పారిశుద్ధ్య విధానాలు భేష్
వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య విధానాలు బాగున్నాయని బంగ్లాదేశ్, నేపాల్ దేశాలకు చెందిన మేయర్లు, అధికారుల బృందాలు కితాబిచ్చారు.
హనుమకొండ వడ్డేపల్లి క్రాస్రోడ్ పబ్లిక్ టాయిలెట్ వద్ద బంగ్లాదేశ్, నేపాల్ ప్రతినిధులు
కార్పొరేషన్, న్యూస్టుడే: వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య విధానాలు బాగున్నాయని బంగ్లాదేశ్, నేపాల్ దేశాలకు చెందిన మేయర్లు, అధికారుల బృందాలు కితాబిచ్చారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా సంస్థ నిపుణుల ఆధ్వర్యంలో బుధవారం రెండు దేశాలకు చెందిన మున్సిపల్ మేయర్లు, అధికారులు నగరంలో పర్యటించారు. హనుమకొండ వడ్డేపల్లి క్రాస్ రోడ్లో ఆధునిక ప్రజా మరుగుదొడ్డిని చూశారు. ఆధునిక వసతులు అడిగి తెలుసుకున్నారు. వరంగల్ సివిల్ సొసైటీ ప్రతినిధులతో మాట్లాడారు. ప్రజలతో ముచ్చటించారు. జీవన స్థితిగతులు, ప్రభుత్వం ద్వారా అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛ వరంగల్ విధానాలు, అమలవుతున్న పద్ధతులను అస్కి ప్రతినిధులు విదేశీ ప్రతినిధులకు వివరించారు. కార్యక్రమంలో లలిత్పూర్ మేయర్ రాజు మహాజన్, గోదావరి మున్సిపల్ మేయర్ గజేంద్ర మహాజన్, అధికారులు కమల్ సఫ్కోట, దేవేంద్రకుమార్ ఝూ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
[ 26-07-2024]
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
[ 26-07-2024]
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
[ 26-07-2024]
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఆకర్షక పద్దు
[ 26-07-2024]
రైతును రాజు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. వారికి అన్ని విధాలుగా మేలు చేసేలా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కేటాయింపులు చేశారు. అభివృద్ధే అజెండాగా.. సంక్షేమం దండిగా ఉండేలా ఆర్థిక పద్దు రూపకల్పన జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్కు కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం. -
పంచాయతీల్లో కానరాని పౌర సేవల పట్టికలు
[ 26-07-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పంచాయతీల్లో ప్రజలకు పౌర సేవలు అరకొరగానే అందుతున్నాయి. పంచాయతీలో ఏఏ సేవలు అందుబాటులో ఉంటాయో, వాటిని ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో సూచిస్తూ పంచాయతీ కార్యాలయాల్లో విధిగా పౌరసేవల పట్టికలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
విశ్వ క్రీడల కీర్తి.. ఓరుగల్లు పొందాలి స్ఫూర్తి
[ 26-07-2024]
ఒలింపిక్స్లో పతకాలు సాధించడం అంత సులువైన విషయం కాదు. అసాధ్యమూ అంతకన్నా కాదు. కావాల్సిందల్లా గట్టి సంకల్పం, పట్టుదల, కృషి. ఉమ్మడి వరంగల్లో క్రీడాకారుల ప్రతిభకు కొదువ లేదు. గ్రామీణ ప్రాంతాల్లో గొప్ప నైపుణ్యం ఉన్నవారు ఎందరో ఉన్నారు. వారిని గుర్తించి సానబెడితే ఒలింపిక్స్కు మనవాళ్లు అర్హత సాధించడం పెద్ద సమస్యే కాదు. -
ఆయన లేని లోకంలో ఉండలేనని..
[ 26-07-2024]
ఎక్కడో పుట్టారు.. ఎక్కడో పెరిగారు.. వివాహబంధంతో ఒకటయ్యారు.. కష్టసుఖాలు పంచుకున్నారు.. పిల్లలను ప్రయోజకులను చేశారు.. అరవై ఏళ్లు తోడు-నీడగా ఉన్నారు.. మలి సంధ్యలోనూ నీకు నేను...నాకు నువ్వు అనుకుంటూ జీవిస్తున్నారు.. ఇంతలో భర్త హఠాన్మరణంతో ఆ ఇల్లాలు కన్నీరు మున్నీరుగా విలపించారు.. -
ఎక్సైజ్కాలనీ.. ఎక్కడ చూసినా సమస్యలే
[ 26-07-2024]
హనుకొండ నడిబొడ్డున ఉన్న ఎక్సైజ్కాలనీలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కొరవడ్డాయి. అన్ని అనుమతులతో ఐదు దశాబ్దాల కిందట కాలనీ ఏర్పడింది. ఇప్పకీ కొన్ని వీధుల్లో డ్రైనేజీలు లేవు. రోడ్డు నెంబర్ 5సీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు రోడ్డుపై నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. -
సరిహద్దులో పేలిన తూటా!
[ 26-07-2024]
కొన్నాళ్లుగా తెలంగాణ-ఛత్తీస్గఢ్-మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య పోరు సాగుతోంది. గురువారం ములుగు-భద్రాద్రి జిల్లాల సరిహద్దులోని గుండాల-తాడ్వాయి మండలాల పరిధిలోని దామెరతోగు, కరకగూడెం అటవీ ప్రాంతంలో తుపాకీ తూటాల మోతలు మోగాయి. -
ఠాణాల్లో భూ తగాదాలు.. సివిల్ పంచాయితీలు!
[ 26-07-2024]
జిల్లా పరిధిలోని కొన్ని పోలీసు సబ్ డివిజన్లలో సీఐలు, ఎస్సైల తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఠాణాల్లో యథేచ్ఛగా భూ పంచాయితీలు, సివిల్ తగాదాల్లో పోలీసులు తలదూరుస్తూ అమ్యామ్యాయాలు పుచ్చుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలోనూ ఈ మాదిరిగానే వ్యవహరించగా జిల్లాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. -
కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం
[ 26-07-2024]
శాంతిభద్రతల పరిరక్షణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!