ఎన్నికల్లో అక్రమాలా.. మీరూ అడ్డుకోండి..
లోక్సభ ఎన్నికల సందడి మొదలైంది. నామపత్రాల దాఖలు ప్రక్రియ సాగుతోంది. భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా ఎన్నికలు మరింత పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటోంది.
అందుబాటులోకి ప్రత్యేక యాప్లు
లోక్సభ ఎన్నికల సందడి మొదలైంది. నామపత్రాల దాఖలు ప్రక్రియ సాగుతోంది. భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా ఎన్నికలు మరింత పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పలు యాప్లు, టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఆ వివరాలు మీ కోసం..
సీ-విజిల్ యాప్..
ఎన్నికల ప్రవర్తన నియమావళి(ఎంసీసీ) ఉల్లంఘిస్తే సీ విజిల్ యాప్ ద్వారా ఎన్నికల అధికారికి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు, అనుచరగణం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, అల్లర్లకు పాల్పడినా.. డబ్బు, మద్యం, ఇతరత్రా కానుకలు పంపిణీ చేసినా.. దీని ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో అధికారులు చర్యలు తీసుకుంటారు.
సువిధ యాప్..
ఈ యాప్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఉపయోగపడుతుంది. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఆన్లైన్లో ప్రచార వాహనాలకు, మైకులు, సభలు, సమావేశాలకు, తదితర పలురకాల అనుమతులు పొందడానికి వీలు ఉంటుంది. ఈ యాప్ను వినియోగించుకుని అభ్యర్థులు ఇంటి నుంచే అనుమతులు పొందవచ్చు. సంబంధిత నోడల్ అధికారి, సెక్షన్ అధికారులు, సాంకేతిక అధికారులు అందుబాటులో ఉంటారు. దరఖాస్తుదారుడు ఆన్లైన్లో పొందుపర్చిన పత్రాలను పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్నట్లయితే అనుమతులు ఇస్తారు. ఈ విషయాన్ని దరఖాస్తుదారుడికి సమాచారం ఇస్తారు. తర్వాత దరఖాస్తుదారుడు అనుమతి పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా వచ్చిన దరఖాస్తును వారు పరిశీలించి అనుమతులు ఇస్తుంటారు. ఈ యాప్ను కూడా ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
డౌన్లోడ్ ఇలా..
ఇంటర్నెట్ కలిగి ఆండ్రాయిడ్ ఉన్న మొబైల్తో గూగుల్ ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియోలు, ఫొటోలు, ఆడియోల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫొటోలు, వీడియోలు చిత్రీకరించేటప్పుడు ఆటోమేటిక్గా వాటికి జియో ట్యాగింగ్ కూడా వస్తుంది. అధికారుల దర్యాప్తులో ఇదే కీలక సాక్ష్యం అవుతుంది. సమస్యను బట్టి పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతారు.
ఓటరు సందేహాల నివృత్తికి 1950
ఓటుకు సంబంధించిన ఏ సందేహానికైనా టోల్ఫ్రీ నెంబరు 1950కి ఫోన్ చేయొచ్చు. ఓటరు కార్డు స్టేటస్, ఓటు నమోదు, పోస్టల్ ఓటుకు సంబంధించిన వివరాలు, ఇతరత్రా సమాచారం ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఓటరు కార్డు వివరాలుంటే పోలింగ్ కేంద్రం పరిధి కూడా తెలుసుకునే వీలుంటుంది. 24 గంటలూ ఈ నెంబరు అందుబాటులో ఉంటుంది.
వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయం
వృద్ధులు, దివ్యాంగుల కోసం ‘సక్షం ఈసీఐ’ అనే యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అధికారులు ఈ వివరాలను పరిశీలించి.. దివ్యాంగులు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసేందుకు రవాణా సదుపాయం కల్పిస్తారు. సహాయకుడితో పాటు మూడు చక్రాల సైౖకిళ్లను అందుబాటులో ఉంచుతారు.
పారదర్శకత కోసం మరిన్ని...
ఖానాపురం (నర్సంపేట): లోక్సభ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మూడు యాప్లు ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. ప్లే స్టోర్ నుంచి వీటిని దిగుమతి చేసుకోవచ్చు.
ఓటరు జాబితాలో తప్పుల సవరణ
‘ఓటరు హెల్ప్లైన్’ యాప్ ద్వారా ఓటర్లు ఓటరు జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో చూసుకోవచ్చు. తప్పుల సవరణ, ఓటు బదిలీ, ఫిర్యాదు, ఓటరు గుర్తింపు కార్డును డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది.
అభ్యర్థుల సమాచారం
నియోజకవర్గాల వారీగా ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల వివరాలను తెలుసుకునేందుకు ‘నో యువర్ క్యాండిడేట్ (కేవైసీ)’ అనే యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో అభ్యర్థుల వివరాలు, విద్యార్హతలు, నేర చరిత్ర, ఆస్తులు తదితర వివరాలు ఉంటాయి.
- ఇటీవల భూపాలపల్లి పట్టణంలో ఓ వ్యక్తి ఆయుధాలతో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సి విజిల్ యాప్నకు ఫిర్యాదు అందింది. వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం (ఎఫ్ఎస్టీ) స్పందించి అక్కడికి వెళ్లి పరిశీలించింది. సంబంధిత వ్యక్తిని విచారించి సమస్యను పరిష్కరించారు.
- రెండ్రోజుల కిందట హనుమకొండకు చెందిన ఓ యువతి 1950కి ఫోన్ చేశారు. ఆమె మార్చి నెలలో ఓటుహక్కు నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నానని.. ఓటరు గుర్తింపు(ఐడీ) కార్డు ఎప్పుడు వస్తుందని అడిగారు. ఏప్రిల్ 15వ తేదీ తర్వాత కార్డు పోస్టల్ సర్వీసు ద్వారా ఇంటివద్దకే వస్తుందని సిబ్బంది సమాధానం చెప్పారు.
- మహబూబాబాద్కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు నమోదుకు ఎప్పటి వరకు గడువు ఉందని ఇటీవల 1950కి ఫోన్ చేసి అడిగారు. స్పందించిన సిబ్బంది ఏప్రిల్ 15వ తేదీ వరకు గడువున్నట్లు సమాచారం ఇచ్చారు.
- ఇటీవల ములుగుకు చెందిన ఓ యువకుడు పట్టణంలో పలుచోట్ల గోడలపై రాజకీయ నేతల బొమ్మలు, ప్రచార రాతలు ఉన్నాయని సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి వెళ్లిన అధికారులు వాటిని తొలగించారు.
- ఓ పార్టీ తరఫున పోటీచేస్తున్న వరంగల్కు చెందిన అభ్యర్థి.. కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించేందుకు అనుమతులు కావాలని సువిధ యాప్లో దరఖాస్తు చేసుకున్నారు. సంబంధిత పత్రాలను తనిఖీ చేసి రిటర్నింగ్ అధికారి అనుమతులు ఇచ్చారు.
- జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో రాజకీయ పార్టీ ప్రచార పోస్టర్లు, నినాదాలకు సంబంధించిన బ్యానర్లు తొలగించలేదని సి విజిల్ యాప్ ద్వారా ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి 40 నిమిషాల్లో వాటిని తొలగించి, ఫిర్యాదుదారుడికి విషయాన్ని చేరవేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు