‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ఏప్రిల్ 3న ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య తెలిపారు.
కలెక్టర్ శివలింగయ్యతో కలిసి కళాశాల ఏర్పాటు పనులను పరిశీలిస్తున్న రమేష్రెడ్డి
జనగామ అర్బన్, న్యూస్టుడే: ఏప్రిల్ 3న ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య తెలిపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై బుధవారం హైదరాబాద్ నుంచి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులు కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ సమీక్షలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 6748 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, జిల్లా వ్యాప్తంగా 42 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని, 63040 62768 నెంబర్తో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమీక్షలో ఏసీపీ దేవేందర్, డీఈవో రాము, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్, డివిజనల్ పంచాయతీ అధికారి పార్థసారథి, మున్సిపల్ కమిషనర్ రజిత, ఆర్టీవో శ్రీనివాస్, బి.అర్జున్, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.
వైద్య కళాశాల ఏర్పాటు పనుల పరిశీలన
జనగామ టౌన్, న్యూస్టుడే: జనగామలో వైద్య కళాశాల ఏర్పాటు పనులను బుధవారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ రమేష్రెడ్డి, కలెక్టర్ సీహెచ్.శివలింగయ్యతో కలిసి పరిశీలించారు. కళాశాల నిర్మాణ స్థలం, తరగతులు నిర్వహించనున్న ఏబీవీ డిగ్రీ కళాశాల, ధర్మకంచలోని వసతిగృహం, వీబీఐటీక కళాశాల, గీతాంజలి పాఠశాల, చంపక్హిల్స్లోని ఎంసీహెచ్లో నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. రమేష్రెడ్డి మాట్లాడుతూ వైద్య కళాశాల ఏర్పాటుకు 22 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు చెప్పారు. మొదటి బ్యాచ్లో వంద మంది వైద్య విద్యార్థుల కోసం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తాత్కాలికంగా భవనాలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. భవన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్దేశాయ్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గోపాల్రావు, ఎంసీహెచ్ ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్రాజు, టీఎస్ఎంఐడీసీ ఏఈ దేవేందర్, తహసీల్దార్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులూ.. సందేహాలను నివృత్తి చేసుకోండిలా !
జనగామ అర్బన్, న్యూస్టుడే: పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు జిల్లా విద్యాశాఖాధికారి కె.రాము వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 3 నుంచి జరగనున్న వార్షిక పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల సౌకర్యార్థం, వారి సందేహాలను నివృత్తి చేసేందుకు వివిధ సబ్జెక్టుల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందు కోసం జిల్లాలో వివిధ సబ్జెక్టుల్లో నిష్ణాతులైన 14 మంది సీనియర్ ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. పదో తరగతి విద్యార్థుల సందేహాలకు చరవాణిలో విషయ నిపుణులు సమాధానాలు ఇవ్వనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన పదో తరగతి విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈవో కోరారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం