గల్లీ నుంచి దిల్లీకి మన్యం మహిళ..!
భద్రాచలం మన్యానికి చెందిన రాధాబాయి ఆనందరావు నాలుగు సార్లు వరసగా నెగ్గి పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించి తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి భద్రాచలం ఎంపీగా 1967, 1971, 1977, 1980లో విజయబావుటా ఎగురవేసి మహిళా శక్తిని అప్పట్లోనే చాటిచెప్పారు.
నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన రాధాబాయి ఆనందరావు
భద్రాచలం, న్యూస్టుడే: భద్రాచలం మన్యానికి చెందిన రాధాబాయి ఆనందరావు నాలుగు సార్లు వరసగా నెగ్గి పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించి తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి భద్రాచలం ఎంపీగా 1967, 1971, 1977, 1980లో విజయబావుటా ఎగురవేసి మహిళా శక్తిని అప్పట్లోనే చాటిచెప్పారు. అప్పట్లో ప్రధాని ఇందిరగాంధీతో మాట్లాడాలంటే కాకలు తీరిన నాయకులు సైతం జంకేవారట. ఈమె మాత్రం నేరుగా ఇందిరను కలిసి ఈ ప్రాంత సమస్యలు ప్రస్తావించే చనువు పెంచుకుని ఆనాటి రాజకీయాల్లో ఓ సంచలనంగా నిలిచారు. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి వంటి అగ్ర నాయకులతో రాజకీయ పరిచయాలు ఉండేవి. గిరిజనుల సంపూర్ణ వికాసం కోసం ఐటీడీఏల అవసరాన్ని గుర్తించి వీటి ఏర్పాటుకు జాతీయ స్థాయిలో ప్రయత్నం చేశారు. పశ్చిమ జర్మనీ, జకొస్లొవేకియా, బ్రిటన్ వంటి దేశాలలో పర్యటించారు. విదేశీ వ్యవహారాలలో అనుభవం గడించారు. ఉత్తమ పార్లమెంటేరియన్గానూ గుర్తింపు పొందారు. ఓయూ సెనేట్ సభ్యురాలిగా కొంత కాలం పని చేసిన రాధాబాయి ఆనందరావు ట్రైకార్ అధ్యక్షురాలిగా గిరిజన అభివృద్ధికి పాటుపడ్డారు.
- సామాన్య గిరిజన కుటుంబంలో జన్మించిన ఆమె వ్యూహ ప్రతివ్యూహాల్లో దిట్టగా గల్లీ నుంచి దిల్లీ దాకా ఎదిగారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వెంకటాపురంలో 1930లో ఆమె జన్మించారు. వెంకటాపురం ప్రస్తుతం ములుగు జిల్లాలో ఉంది. ఇది భద్రాచలం అసెంబ్లీ పరిధిలోని మండలం. రాజమండ్రిలో ఉపాధ్యాయ విద్యను అభ్యసించిన రాధాబాయి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఉపాధ్యాయురాలిగా సేవలు అందించారు. హిందీ పండిట్గా జాతీయ భాషపై విశేష ప్రచారం కల్పించారు. 1952లో కొత్తగూడేనికి చెందిన ఆనందరావును వివాహం చేసుకున్నారు. భర్త ప్రోత్సాహంతో వైద్య వృత్తిపై ఆసక్తి పెంచుకుని నర్సింగ్ శిక్షణ పూర్తయ్యాక కుటుంబ నియంత్రణపై గిరిజన గ్రామాల్లో 1957 నుంచి 1966 వరకు ప్రచారం చేశారు. దేశ రాజకీయాల్లో ప్రత్యేకతను చాటిన భద్రాచలం ఎంపీ స్థానం 2009లో రద్దు కావడంతో ఇది మహబూబాబాద్ ఎంపీ స్థానంలో భాగమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం