళలతో ప్రయాణాలు సాగించినవారు ఆపసోపాలు పడ్డారు. యాత్ర ఎండాడ కూడలికి చేరుకునే మార్గంలో పలుచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది.
వేపగుంట కూడలిలో భారీగా నిలిచిన ట్రాఫిక్
జగన్ బస్సు యాత్రలో కంచరపాలెం మెట్టు నుంచి మహారాణి పార్లల్ మీదుగా వెళతారని తొలుత ప్రకటించారు. అయితే... మహారాణిపార్లర్ 80 అడుగుల రోడ్డులో ప్రచారం చేసిన చంద్రబాబు గత ఎన్నికల్లో ఓటమి చెందారని, ఈ మార్గంలో ప్రచారం చేస్తే జగన్కు కూడా అలాగే జరగొచ్చనే చర్చజరిగింది. దీంతో నాయకులు యాత్ర మార్గాన్ని కంచరపాలెం మెట్టు నుంచి దొండపర్తి మీదుగా మళ్లించడం గమనార్హం. అప్పటికే ముందుగా అనుకున్న మార్గంలో దుకాణాలు మూయించేశారు. తమ పొట్టకొట్టారని దుకాణదారులు వాపోయారు.
అభ్యర్థుల పరిచయాల్లేవ్...: జగన్ బస్సు యాత్రలో ఏదో ఒక చోట సిద్ధం సభ నిర్వహించడం, ఆ నియోజకవర్గాల పరిధిలోని అభ్యర్థులను పరిచయం చేయడం పరిపాటి. విశాఖలో మాత్రం రోడ్షోతోనే సరిపెట్టారు.
అంతా అంధకారం: జగన్ పర్యటించే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వేపగుంట ప్రాంతంలో ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపేయడంతో స్థానిక ప్రజలు అవస్థలకు గురయ్యారు. సాయంత్రం రైల్వే న్యూ కాలనీ, దొండపర్తి రోడ్డులో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అభ్యర్థి కార్యాలయంలో భారీగా తాయిలాలు.. సీజ్ చేసిన అధికారులు
[ 04-05-2024]
నగరంలో భారీగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఓటర్లకు తాయిలాలు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
వైకాపా పాదాలు.. విశాఖ నిండా దందాలు!!
[ 04-05-2024]
అధికారంలోకి రాగానే విశాఖలో జగన్ రుషికొండపై విధ్వంసం చేస్తే.. వైకాపా కార్పొరేటర్లు ఊరికే ఉంటారా? విలువైన ప్రాజెక్టులు..భూములు ముఖ్య నేతలు కొల్లగొడుతుంటే కార్పొరేటర్లు కళ్లు మూసుకుంటారా? అన్నకు మించిన దందాలకు తెగబడ్డారు. -
జననేతనన్నావు.. జలమేదీ జగన్?
[ 04-05-2024]
బటన్లు నొక్కే జగన్కు జనాల బాధలు పట్టడం లేదు. ఈ అయిదేళ్లలో తాగునీటి పథకాలకు పార్టీ రంగులు వేసి ప్రచారం చేసుకోవాలని చూశారు తప్ప ప్రజల గొంతు తడిపే ప్రయత్నమే చేయలేదు. వైకాపా పాలనలో గ్రామాల్లో కొత్తగా నీళ్ల కుండీలను నిర్మించిందీ లేదు. -
పేదల పొట్టకొట్టిన జగమొండి
[ 04-05-2024]
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవారి కడుపునింపడంలోనూ రాజకీయాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. ఓపక్క పేదల పక్షపాతినని ఊదరగొడుతూనే మరోవైపు అదే పేదల పొట్టకొట్టారు. -
అభివృద్ధా.. విధ్వంసమా!!
[ 04-05-2024]
స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా శుక్రవారం నగరంలో బాలకృష్ణ రోడ్షో నిర్వహించారు. జాలారిపేట నుంచి మొదలైన రోడ్డు షో వెంకోజిపాలెం, డెయిరీ ఫాం కూడలి, రవీంద్రనగర్, చినగదిలి మీదుగా సాగింది. -
జగన్ సమర్పించు క్లాప్ దోపిడీ..!
[ 04-05-2024]
జగన్ ప్రభుత్వంలో దోపిడీ విధానాలు కోకొల్లలు. ఇంటింటి నుంచి చెత్తను సేకరించే క్లాప్ వాహనాల్లో కూడా వైకాపా కీలక నేతలు దండుకుంటున్నారు. -
సామాన్య భక్తులే లక్ష్యంగా..
[ 04-05-2024]
గత చందనోత్సవ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి సామాన్య భక్తులందరికీ సులువుగా అప్పన్న నిజరూప దర్శనం కలిగేలా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. -
ఎంవీవీ కార్యాలయంలో తనిఖీల కలకలం
[ 04-05-2024]
విశాఖ తూర్పు నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయంలో ఎన్నికల కమిషన్ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. -
‘సీబీసీఎన్సీ’ ధూళి ప్రమాదకరం..!
[ 04-05-2024]
నగరం నడిబొడ్డున ఉన్న సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్)లో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపడుతున్న భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టులో గృహాలు, ఇతర ఆస్తులను కొనుగోలు చేసి మోసపోవద్దని సీబీసీఎన్సీ ప్రతినిధి దాసరి యాకోబ్ తాడేపల్లి పత్రికా ప్రకటన ఇచ్చారు. -
చందనోత్సవ టికెట్ల విక్రయాలకు శ్రీకారం
[ 04-05-2024]
ఈనెల 10వ తేదీన చందనోత్సవం సందర్భంగా అప్పన్న స్వామి నిజరూప దర్శన టికెట్ల విక్రయం శుక్రవారం నుంచి ప్రారంభించారు. సింహగిరిపై జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి, ఆర్జేసీ సుబ్బారావు సంబంధిత వెబ్సైట్ను ప్రారంభించారు. -
ప్రజా సహకారంతో కూటమి గెలుపు : శ్రీభరత్
[ 04-05-2024]
తెదేపా కూటమి గెలుపునకు అన్ని వర్గాలు సహకరించాలని విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ , గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు కోరారు. -
కూటమితో మెరుగైన పాలన : గణబాబు
[ 04-05-2024]
తెదేపా కూటమితో మెరుగైన పాలన అందుతుందని పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు అన్నారు. శుక్రవారం ఆయన 92వ వార్డు ఇందిరానగర్, గణేశ్నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
పేదలను వేధిస్తున్న సైకో జగన్
[ 04-05-2024]
పింఛన్ల కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాసే వారి చిత్రాలను టీవీల్లో చూసి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నాడని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఆరోపించారు. -
కూటమి ప్రభుత్వం రావడం ఖాయం
[ 04-05-2024]
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని పేట కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. జల్లూరు, సుంకపూరు, బాపిరాజు కొత్తపల్లి, రామచంద్రపాలెం, సన్యాసిరాజుపాలెం, పాములవాక, బోడపాలెం తదితర గ్రామాల్లో శుక్రవారం కూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగనన్న జాగాలు.. జోరుగా బేరాలు
[ 04-05-2024]
వైకాపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జగనన్న లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు, జగనన్న కాలనీల్లో పక్కా ఇళ్ల క్రయవిక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. -
పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటాం
[ 04-05-2024]
మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తూ వారిని చదివించే బాధ్యత తీసుకుంటామని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, తెదేపా జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు పేర్కొన్నారు. -
అదనపు ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
[ 04-05-2024]
విశాఖ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అదనంగా వినియోగించనున్న ఈవీఎంల (సప్లిమెంటరీ) ర్యాండమైజేషన్ను శుక్రవారం పూర్తి చేశారు. -
సర్వీసు ఓటర్లకు ఆన్లైన్లో పోస్టల్ బ్యాలెట్
[ 04-05-2024]
విశాఖ జిల్లాకు చెందిన సర్వీసు ఓటర్లకు ఆన్లైన్లో పోస్టల్ బ్యాలెట్లను పంపారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య తేలింది. -
పోస్టల్ బ్యాలెట్ కోసం ఆరు కేంద్రాలు
[ 04-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లాలో ఆరు ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారిణి రోజారాణి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?