Mangapeta: నమ్మించి.. బురిడీ కొట్టించి.. బ్యాంకులో బంగారం మాయం చేసిన అప్రైజర్ లీలలెన్నో..
మంచివాడిగా నటిస్తూ.. పరిచయాలు పెంచుకున్నాడు. బ్యాంకులో అప్రైజర్గా చేరి అధికారులు, సిబ్బందితో కలివిడిగా ఉంటూ నమ్మించాడు. అందరినీ బురిడీ కొట్టించి రూ.కోట్ల విలువైన బంగారం మాయం చేశాడు.
ఖాతాదారులతో మాట్లాడుతున్న మంగపేట ఎస్సై రవికుమార్
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి, మంగపేట, న్యూస్టుడే: మంచివాడిగా నటిస్తూ.. పరిచయాలు పెంచుకున్నాడు. బ్యాంకులో అప్రైజర్గా చేరి అధికారులు, సిబ్బందితో కలివిడిగా ఉంటూ నమ్మించాడు. అందరినీ బురిడీ కొట్టించి రూ.కోట్ల విలువైన బంగారం మాయం చేశాడు. ఆభరణాలను తయారు చేసి ఇస్తానని తోటి స్వర్ణకారులనూ మోసగించాడు. ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట కెనరా బ్యాంకులో రూ.1.44 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు మాయం చేసిన అప్రైజర్ సమ్మెట ప్రశాంత్కు సంబంధించిన ఆర్థిక నేరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి..ఈ విషయంలో బాధితుల ఫిర్యాదు మేరకు ఆయనపై ములుగు జిల్లాలోని మంగపేట పోలీసు స్టేషన్లో ఒకటి, వరంగల్ జిల్లాలోని మట్టెవాడ ఠాణాలో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ ఘటన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఎలా చేశాడంటే..
వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతానికి చెందిన సమ్మెట ప్రశాంత్ గతేడాది నుంచి రాజుపేటలోని కెనరా బ్యాంకులో అప్రైజర్గా ఉంటున్నాడు. ఆభరణాలు తాకట్టుపెట్టి రుణం తీసుకునే వారు బ్యాంకుకు వస్తే.. వాటిని పరిశీలించి, విలువ లెక్కించి బ్యాంకు అధికారులకు చెప్పడం ఆయన పని. నిత్యం బంగారాన్ని చూసి అత్యాశతో పెద్ద మొత్తంలో దోచుకోవడానికి ప్రణాళిక రూపొందించుకున్నాడు. ఇందులో భాగంగా బ్యాంకు సమీపంలోనే బంగారం దుకాణాన్ని తెరిచాడు. అప్రైజర్గానూ.. ఇటు స్వర్ణకారుడిగానూ పనిచేస్తూ స్థానికులతో పరిచయాలు పెంచుకున్నాడు. రుణం తీసుకునే వారు ముందుగానే ఆయన దుకాణం వద్దకొచ్చేవారు..
- బ్యాంకు అధికారులతో సన్నిహితంగా ఉండడం ప్రారంభించాడు. బ్యాంకులో రుణం కోసం వచ్చిన వారి ఆభరణాల విలువ లెక్కగట్టి అధికారులకు చెప్పేవాడు. అదే సమయంలో వాటి ఫొటోలు తీసుకునేవాడు. వాటి ఆధారంగా రోల్డ్గోల్డ్ ఆభరణాలను తయారు చేయించి వాటిని బ్యాంకులో పెట్టేవాడని తెలిసింది. కొందరు ముందస్తుగా రుణం కోసం ఆభరణాలతో దుకాణం వద్ద ప్రశాంత్ను కలిసేవారని, వాటిని చూసి అదేవిధంగా ఉన్నవాటిని తయారు చేసి.. బ్యాంకులో ఇచ్చేలా పకడ్బందీగా వ్యవహారం నడిపించాడు.
వేరే బ్యాంకుల్లో తాకట్టు పెట్టి..: బ్యాంకు నుంచి అపహరించిన నగలను విక్రయిస్తే అనుమానం వస్తుందని తనకు తెలిసినవారితో ఇతర బ్యాంకుల్లో తాకట్టు పెట్టించి సొమ్ము చేసుకున్నాడని తెలుస్తోంది. ఏకంగా 27 మంది ఖాతాదారుల ఆభరణాలు కనిపించడం లేదని సమాచారం.
బెట్టింగ్లకు పాల్పడి..
నగలు అపహరించి సొమ్ము చేసుకుని జల్సాలకు, బెట్టింగ్లకు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. క్రికెట్ బెట్టింగ్తో పాటు జూదం ఆడేవాడని, సులువుగా డబ్బులు వస్తుండటంతో ఇష్టారీతిన ఖర్చు చేసినట్లుగా సమాచారం.
బ్యాంకు సిబ్బందిపై ఆరా
పెద్ద మొత్తంలో ఆభరణాలు కనిపించకపోయినా బ్యాంకు సిబ్బంది కనిపెట్టలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆడిట్లో విషయం బయటపడటంతో సిబ్బంది పాత్రపైనా పోలీసులు విచారిస్తున్నారు. బ్యాంకు సిబ్బంది సమక్షంలోనే నగలు తూకం వేసి ఆ తర్వాత లాకర్లో భద్రపరుస్తారు. ఈ క్రమంలో సిబ్బంది కళ్లుగప్పి మాయం చేశాడా? ఎవరి సహకారమైనా తీసుకున్నాడా? తదితర అంశాలపై పోలీసులు కూపీ లాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే బ్యాంకు సిబ్బందిని పూర్తిగా మార్చేశారు. ఇక్కడి సిబ్బందిని ఇతర బ్రాంచీలకు బదిలీ చేసినట్లుగా తెలిసింది. మరోవైపు ప్రశాంత్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
ఎవరినీ వదల్లేదు..
- పరిచయాలు పెంచుకుని పెద్దఎత్తున అప్పులు చేశాడు. అధిక వడ్డీ ఇస్తానని మంగపేట మండలంలోని బాలాయిగూడెంలో ఓ వ్యక్తి వద్ద రూ.16 లక్షలు అప్పు తీసుకున్నట్లు సమాచారం. స్థానికంగా చిట్టీలు వేసి ఆ డబ్బులు కూడా ఇవ్వడం లేదని సమాచారం.
- తోటి స్వర్ణకారులను మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. వరంగల్ నగరంలోని మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో పలువురు స్వర్ణకారుల నుంచి 46 తులాల బంగారం వ్యాపారం నిమిత్తం తీసుకెళ్లాడు. వారంతా పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
బాధితుల ఆందోళన
పెద్దఎత్తున బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయని బయటకు తెలియడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం బ్యాంకు ఎదుట నిరసనకు దిగారు. పోలీసులు, బ్యాంకు అధికారులు భరోసా ఇవ్వడంతో శాంతించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్