logo

Mahabubabad: కోతుల కారణంగా మీదపడిన సిమెంట్‌ దిమ్మె.. మహిళ మృతి

కోతుల కారణంగా మహిళ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

Updated : 03 Sep 2023 14:33 IST

మహబూబాబాద్‌: మృత్యువు ఎప్పుడు.. ఏ రూపంలో దూసుకు వస్తుందో ఎవరికీ తెలియదు. కోతుల కారణంగా మహిళ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానిక లక్ష్మీ థియేటర్ సమీపంలో నివాసం ఉంటున్న సాబీరా బేగం (55) అనే మహిళ ఇంటిపై గత రాత్రి నుంచి కోతుల గుంపు తిష్ఠ వేశాయి. ఉదయం నిద్ర లేచి ఇంటి ముందు ఆమె వాకిలి ఊడుస్తోంది. ఇదే సమయంలో ఇంటిపై ఉన్న సిమెంట్ దిమ్మెకు కట్టి ఉన్న సర్వీస్ వైరును కోతుల గుంపు గట్టిగా లాగాయి. ఈక్రమంలో  సిమెంట్‌ దిమ్మె ఒక్కసారిగా విరిగిపడి.. కింద ఉన్న సాబీరాపై పడింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే సాబీరా మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు.

‘ఆదిత్య-ఎల్‌1.. తొలి భూకక్ష్య పెంపు విన్యాసం విజయవంతం

మహబూబాబాద్ పట్టణంలో కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో పట్టణ ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారని స్థానికులు వాపోయారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పట్టణంలో కోతుల బెడద నుంచి ప్రజలను కాపాడాలని మృతురాలి బంధువులు అధికారులకు, రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు