TSRTC: ఆర్టీసీలో జీరో టికెట్ల తిర‘కాసు’!
ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది.
హనుమకొండ చౌరస్తా, న్యూస్టుడే : ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. అయితే ఈ జీరో టికెట్లు కొట్టడంలో ఆర్టీసీ కండక్టర్లు కొందరు తిరకాసు చూపుతున్నారు. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో ప్రయాణించే మహిళలకు ఆధార్ కార్డు ఉంటే వారికి జీరో టికెట్ కొట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటికి సంబంధించిన డబ్బులు ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లిస్తుంది. అయితే పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో తక్కువ మంది మహిళలు ప్రయాణించినా కొందరు ఎక్కువ టికెట్లు జారీ చేస్తూ.. ఎక్కువ అక్యుపెన్సీ రేషియో చూపిస్తున్నారు.
కారణం ఇదీ..: ఆర్టీసీ సంస్థ కండక్లర్లు, డ్రైవర్లకు ఎక్కువ ఆక్యుపెన్సీ తీసుకురావాలని, ఇంధనాన్ని పొదుపుగా వాడాలని, సంస్థ ఆదాయాన్ని పెంచాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇది వరకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణికులు ఆటోలు, జీపుల్లో ఎక్కువగా ప్రయాణించేవారు. ఆర్టీసీ బస్సులు చాలావరకు పలు రూట్లలో ఖాళీగా కనిపించేవి. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమల్లోకి తేవడంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికులు కిక్కిరిసి పోతున్నారు. ఇదే అదనుగా కొందరు కండక్టర్లు ఎక్కువ టికెట్లు జారీ చేస్తూ లక్ష్యానికి మించి అక్యుపెన్సీ రేషియో చూపుతున్నారు. దీనిద్వారా జీరో టికెట్ డబ్బులు చెల్లించే సమయంలో ప్రభుత్వంపై మరింత భారం పడే అవకాశం ఉంది. ఎలాగూ ఉచితమే కదా.. అని కొన్నిచోట్ల కండక్టర్లు ఒకటికి బదులు రెండు టికెట్లు జారీ చేస్తున్నట్లు సమాచారం.
ఇటీవల జరిగిన ఘటనలు కొన్ని..
- ఇటీవల పరకాల నుంచి చర్లపల్లికి ఆర్టీసీ బస్సులో వెళ్తున్న మహిళా ప్రయాణికురాలికి కండక్టర్ ఒక టికెట్కు బదులు రెండు జీరో టికెట్లు ఇచ్చారు. నేను ఒక్కదాన్నే కదా.. రెండు ఎందుకంటే.. ఉచితమే కదా.. ఎన్ని ఇస్తే ఏంటి.. మీరేమైనా డబ్బులు ఇస్తున్నారా.. అంటూ కండక్టర్ జవాబిచ్చారు.
- వరంగల్ ఆర్టీసీ రీజియన్లోని ఓ డిపోలో కండక్టర్ మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కువ అక్యుపెన్సీ కోసం అవసరం లేకున్నా రూ.లక్ష విలువైన జీరో టికెట్లు జారీ చేశారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో ఆ కండక్టరును సస్పెండ్ చేసినట్లు సమాచారం.
- మరో డిపో పరిధిలో ఓ కండక్టర్ మహిళా ప్రయాణికులు తక్కువ ఉంటే.. స్టేజీ వచ్చే సమయానికి జీరో టికెట్లు కొట్టి చించి బయట పడేయడం చూసి ప్రయాణికులు ముక్కున వేలేసుకున్నారు.
- మరికొందరు కండక్టర్లు మహిళా ప్రయాణికులు దిగాల్సిన స్టేజీ కంటే దూరానికి జీరో టికెట్ ఇస్తున్నారు. దీనిద్వారా ఎక్కువ ఆదాయం చూపుతున్నారు.
అలా జరగవు..
-జె.శ్రీలత, ఆర్టీసీ ఆర్ఎం, వరంగల్
మా రీజియన్ పరిధిలో ప్రయాణికులు తక్కువ ఉన్నా ఎక్కువ జీరో టికెట్లు జారీ చేయడం జరగదు. అలాంటి అవకాశం లేదు. డిపోల్లో అలాంటివి జరిగితే.. నిఘా పెట్టి చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్