జగన్ దండాలు.. జనానికి గండాలు: బస్సు యాత్రతో ట్రాఫిక్ ఆంక్షలు
విశాఖలో ముఖ్యమంత్రి జగన్ ఆదివారం నిర్వహించిన బస్సు యాత్ర ప్రజలకు చుక్కలు చూపించింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలతో ప్రయాణికులు విసిగెత్తిపోయారు.
మండుటెండలో జనం పాట్లు
గంటలకొద్దీ నిరీక్షణతో అసహనం
జగన్ యాత్రలో... కరాస బీఆర్టీఎస్ రహదారిలో దీపం లేని విద్యుత్తు స్తంభం
ఈనాడు, విశాఖపట్నం: విశాఖలో ముఖ్యమంత్రి జగన్ ఆదివారం నిర్వహించిన బస్సు యాత్ర ప్రజలకు చుక్కలు చూపించింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలతో ప్రయాణికులు విసిగెత్తిపోయారు. గంటలకొద్ది నిరీక్షించలేక అల్లాడిపోయారు. ఆదివారం యాత్ర పినగాడి కూడలి నుంచి లక్ష్మీపురం మీదుగా వేపగుంట, గోపాలపట్నం, ఎన్ఏడీ కూడలి, ఊర్వశి, కంచరపాలెం మెట్టు, దొండపర్తి, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, ఇసుకతోట, వెంకోజిపాలెం, హనుమంతువాక మీదుగా ఎండాడకు చేరుకుంది. రాత్రి అక్కడ సీఎం జగన్ బస చేశారు. యాత్రలో అక్కడక్కడ బస్సు నుంచి బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేయగా.. చాలా సమయం బస్సు లోపల నుంచే ప్రజలకు చేయి ఊపుతూ కనిపించారు. ఎక్కడా ప్రసంగించలేదు. ప్రజలకు దండాలు పెడుతూ వెళ్లారు.
ఎండలో జనం ఉక్కిరిబిక్కిరి
వేపగుంట నుంచి పినగాడి వెళ్లే రోడ్డులోకి ఎవర్నీ అనుమతించకుండా ఆదివారం ఉదయం నుంచే ఆ మార్గాన్ని మూసివేశారు. దీంతో జీవీఎంసీ పరిధిలోని పది కాలనీలతోపాటు, పినగాడి, రాంపురం, పెదగాడి, చింతల అగ్రహారం ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సబ్బవరం, కోటపాడు వైపు వెళ్లాలంటే ఈ మార్గమే కీలకం. దీనిని మూసి వేయడంతో 6 కి.మీ. ముందుకెళ్లి పెందుర్తి జంక్షన్ చుట్టూ తిరిగి వెళ్ల్లాల్సి వచ్చింది. సీఎం పినగాడి కూడలి బ్రిడ్జి వద్దకు రాగానే పినగాడి-పెందుర్తి రోడ్డులో గంటపైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎండలో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పినగాడి జంక్షన్ నుంచి పెదగాడి వరకు 3 కి.మీ. పైగా కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. వేపగుంట జంక్షన్ వద్ద రెండు గంటల పాటు ట్రాఫిక్ నిలిపి వేశారు. బీఆర్టీఎస్లో రాకపోకలు నిలిపి వేయడంతో మిట్ట మధ్యాహ్నం ఎండలో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరైపోయారు. పెందుర్తి నుంచి వచ్చే వాహనాలు నగరంలోకి రావడానికి మూడు గంటల సమయం పట్టింది. చిన్నపిల్లలు, మహిళలతో ప్రయాణాలు సాగించినవారు ఆపసోపాలు పడ్డారు. యాత్ర ఎండాడ కూడలికి చేరుకునే మార్గంలో పలుచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది.
వేపగుంట కూడలిలో భారీగా నిలిచిన ట్రాఫిక్
జగన్ బస్సు యాత్రలో కంచరపాలెం మెట్టు నుంచి మహారాణి పార్లల్ మీదుగా వెళతారని తొలుత ప్రకటించారు. అయితే... మహారాణిపార్లర్ 80 అడుగుల రోడ్డులో ప్రచారం చేసిన చంద్రబాబు గత ఎన్నికల్లో ఓటమి చెందారని, ఈ మార్గంలో ప్రచారం చేస్తే జగన్కు కూడా అలాగే జరగొచ్చనే చర్చజరిగింది. దీంతో నాయకులు యాత్ర మార్గాన్ని కంచరపాలెం మెట్టు నుంచి దొండపర్తి మీదుగా మళ్లించడం గమనార్హం. అప్పటికే ముందుగా అనుకున్న మార్గంలో దుకాణాలు మూయించేశారు. తమ పొట్టకొట్టారని దుకాణదారులు వాపోయారు.
అభ్యర్థుల పరిచయాల్లేవ్...: జగన్ బస్సు యాత్రలో ఏదో ఒక చోట సిద్ధం సభ నిర్వహించడం, ఆ నియోజకవర్గాల పరిధిలోని అభ్యర్థులను పరిచయం చేయడం పరిపాటి. విశాఖలో మాత్రం రోడ్షోతోనే సరిపెట్టారు.
అంతా అంధకారం: జగన్ పర్యటించే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వేపగుంట ప్రాంతంలో ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపేయడంతో స్థానిక ప్రజలు అవస్థలకు గురయ్యారు. సాయంత్రం రైల్వే న్యూ కాలనీ, దొండపర్తి రోడ్డులో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?