జాతీయ రహదారి విస్తరణ.. ఆగుతూ సాగుతూ!
హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారి 163 విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్ల కిందట గుత్తేదారు పనులను ప్రారంభించారు. రహదారికి ఇరువైపులా చెట్లను తొలగించారు.
దామెర మండలం ఒగ్లాపూర్ వద్ద అసంపూర్తిగా పనులు
హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారి 163 విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్ల కిందట గుత్తేదారు పనులను ప్రారంభించారు. రహదారికి ఇరువైపులా చెట్లను తొలగించారు. ఇప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో పలుచోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.
పరకాల, దామెర, న్యూస్టుడే
ఇబ్బందులు ఇలా..
- పనులు జరిగే ప్రదేశంలో కంకర, మొరం పోశారు. వీటిపై నీళ్లు చల్లకపోవడంతో దుమ్మూ, ధూళి లేస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
- ఆరెపల్లి నుంచి గుడెప్పాడ్ క్రాస్ రోడ్డు మధ్యలో ఒగ్లాపూర్ బస్టాండ్, సైలానిబాబా దర్గా, పవర్గ్రిడ్ వద్ద కొంత మేర పనులను నిలిపివేశారు.
- కల్వర్టుల వద్ద వంతెనలు నిర్మించాల్సి ఉండగా.. ఇప్పటికీ పనులు మొదలు పెట్టలేదు.
- ఆత్మకూరు మండలం కటాక్షపూర్ చెరువు వద్ద హైలెవెల్ వంతెన మంజూరైనా పనులను ప్రారంభించలేదు. రానున్న వర్షాకాలంలో కటాక్షపూర్ చెరువులో వరదనీరు చేరితే జాతీయ రహదారిపై మత్తడి ప్రవహిస్తుంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోతాయి.
- ఇటీవల ఊరుగొండలోని ఎస్సారెస్పీ వంతెనపై ఓ వాహనం డీజిల్ ట్యాంక్ పైప్లైన్ పగిలిపోవడంతో వంతెనపైనే నిలిచిపోయింది. దీంతో జాతీయరహదారిపై ఇరు వైపులా వేలాది వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులకు 2 గంటల సమయం పట్టింది.
- ఇటీవల ఒగ్లాపూర్ బస్టాండ్ వద్ద ద్విచక్రవాహనదారుడు ప్రయాణిస్తుండగా.. రహదారిపై దుమ్ము లేచి ఎదురుగా వచ్చిన రహదారి కనిపించకపోవడంతో ముందు వెళ్తున్న మరో వాహనదారుడిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
ఆర్నెల్లలో పనులు పూర్తి చేస్తాం
చేతన్, ఏఈ, జాతీయ రహదారి
జాతీయ రహదారి విస్తరణ పనులు ఆర్నెల్లలో పూర్తయ్యే అవకాశాలున్నాయి. కంఠాత్మకూరు, నీరుకుళ్ల హై లెవెల్ వంతెన పనులు ఇప్పట్లో పూర్తి కావు. కటాక్షాపూర్ చెరువు మత్తడి సమీపంలో నేరేడుపల్లికి వెళ్లే రోడ్డుకు ఇబ్బందులు కలగకుండా రీ డిజైన్ చేయాల్సి ఉంది. వీటికి అనుమతి కోసం దిల్లీకి ప్రతిపాదనలు పంపించాం.
పేరు: హైదరాబాద్- భూపాలపట్నం జాతీయ రహదారి 163
ఎక్కడి నుంచి ఎక్కడికి: హైదరాబాద్ నుంచి భువనగిరి, జనగామ, స్టేషన్ఘన్పూర్, హనుమకొండ, ఆత్మకూరు, మల్లంపల్లి,ములుగు, ఏటూరునాగారంతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని చంద్రపట్ల, భద్రకాళి పట్టణాల మీదుగా భూపాలపట్నం వరకు
కి.మీ.: 334 ప్రత్యేకత: తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సులువైన రవాణా మార్గం.
- ‘హనుమకొండ జిల్లా ఆరెపల్లి నుంచి ములుగు జిల్లా వరకు 33 కి.మీ. మేర నాలుగు వరుసల రహదారిగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.330 కోట్లు మంజూరు చేసింది.’
నాణ్యత లోపాలు..
ములుగు జిల్లా మల్లంపల్లి వద్ద విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. విభాగినుల నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడంతో ద్విచక్రవాహనాలు ఢీకొని కూలిపోతున్నాయి. ఒగ్లాపూర్, ఊరుగొండ వద్ద విభాగినులపై 3 నెలల క్రితం సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీటికి విద్యుత్తు అందించకపోవడంతో రాత్రివేళ అంధకారం నెలకొంటోంది. పనులు జరుగుతున్న ప్రదేశాల వద్ద గుత్తేదారు ప్రమాద సూచికలను ఏర్పాటు చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్