వచ్చేది జీరో బిల్లు.. ఇంటింటా వెలుగు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ గృహజ్యోతి పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించారు. రేషన్కార్డు ఉన్న వారికి నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందనుంది. ఫిబ్రవరిలో వినియోగించిన విద్యుత్తుకు సంబంధించి మార్చిలో అర్హులైన లబ్ధిదారులకు జీరో బిల్లు జారీ చేస్తారు.
ఇప్పటి వరకు అర్హులు 3.75 లక్షల మంది
పెరగనున్న లబ్ధిదారులు
ఈనాడు, మహబూబాబాద్, న్యూస్టుడే, వడ్డేపల్లి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ గృహజ్యోతి పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించారు. రేషన్కార్డు ఉన్న వారికి నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందనుంది. ఫిబ్రవరిలో వినియోగించిన విద్యుత్తుకు సంబంధించి మార్చిలో అర్హులైన లబ్ధిదారులకు జీరో బిల్లు జారీ చేస్తారు. ఇందుకు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి నుంచి ఉత్తర విద్యుత్తు పంపిణీ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్పీడీసీఎల్) అధికారులు రేషన్ కార్డు, ఆధార్, యూనిక్ సర్వీస్ నెంబరు (యూఎస్నెం), చరవాణి నెంబర్ల సమాచారం సేకరించి అర్హులను గుర్తించారు. గృహజ్యోతి పథకం ప్రారంభంతో అర్హులైన లబ్ధిదారుల మొహాల్లో చిరునవ్వు కనిపిస్తోంది.
ఎవరికి వర్తిస్తుందంటే..
ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11,60,999 గృహ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో రేషన్కార్డు లేనివారూ ఉన్నారు. గృహజ్యోతి పథకానికి ప్రజాపాలనలో దరఖాస్తు చేసి నిబంధనల ప్రకారం విద్యుత్తు అధికారులు అడిగినట్లుగా ఇప్పటి వరకు వివరాలు ఇచ్చిన వారు 3,75,683 మంది వినియోగదారులకు గృహజ్యోతి పథకం వర్తిస్తుంది. ఫిబ్రవరిలో 200 యూనిట్ల విద్యుత్తును వాడుకున్న వారికి మార్చి 1 నుంచి 15 వరకు రీడింగ్ తీసేవారు జీరో బిల్లు ఇస్తారు. బిల్లుపై జీరోతో పాటు ఎంత బిల్లు వచ్చిందనేది కూడా కనిపిస్తుంది. లబ్ధిదారులు మాత్రం బిల్లు చెల్లించనక్కరలేదు. ఇంకా అర్హుల సంఖ్య పెరగనుందని విద్యుత్తు అధికారులు చెబుతున్నారు.
200 యూనిట్లు దాటితేనే..
అధికారులు గుర్తించిన లబ్ధిదారులు 200 యూనిట్ల కంటే ఒక యూనిట్ అధికంగా వాడుకుంటే వారు తప్పనిసరిగా బిల్లు చెల్లించాల్సిందే. వారికి ఇచ్చే బిల్లులో జీరో బిల్లు రాదు.
వివరాలు ఇవ్వండి..
ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన వారు, చేయని వారు తమకు రేషన్కార్డు ఉంటే వెంటనే మీ ఆధార్, రేషన్కార్డు, యూనిక్ సర్వీస్ నెంబర్, చరవాణి నెంబర్ వివరాలను మీ పరిధిలో ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఇవ్వాలి. వారు వాటిని ఆన్లైన్ నమోదు చేస్తారు. అలా చేస్తేనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం వర్తిస్తుంది.
యజమానులూ ఆందోళన వద్దు
పట్టణాలు, నగరాల్లో ఇళ్లకు అద్దెకు ఇచ్చిన యజమానుల్లో ఆందోళన ఉంది. దాన్ని వీడండి. మీ పేరున ఉన్న గృహ కనెక్షన్ కిరాయిదారుల పేరున మార్పు చెందదు. కిరాయిదారులను దరఖాస్తు చేసుకోవద్దని ఒత్తిడి చేయొద్దు. వారికి రేషన్కార్డు ఉండి..200 యూనిట్ల వరకు విద్యుత్తును వినియోగిస్తే దరఖాస్తు చేసుకోనివ్వండి. అద్దెకు ఉన్న వారు ఇంకా చేసుకోకుంటే వెంటనే కరెంట్ బిల్లు, రేషన్కార్డు, ఆధార్కార్డు, చరవాణి నెంబర్ల వివరాలను ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాలంటూ కరెంట్ అధికారి ఒకరు తెలిపారు.
కొత్త కనెక్షన్లు పెరిగేనా..?
ఉమ్మడి జిల్లాలో 11,11,416 రేషన్కార్డులున్నాయి. ఈ కార్డుల ప్రకారం అంతమందికి విద్యుత్తు మీటర్లు లేవంటూ ఒక అధికారి చెబుతున్నారు. కొన్ని కుటుంబాల్లో తండ్రి, తల్లి పేరున ఒక కార్డు, పెళ్లిలు అయిన వారి కుటుంబ సభ్యుల పేరు మరో ఒక కార్డు ఉంటుంది. వారు ఒకే ఇంటి ఆవరణలో వేర్వేరుగా ఉంటున్నా.. ఒకే విద్యుత్తు మీటరును వినియోగిస్తారు. ఇలా ఉమ్మడి జిల్లాలో చాలా కుటుంబాలున్నాయి. వీరందరూ ఒకరి పేరునే దరఖాస్తు చేసుకోవాలి. మునుముందు వారికి విద్యుత్తు వినియోగం పెరిగి 200 యూనిట్లు దాటితే బిల్లు చెల్లించే పరిస్థితులుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి తెలిసిన కొంత మంది కొత్త మీటర్ కోసం దరఖాస్తు చేసుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సంతోషంగా ఉంది..
కరెంట్ బిల్లు చూపిస్తున్న ఈయన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటకు చెందిన ఇ.వెంకన్న. వీరిది వ్యవసాయ కుటుంబం. జనవరిలో 40 యూనిట్ల విద్యుత్తును వినియోగించుకున్నారు. అందుకు రూ.130 బిల్లు వచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. గత బిల్లు ప్రకారం ఫిబ్రవరిలో వాడుకున్న కరెంట్కు జీరో బిల్లు రానుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు