Kazipet: కాజీపేట నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు
అయోధ్య రామయ్యను దర్శించుకోవడానికి భక్తులకు కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి నేరుగా వెళ్లే అవకాశం కలిగింది. అయోధ్యకు వెళ్లడానికి కాజీపేట, వరంగల్ మీదుగా తక్కువగా రైళ్లు ఉన్నాయని ‘అయోధ్య రామా.. నిను చేరేమా’ అనే శీర్షికతో ఈ నెల 8న ఈనాడులో కథనం ప్రచురితమైంది.
కాజీపేట, న్యూస్టుడే: అయోధ్య రామయ్యను దర్శించుకోవడానికి భక్తులకు కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి నేరుగా వెళ్లే అవకాశం కలిగింది. అయోధ్యకు వెళ్లడానికి కాజీపేట, వరంగల్ మీదుగా తక్కువగా రైళ్లు ఉన్నాయని ‘అయోధ్య రామా.. నిను చేరేమా’ అనే శీర్షికతో ఈ నెల 8న ఈనాడులో కథనం ప్రచురితమైంది. దీనికి స్థానిక ఎంపీలు మాలోతు కవిత, పసునూరి దయాకర్తో పాటు భాజపా నాయకులు రావు పద్మ, ప్రదీప్రావులు దక్షిణ మధ్య రైల్వే జీఎంకు వినతిపత్రాలు అందించారు. కేంద్ర రైల్వే మంత్రికి మెయిల్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా వినతులు పంపారు. దీనికి స్పందించిన రైల్వే శాఖ కాజీపేట మీదుగా ఈనెల 30 నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
అందుబాటులో ఆస్తా..
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఆస్తా రైలును కాజీపేట, సికింద్రాబాద్ల నుంచి ప్రవేశ పెట్టింది. కాజీపేట నుంచి 07223 నెంబరుతో జనవరి 30, ఫిబ్రవరి 1, 3, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 మొత్తం 15 ట్రిప్పులు నడుపుతుంది. అయోధ్య నుంచి కాజీపేటకు ఫిబ్రవరి 2, 4, 6, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, మార్చి 2 తేదీలలో అందుబాటులో ఉంటుంది.
కాజీపేటలో సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి మరునాడు రాత్రి 9.35 గంటలకు అయోధ్య చేరుతుంది. అయోధ్యలో తిరిగి మధ్యాహ్నం 2.20 గంటలకు బయలు దేరి కాజీపేటకు మరునాటి రాత్రి 7.02 గంటలకు చేరుతుంది. ఈ రైలు పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్, బల్లార్ష, చంద్రాపూర్, సేవాగ్రామం, నాగపూర్, జుజార్పూర్, ఇటార్సీ, బోపాల్, బినా, విరాంగన, ఝాన్సీ, ఒరాయ్, ఖాన్పూర్, అయోధ్య స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో 20 స్లీపర్ కోచ్లు 2 జనరల్ బోగీలు ఉంటాయి.
సికింద్రాబాద్ మీదుగా మరొకటి..
సికింద్రాబాదు నుంచి అయోధ్యకు 07221 నెంబరుతో మరో ప్రత్యేక రైలు కూడా అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాదులో ఈనెల 29, 31, ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 తేదీలలో అందుబాటులో ఉంటుంది. అయోధ్య నుంచి ఇదే నెంబరుతో ఫిబ్రవరి 1, 3, 5, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, మార్చి 1, 3 తేదీలలో ఉంటుంది. సికింద్రాబాదులో సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి మరునాడు రాత్రి 9.30 గంటలకు అయోధ్య చేరుతుంది. అయోధ్యలో మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్కు రాత్రి 16.10 గంటలకు చేరుతుంది. ఇది కూడా కాజీపేట నుంచి బయలు దేరు ఆస్తా ఎక్స్ప్రెస్ ప్రత్యేక రైలు ఆగిన అన్ని స్టేషన్లలో ఆగుతుంది.
బల్లార్ష మార్గంలో..
ఉమ్మడి వరంగల్, సికింద్రాబాదు ప్రజలకు ఆస్తా అయోధ్య ప్రత్యేక రైలు అందుబాటులోకి రావడం మంచి సౌకర్యం అని చెప్పవచ్చు. ఈ మార్గంలో ఎక్కువ ప్రయాణికులు కాగజ్నగర్ వరకు ప్రయాణం చేస్తారు కాబట్టి దీనిని రెగ్యులర్ రైలుగా మారిస్తే అందరికి సౌకర్యంగా ఉంటుంది. ఇంకా ఉత్తర ప్రదేశ్ వెళ్లు కూలీలకు కూడా ఇది మంచి సదుపాయం అని చెప్పొచ్చు.
ఈ నెల 8న ఈనాడులో ప్రచురితమైన కథనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
[ 26-07-2024]
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
[ 26-07-2024]
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
[ 26-07-2024]
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఆకర్షక పద్దు
[ 26-07-2024]
రైతును రాజు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. వారికి అన్ని విధాలుగా మేలు చేసేలా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కేటాయింపులు చేశారు. అభివృద్ధే అజెండాగా.. సంక్షేమం దండిగా ఉండేలా ఆర్థిక పద్దు రూపకల్పన జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్కు కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం. -
పంచాయతీల్లో కానరాని పౌర సేవల పట్టికలు
[ 26-07-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పంచాయతీల్లో ప్రజలకు పౌర సేవలు అరకొరగానే అందుతున్నాయి. పంచాయతీలో ఏఏ సేవలు అందుబాటులో ఉంటాయో, వాటిని ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో సూచిస్తూ పంచాయతీ కార్యాలయాల్లో విధిగా పౌరసేవల పట్టికలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
విశ్వ క్రీడల కీర్తి.. ఓరుగల్లు పొందాలి స్ఫూర్తి
[ 26-07-2024]
ఒలింపిక్స్లో పతకాలు సాధించడం అంత సులువైన విషయం కాదు. అసాధ్యమూ అంతకన్నా కాదు. కావాల్సిందల్లా గట్టి సంకల్పం, పట్టుదల, కృషి. ఉమ్మడి వరంగల్లో క్రీడాకారుల ప్రతిభకు కొదువ లేదు. గ్రామీణ ప్రాంతాల్లో గొప్ప నైపుణ్యం ఉన్నవారు ఎందరో ఉన్నారు. వారిని గుర్తించి సానబెడితే ఒలింపిక్స్కు మనవాళ్లు అర్హత సాధించడం పెద్ద సమస్యే కాదు. -
ఆయన లేని లోకంలో ఉండలేనని..
[ 26-07-2024]
ఎక్కడో పుట్టారు.. ఎక్కడో పెరిగారు.. వివాహబంధంతో ఒకటయ్యారు.. కష్టసుఖాలు పంచుకున్నారు.. పిల్లలను ప్రయోజకులను చేశారు.. అరవై ఏళ్లు తోడు-నీడగా ఉన్నారు.. మలి సంధ్యలోనూ నీకు నేను...నాకు నువ్వు అనుకుంటూ జీవిస్తున్నారు.. ఇంతలో భర్త హఠాన్మరణంతో ఆ ఇల్లాలు కన్నీరు మున్నీరుగా విలపించారు.. -
ఎక్సైజ్కాలనీ.. ఎక్కడ చూసినా సమస్యలే
[ 26-07-2024]
హనుకొండ నడిబొడ్డున ఉన్న ఎక్సైజ్కాలనీలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కొరవడ్డాయి. అన్ని అనుమతులతో ఐదు దశాబ్దాల కిందట కాలనీ ఏర్పడింది. ఇప్పకీ కొన్ని వీధుల్లో డ్రైనేజీలు లేవు. రోడ్డు నెంబర్ 5సీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు రోడ్డుపై నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. -
సరిహద్దులో పేలిన తూటా!
[ 26-07-2024]
కొన్నాళ్లుగా తెలంగాణ-ఛత్తీస్గఢ్-మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య పోరు సాగుతోంది. గురువారం ములుగు-భద్రాద్రి జిల్లాల సరిహద్దులోని గుండాల-తాడ్వాయి మండలాల పరిధిలోని దామెరతోగు, కరకగూడెం అటవీ ప్రాంతంలో తుపాకీ తూటాల మోతలు మోగాయి. -
ఠాణాల్లో భూ తగాదాలు.. సివిల్ పంచాయితీలు!
[ 26-07-2024]
జిల్లా పరిధిలోని కొన్ని పోలీసు సబ్ డివిజన్లలో సీఐలు, ఎస్సైల తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఠాణాల్లో యథేచ్ఛగా భూ పంచాయితీలు, సివిల్ తగాదాల్లో పోలీసులు తలదూరుస్తూ అమ్యామ్యాయాలు పుచ్చుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలోనూ ఈ మాదిరిగానే వ్యవహరించగా జిల్లాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. -
కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం
[ 26-07-2024]
శాంతిభద్రతల పరిరక్షణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు