పేరుకే పీఏ.. చేసేవన్నీ దందాలే..
‘ఎమ్మెల్యే పీఏ.. పవర్ అంతా తనదే’ అన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. చివరకు అమ్మాయిలనూ లైంగికంగా లోబరచుకునేందుకు వెనకాడలేదు. అధికారం చేతిలో ఉందని ఆగడాలకు అంతులేకుండా పోవడంతో కటకటాలపాలయ్యారు.
ఈనాడు, వరంగల్, వరంగల్క్రైం, న్యూస్టుడే
శివ
‘ఎమ్మెల్యే పీఏ.. పవర్ అంతా తనదే’ అన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. చివరకు అమ్మాయిలనూ లైంగికంగా లోబరచుకునేందుకు వెనకాడలేదు. అధికారం చేతిలో ఉందని ఆగడాలకు అంతులేకుండా పోవడంతో కటకటాలపాలయ్యారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వద్ద ప్రయివేటు పీఏగా పనిచేస్తున్న శివపై గత నెల 29న హనుమకొండ ఠాణాలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారం కేసు నమోదు కావడం నగరంలో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంతో శివ చేసిన దందాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నరేందర్ మేయర్గా ఉన్నప్పటి నుంచీ ఆయనకు సన్నిహితుడిగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో అనేక రకాలుగా అధికారాలు చలాయిస్తూ దందాలకు తెరలేపాడు.
* తూర్పులో నిరుద్యోగుల కోసం గతంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. ఆ సమయంలో శివ పలువురు విద్యార్థినుల చరవాణి నెంబర్లు తీసుకొని వారిని వేధింపులకు గురిచేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగాల పేరుతో వారికి వలవేసి లైంగికంగా వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. మరికొందరి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు చెబుతున్నారు.
* పలు భూవివాదాల్లో తలదూర్చడంతో పాటు వరంగల్ డివిజన్లో పనిచేసే పలువురు పోలీసు అధికారులపై పెత్తనం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎక్కడికి వెళ్లినా పీఏ పేరుతో సకల మర్యాదలు శివ అందుకునేవాడు. మేయర్గా ఉన్నప్పుడు నరేందర్ జన్మదిన వేడుకలు నిర్వహించాలని పలువురు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. నరేందర్ తూర్పు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆగడాలు మరింత శ్రుతిమించాయి. ఒక భూవివాదంలో పోలీసుల పేరు చెప్పి బాధితుడి నుంచి రూ.4 లక్షలు తీసుకున్నాడు. చివరకు భూవివాదం పరిష్కారం కాకపోవడంతో బాధితుడు నేరుగా పోలీసు అధికారి వద్దకు వెళ్లి చెప్పగా అసలు శివ తనకు డబ్బు ఇవ్వలేదని.. తాము చట్ట విరుద్ధంగా పనిచేయలేమని తేల్చి చెప్పారు. దీంతో బాధితుడు శివ వద్దకు వెళ్లి డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. శివపై ఆ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారని తెలిసింది.
కేసు కాకుండా ఒత్తిడి
గత ఫిబ్రవరి నుంచి శివ తనపై తరచూ అత్యాచారానికి పాల్పడుతున్నట్లు ఓ న్యాయ విద్యార్థిని గత నెల 29న హనుమకొండ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారం కేసు నమోదైంది. ఈ కేసు కాకుండా ఉండేందుకు శివ కుటుంబ సభ్యులు లాబీయింగ్ చేసినట్లు సమాచారం. బాధిత విద్యార్థినితో సయోధ్య కుదుర్చుకునేందుకు ప్రయత్నించగా ఆమె కుటుంబసభ్యులు వినలేదు. దీంతో శివ పోలీసు ఉన్నతాధికారులను సైతం కలిసి కేసు నమోదు కాకుండా ఉండేందుకు ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. బాధిత మహిళ మాత్రం తనకు న్యాయం జరగాలని కోరడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు అరెస్టు కాగా.. బాధితురాలిపై మరో వ్యక్తి కూడా అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తాజాగా గుర్తించారు. ప్రస్తుతం సదరు నిందితుడు విదేశాల్లో ఉన్నట్టు తెలిసింది. పోలీసులు దీనిపై కూడా సమగ్ర విచారణ జరుపుతున్నారు.
అనవసరంగా నాపై బురద చల్లుతున్నారు..
- నన్నపునేని నరేందర్, తూర్పు శాసనసభ్యుడు
నా రాజకీయ పలుకుబడిని దెబ్బకొట్టడానికి కొందరు పనిగట్టుకొని అనేక ఆరోపణలు చేస్తున్నారు. నా వద్ద సుమారు 40 మంది పని చేస్తారు. వాళ్లలో శివ ఒకరు. నా పేరు చెప్పి అతను ఏనాడూ వసూళ్లకు పాల్పడినట్లు నా దృష్టికి రాలేదు. అలా చేసినట్టు తెలిస్తే ఇప్పటికే తొలగించేవాడిని. తాజాగా శివపై నమోదైన కేసుతో నాకెలాంటి సంబంధం లేదు. నిజానిజాలు తేల్చడానికి పోలీసులు, న్యాయస్థానం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం