మిల్లర్ల మాయాజాలం...!
ఉమ్మడి జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి ఇవ్వకుండా మిల్లర్లు మొండికేస్తున్నారు. సీఎంఆర్ సొమ్ముతో దర్జాగా వ్యాపారాలు చేస్తున్నారు. ప్రస్తుతం మిల్లర్ల వద్ద రూ.819 కోట్ల విలువ చేసే బియ్యం ఉంది.
బియ్యం బకాయిలు రూ. 819 కోట్లు
సీఎంఆర్ సొమ్ముతో వ్యాపారాలు
ఉమ్మడి జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి ఇవ్వకుండా మిల్లర్లు మొండికేస్తున్నారు. సీఎంఆర్ సొమ్ముతో దర్జాగా వ్యాపారాలు చేస్తున్నారు. ప్రస్తుతం మిల్లర్ల వద్ద రూ.819 కోట్ల విలువ చేసే బియ్యం ఉంది. వీటిని ఈనెల 30వ తేదీ వరకే ఎఫ్సీఐకి అందించాలి. అలాంటిది నిర్దేశిత లక్ష్యంలో ఇప్పటి వరకు కేవలం 24.97 శాతం బియ్యమే అందించారు. ఇంకా 75.03 శాతం ఇవ్వాల్సి ఉంది. బకాయిపడిన బియ్యాన్ని రాబట్టడానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించడంతో గత మూడు రోజులుగా కాజీపేట ఎఫ్సీఐకి లారీలు వరసకడుతున్నాయి.
న్యూస్టుడే, కాజీపేట: ఒక వైపు అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నా కస్టమ్ మిల్లర్ల వరస మారడం లేదు. రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించి వాటిని మరాడించడానికి మిల్లర్లకు అందిస్తాయి. నిర్ణయించిన సమయానికి మిల్లర్లు బియ్యంగా మార్చి ఎఫ్సీఐకి అందించాలి. ఇక్కడే వారు మొరాయిస్తున్నారు. అనేక కారణాలను చెబుతూ నిర్ణయించిన చివరి తేదీని వాయిదాలు వేయించుకుంటారు. దీనికి రాజకీయంగానూ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తారు. వెరసి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబరు వరకు ఈ తంతు సాగుతుంది.
హనుమకొండ బాయిల్డ్ మిల్లర్లు భేష్..
హనుమకొండలో చాలా మంది కస్టమ్ మిల్లర్లు బియ్యం అందించడంలో వెనుకపడి ఉన్నా బాయిల్డ్ రైస్ అందించే మిల్లర్లు మాత్రం ముందంజలో ఉన్నారు. వీరికి ఇచ్చిన లక్ష్యాన్ని ఇప్పటికే పూర్తి చేసి మరిన్ని బాయిల్డ్ రైస్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల వీరు కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఏం చేస్తారంటే..
ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యాన్ని మరాడించి కొందరు మిల్లర్లు బయటి మార్కెట్లో ఎక్కువ మొత్తానికి విక్రయిస్తారు. మరికొందరు ఎక్కువ ధర ఉన్న ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తారు. ఇలా వచ్చిన సొమ్ముతో వడ్డీ వ్యాపారం లేదా రియల్ ఎస్టేటు, లేదా ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి 6 నుంచి 8 నెలల పాటు వారి వద్దే పెట్టుకుంటారు. బయటి మార్కెట్లో ఎక్కువ ధర ఉన్నప్పుడు అమ్ముకుని ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు లభించే బియ్యం తీసుకొచ్చి ఎఫ్సీఐకి అందిస్తున్నారు. బియ్యం ధరలో తేడా వారికి రూ.కోట్లు కురిపిస్తోంది.
ప్రభుత్వానికి వడ్డీ భయం
కస్టమ్ మిల్లర్ల నుంచి బియ్యం వీలైనంత త్వరగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించడానికి కారణం వడ్డీ చెల్లింపులు. ముందుగా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చి మరాడించి తిరిగి ఇవ్వడానికి పట్టె సమయానికి (2 నెలలు) కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వానికి వడ్డీ చెల్లిస్తుంది. సకాలంలో తిరిగి చెల్లించని (ఈనెల 30 వరకు చివరి తేదీ) పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ భారాన్ని భరించలేక కస్టమ్ మిల్లర్ల నుంచి సకాలంలో తీసుకోవాలని స్థానిక అధికారులు భావిస్తున్నారు. అయినా కొందరు మిల్లర్లు రాజకీయ అండతో తాము అనుకున్నప్పుడే బియ్యం అందజేస్తారు.
ఇదీ పరిస్థితి..
- గత వానాకాలం చివరలో సేకరించిన ధాన్యాన్ని మరాడించిన కొందరు మిల్లర్లు ఒక్క గింజ కూడా ఇప్పటి వరకు ఎఫ్సీఐకి అందించలేదు. ఒక్క హనుమకొండ జిల్లాలోనే 16 మంది మిల్లర్లు ఇంకా స్పందించలేదని తేలింది. వీరి వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు.
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ జిల్లాలో 34.666 మెట్రిక్ టన్నుల లక్ష్యానికి ఇప్పటి వరకు 5059 మె.ట.మాత్రమే (14.5 శాతం) తిరిగి అందించి అందరి కంటే వెనుకబడి ఉన్నారు. గతంలో ఇక్కడి మిల్లర్ల తీరును అధికారులు గమనించి మహబూబాబాద్లో పండిన పంటలో కొంత భాగం హనుమకొండ జిల్లా మిల్లర్లచేత మరాడించారు. అయినా వారి తీరు మారడం లేదు.
- అందరి కంటే జనగామ జిల్లా మిల్లర్లు కొంత ముందంజలో ఉన్నారు. వీరు ఇప్పటి వరకు 40.83 శాతం బియ్యం అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం