logo

వారు ఒక్కసారీ గెలవలేదు..!

చట్టసభలకు ఎన్నికలు జరిగే క్రమంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు అనేక మంది స్వతంత్రులు బరిలో నిలుస్తుంటారు.

Published : 22 Apr 2024 03:09 IST

మీకు తెలుసా..

ఈనాడు, వరంగల్‌: చట్టసభలకు ఎన్నికలు జరిగే క్రమంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు అనేక మంది స్వతంత్రులు బరిలో నిలుస్తుంటారు. ఉమ్మడి వరంగల్‌లో ఇప్పుడున్న వరంగల్‌ (ఎస్సీ), మహబూబాబాద్‌ (ఎస్టీ)తోపాటు గతంలో ఉన్న హనుమకొండ లోక్‌సభ నియోజకవర్గం చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా స్వతంత్రులు విజయం సాధించలేదు. 2019లో వరంగల్‌ నుంచి 15 మంది, మహబూబాబాద్‌ నుంచి 14 మంది  బరిలో నిలవగా వారిలో ఆరుగురు చొప్పున స్వతంత్రులు ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఇప్పటికే పలువురు నామపత్రాలు దాఖలు చేశారు. ఫలితాలు ఎలా ఉంటాయో జూన్‌ 4 రోజున స్పష్టమవుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని