కోణార్క్కు వందేభారత్ కష్టాలు
సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ కోసం ఇతర రైళ్లను ఎక్కడ పడితే అక్కడ గంటల తరబడి నిలిపి వేస్తున్నారు. శుక్రవారం చింతపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ముంబయి నుంచి భువనేశ్వర్ వెళ్లు కోణార్క్ ఎక్స్ప్రెస్ (11019)ను గంట పాటు నిలిపి వేశారు.
న్యూస్టుడే, కాజీపేట
చింతలపల్లి వద్ద నిలిచిపోయిన కోణార్క్ ఎక్స్ప్రెస్
సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ కోసం ఇతర రైళ్లను ఎక్కడ పడితే అక్కడ గంటల తరబడి నిలిపి వేస్తున్నారు. శుక్రవారం చింతపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ముంబయి నుంచి భువనేశ్వర్ వెళ్లు కోణార్క్ ఎక్స్ప్రెస్ (11019)ను గంట పాటు నిలిపి వేశారు. ఇలా ప్రతి రోజూ జరుగుతుండడంతో మహబూబాబాద్, ఖమ్మం రోజువారీగా వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
- కోణార్క్ ఎక్స్ప్రెస్ శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు సికింద్రాబాద్కు రావాల్సి ఉండగా 4.31 గంటలకు వచ్చింది. ముంబయి నుంచి ఆలస్యంగా వచ్చిన సమయంలో వందేభారత్, కోణార్క్ ఎక్స్ప్రెస్ రైళ్ల సమయం కొద్ది తేడాతో ఉండటం వల్ల కాజీపేట లేదా వరంగల్ పరిసర ప్రాంతాల్లో కోణార్క్ను నిలిపి వేస్తున్నారు. వరంగల్కు వందేభారత్ ఎక్స్ప్రెస్ ఉదయం 6.40 గంటలకు వస్తుంది. ఈసమయంలో శుక్రవారం కోణార్క్ ఎక్స్ప్రెస్ చింతలపల్లి రైల్వే స్టేషన్ దాటి వెళ్లింది. వందేభారత్ ను పంపడానికి దాన్ని చింతపల్లి రైల్వే స్టేషన్లో నిలిపి వందేభారత్ను పంపారు. ఇదే సమయంలో రెండు గూడ్సు రైళ్లు, ఎక్స్ప్రెస్ రైళ్ల సమయం ఉండటంతో వాటిని పంపడానికి కోణార్క్ను అరగంట పాటు అక్కడే నిలిపి వేశారు. మహబూబాబాద్కు ఉదయం 6.32 గంటలకు వెళ్లాల్సి ఉండగా 9.06కు, ఖమ్మంకు 7.20 బదులు 9.45కు వెళ్లింది. కాజీపేట నుంచి ఉదయం ఖమ్మం, మహబూబూబాద్ వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు కోణార్క్ను ఆశ్రయిస్తున్నారు.
- వందేభారత్ వచ్చాక కోణార్క్ వేళలు గందరగోళంగా మారాయని, దీంతో ప్రయాణికులకు రైల్వే మీద నమ్మకం పోతుందని మాధవ్ అనే ప్రయాణికుడు వాపోయారు.
- ఉదయం కాజీపేట నుంచి ఖమ్మం వెళ్లు పుష్పుల్, ఇతర రైళ్లు ఆలస్యం అవుతున్నాయని.. కోణార్క్ను ఆశ్రయిస్తే ఇది కూడా అలాగే అవ్వడం వల్ల విలువైన సమయం వృథాకావడంతో పాటు కార్యాలయాలకు, వ్యాపారం, కళాశాలలకు సమయానికి వెళ్లలేకపోతున్నామని శోభ అనే ప్రయాణికురాలు తెలిపారు.
- ఈ విషయంపై స్థానిక రైల్వే ట్రాఫిక్ అధికారులను వివరణ కోరగా ముంబయి నుంచి వచ్చే కోణార్క్ ఆలస్యం కావడం వల్ల ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. ముంబయి రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి కోణార్క్ సరైన సమయానికి నడిచేలా చూస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం