రైతులకు రెట్టింపు.. సీసీ ఛార్జీల వడ్డింపు
రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తును ఇస్తోంది.
ఏడాదికి రూ.320కి బదులుగా ఒక్కోచోట ఒక్కో రకంగా..
రూ.750 వసూలు..రశీదు
జనగామ, నర్సంపేట, న్యూస్టుడే: రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తును ఇస్తోంది. సరఫరా నిర్వహణలో భాగంగా వినియోగదారు రుసుము (కస్టమర్ ఛార్జీ) పేరిట రైతులు నెలకు రూ.30 చొప్పున ఏకమొత్తంగా ఏడాదికి రూ.360 చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి పెంపు ఆదేశాలు లేకున్నా నాలుగేళ్లుగా దీనికి రెట్టింపు వసూలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.
ఉత్తర్వులు లేవు.. వసూళ్లు ఉన్నాయ్
ఉచిత విద్యుత్తు పొందుతున్న రైతుల నుంచి ఏటా డిసెంబరు మొదటి వారం నుంచి చివరి వారంలోపు సీసీ రుసుము తీసుకుంటారు. వ్యవసాయ సర్వీసుల సంఖ్యకు అనుగుణంగా సీసీ రుసుము లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. దీంతో 2018 నుంచి క్రమం తప్పకుండా చెల్లించే రైతుల నుంచే రెట్టింపు వసూలు చేస్తున్నామని క్షేత్ర స్థాయి సిబ్బంది చెబుతున్నారు. ఇది కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా వసూలు చేస్తున్నారు.. నిర్ధేశిత మొత్తానికి మించి వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని విద్యుత్తు శాఖ ఎస్ఈలు, డీఈలు అంటున్నారు. పెంపుదలకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు లేవని అంగీకరిస్తున్నారు.
ఉదాహరణలు ఇవిగో..
జనగామ జిల్లాలో అన్ని చోట్ల రైతుల నుంచి ఏడాదికి రూ.720 వసూలు చేస్తున్నారు. రఘునాథపల్లి మండలంలో ఓ గ్రామంలో గతేడాది రూ.360 చొప్పున వసూలు చేశారు. లింగాలఘన్పూర్ మండలం వనపర్తిలో ఓదఫా రూ.750 తీసుకున్నారు. తమ గ్రామాల్లో ఏటా రూ.750 వసూలు చేస్తున్నారని జఫర్గఢ్కు చెందిన వేములయ్య అనే రైతు, స్టేషన్ఘన్పూర్ మండలం కొత్తపల్లికి చెందిన ముక్కెర మధు తెలిపారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన మాచర్ల ఏసురత్నం అనే రైతు తమ ప్రాంతంలో రూ.500 చెల్లిస్తున్నట్లు చెప్పారు.
ఒక రైతు పరంగా చూస్తే ఇది రూ.వందల్లోనే కనిపిస్తుంది. ఒక ఊరు, ఒక జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా లెక్కిస్తే రూ.కోట్ల మేర అదనపు భారం అవుతుంది. ఉమ్మడి జిల్లాలో 4.50 లక్షల వ్యవసాయ కనెక్షన్లున్నాయి. ఏటా సీసీ ఛార్జీల రూపేణా రూ.16.20 కోట్లు వసూలు కావాలి. రూ.720 చొప్పున వసూలు చేస్తే రైతులపై అదనంగా మరో రూ.16 కోట్ల భారం పడుతుంది.
మూడేళ్లుగా చెల్లిస్తున్నా
- గుండె గోపాల్రావు, లెంకాలపల్లి, నల్లబెల్లి మండలం
మా కుటుంబంలో మూడు వ్యవసాయ కనెక్షన్లుండగా నిరుడు ఒక్కో దానికి రూ.600 చొప్పున రూ.1800 చెల్లించాను. ఈ ఏడాది అంతే మొత్తం చెల్లించాను విద్యుత్తు అధికారులు మూడేళ్లుగా ఇలాగే ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఒక్కో మోటారుకు ఏడాదికి రూ.360లే కదా అని అడిగితే పెరిగాయని చెప్పారు. నిజమే కావొచ్చని వారడిగినంత చెల్లించి రశీదు తీసుకుంటున్నా.
సరఫరా నిలిపివేస్తున్నారు..
- ఐరెడ్డి జితేందర్రెడ్డి, బానోజిపేట, నర్సంపేట మండలం
ఉచిత కరెంటు ఇస్తున్నామని చెబుతున్న మాట సరికాదు. మాకు రెండు వ్యవసాయ మోటార్లున్నాయి. సర్వీసు ఛార్జీ కింద సంవత్సరానికి రూ.360 చెల్లిస్తే సరిపోతుందన్నారు. అధికారులు మాత్రం రూ.600 వసూలు చేస్తున్నారు. బిల్లుల వసూళ్ల కోసం పంటల సీజన్లో కరెంటు సరఫరాను నిలిపి వేస్తున్నారు.
* ఎన్పీడీసీఎల్ సీజీఎం(ఫైనాన్స్) తిరుపతిరెడ్డిని వివరణ కోరగా, ప్రభుత్వం నుంచి కొత్త ఆదేశాలు, నిబంధనలు లేవన్నారు. ఎస్ఈ వేణుమాధవ్తో గ్రూప్కాల్ ద్వారా మాట్లాడారు. రైతులు అదనంగా చెల్లిస్తే వారికే చెందుతుందని ఆయన వివరించారు.
* ‘ఉన్నతాధికారుల వద్ద ఎక్కువ బిల్లు వసూళ్ల విషయాన్ని ప్రస్తావిస్తే.. బలవంతం చేయడం లేదని అడిగితే వారే స్వచ్చందంగా చెల్లిస్తున్నారని జిల్లా ఎస్ఈ మధుసూదన్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్