సొంతింటి కల నెరవేరుస్తాం..
కార్మికులకు సొంతింటి కల నెరవేరుస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు వెల్లడించారు. గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్హాల్లో ఆదివారం సింగరేణి కోల్మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్టీయూసీ) మహాసభ నిర్వహించారు.
మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్బాబు, చిత్రంలో ఎమ్మెల్యేలు మక్కాన్సింగ్, వినోద్, వివేక్ వెంకటస్వామి, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ తదితరులు
గోదావరిఖని, న్యూస్టుడే : కార్మికులకు సొంతింటి కల నెరవేరుస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు వెల్లడించారు. గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్హాల్లో ఆదివారం సింగరేణి కోల్మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్టీయూసీ) మహాసభ నిర్వహించారు. ఎమ్మెల్యేలు మక్కాన్సింగ్, ప్రేమ్సాగర్రావు, వినోద్, వివేక్వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్రావుతో పాటు ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణలు హాజరయ్యారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.జనక్ప్రసాద్ అధ్యక్షతన జరిగిన మహాసభకు హాజరైన మంత్రి మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏవిధంగా భారాసను మట్టికరిపించారో అదే విధంగా లోక్సభ ఎన్నికల్లో తీర్పు ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి సహకరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక చట్టాలను రద్దు చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, కార్మికుల్లోకి ఈ అంశాన్ని విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటుతో పాటు కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు, సౌకర్యాలు పెరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. ఆదాయ పన్ను విషయంలో కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని, సింగరేణి కార్మికులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేసేందుకు కృషి చేస్తామని, విశ్రాంత కార్మికుల పింఛను పెరుగుదలకు ప్రయత్నిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అనిల్కుమార్, ఐఎన్టీయూసీ నాయకులు ఎస్.నర్సింహారెడ్డి, పి.ధర్మపురి, త్యాగరాజన్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్తోనే కార్మికుల హక్కులకు రక్షణ : దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే కార్మికుల హక్కులు కాపాడుకోగలమని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి వెల్లడించారు. ఆదివారం నిర్వహించిన మహాసభలో ఆయన మాట్లాడారు. రాహుల్గాంధీని ప్రధానిని చేయాలని జాతీయ స్థాయిలో ఐఎన్టీయూసీ ప్రత్యేక తీర్మానం చేసిందన్నారు. దానికి అనుగుణంగా ఐఎన్టీయూసీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు. భాజపా ప్రభుత్వం కార్మిక వర్గానికి తీరని నష్టం చేసిందని, మళ్లీ అధికారంలోకి వస్తే కార్మికులకు స్వేచ్ఛ లేకుండా పోతుందన్నారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు