logo

Telangana News: ఏడేళ్ల కుమారుడిపై ప్రేమతో విగ్రహం..

ఓ తండ్రి.. మరణించిన తన కుమారుడి నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించి ప్రేమను చాటుకున్నారు.

Updated : 18 Apr 2023 09:21 IST

పెద్దవంగర, న్యూస్‌టుడే: ఓ తండ్రి.. మరణించిన తన కుమారుడి నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించి ప్రేమను చాటుకున్నారు. మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం శంకర్‌తండాకు చెందిన భూక్య బీకోజీకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు భూక్య సిద్ధు(7) రెండేళ్ల కిందట విద్యుత్తు ప్రమాదానికి గురై మృతి చెందారు. సోమవారం ఆయన రెండో వర్ధంతి సందర్భంగా విగ్రహాన్ని తయారు చేయించి తన వ్యవసాయ భూమి వద్ద ప్రతిష్ఠించారు. భారాస మండలాధ్యక్షుడు ఐలయ్య, సర్పంచి భీమా, ఎంపీటీసీ సభ్యురాలు సబిత, కుల పెద్దలు దస్రు, శంకర్‌, శ్రీను విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని