అంగన్వాడీకెళ్తే బతికేవాడివి బిడ్డా..
వివాహ వేడుకలో బంధువులతో ఆనందంగా గడిపిన తండ్రీకొడుకులను తిరుగుప్రయాణంలో మాటేసిన మృత్యువు కర్కశంగా చిదిమేసింది.
రహదారి ప్రమాదంలో తండ్రీకొడుకుల దుర్మరణం
హరీష్, అశ్విత్తేజ్ (పాతచిత్రాలు)
వివాహ వేడుకలో బంధువులతో ఆనందంగా గడిపిన తండ్రీకొడుకులను తిరుగుప్రయాణంలో మాటేసిన మృత్యువు కర్కశంగా చిదిమేసింది. వెంటనే వచ్చేస్తాం అంటూ చెప్పిన వారిని విధి అందనంత దూరం తీసుకెళ్లిపోయింది. ఈ పిడుగు లాంటి వార్త వినగానే ఇంటి వద్ద భార్య, పెళ్లి వేడుకల్లో ఉన్న బంధువులు గుండెలవిసేలా రోదించారు. వేడుకకు రాకపోయినా బతికే వారు కదా అని బంధువులు.. ఇంటి వద్ద ఉంటే కొడుకు అంగన్వాడీ కేంద్రానికి, భర్త పనికి వెళ్లేవారని భార్య విలపించిన తీరు తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
తొర్రూరు, చిన్నగూడూరు, న్యూస్టుడే
ఇంటి వద్ద విలపిస్తున్న తల్లి గౌతమి
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన జక్కుల హరీష్ (28) వ్యవసాయం చేస్తూ ట్రాక్టరు నడుపుతుండేవారు. ఆయనకు భార్య గౌతమి, కుమారుడు ఆశ్విత్తేజ్ (5) ఉన్నారు. అశ్విత్ గ్రామంలోని అంగన్వాడీలో చదువుకుంటున్నారు. శనివారం ఉదయం హరీష్ గ్రామంలోని ఉపాధిహామీ పనికి వెళ్లొచ్చారు. తొర్రూరులో బంధువుల వివాహ రిసెప్షన్ ఉండడంతో ఉదయం 10.45 గంటలకు తన కుమారుడిని తీసుకొని ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి వెళ్లారు. ఆ వేడుకకు వచ్చిన బంధువులతో సంతోషంగా గడిపి.. అందరితో కలిసి ఫొటోలు దిగారు. భోజనం చేశాక ఇంటికి తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో తొర్రూరు మాటేడు శివారులోని మూలమలుపు వద్ద ఖమ్మం నుంచి కరీంనగర్కు వెళ్తున్న ప్రైవేట్ అద్దె పెళ్లి బస్సు వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరీష్తోపాటు అశ్విత్తేజ్ ఎగిరి రోడ్డుపై పడిపోవడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానిక ఎస్సై జగదీష్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఖమ్మంకు చెందిన శ్రీశ్రీ ట్రావెల్స్ బస్సుగా గుర్తించామని, డ్రైవర్ పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు.
సంఘటన స్థలంలో మృతదేహాల వద్ద రోదిస్తున్న బంధువులు
అశ్విత్తేజ్ స్థానిక అంగన్వాడీలో ప్రీ స్కూల్ విద్యార్థి. బడికి వస్తే బతికేవాడివి కదా అని టీచర్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. బాలుడు తన తాత మల్లయ్యతో కలిసి ఇన్స్టాగ్రాం రీల్స్ చేస్తుంటే ఇరుగుపొరుగు వారు ఆసక్తిగా చూసేవారని స్థానికులు చెబుతున్నారు. మనువడు మృతి చెందడంతో తనతో కలిసి వీడియోలు ఎవరు చేస్తారని తాత గుండెలవిసేలా రోదించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం