గెలుపే లక్ష్యంగా భారాస ప్రచార వ్యూహం
విపక్ష భారాస ఉమ్మడి వరంగల్ పరిధిలోని వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధం చేసింది. ఇందుకు అనుగుణంగా ప్రచార వ్యూహాలు రచిస్తోంది.
28న వరంగల్, మే 1న మహబూబాబాద్లో గులాబీ అధినేత రోడ్డుషోలు
ఈనాడు, వరంగల్: విపక్ష భారాస ఉమ్మడి వరంగల్ పరిధిలోని వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధం చేసింది. ఇందుకు అనుగుణంగా ప్రచార వ్యూహాలు రచిస్తోంది. గులాబీ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రచారానికి షెడ్యూలు సైతం ఖరారైంది. ప్రత్యేకంగా బహిరంగ సభలు కాకుండా ఎన్నికల ప్రచారాన్ని రోడ్డు షోల రూపంలో నిర్వహించనున్నారు.
- ఈ నెల 28న కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా రోడ్డు షో నిర్వహిస్తారు. అంబేడ్కర్ కూడలి నుంచి హనుమకొండ చౌరస్తా వరకు జరిగే ప్రదర్శన కోసం తగిన జనసమీకరణ చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. కనీసం 50 వేల మందికి తక్కువ కాకుండా జనసమీకరణ చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హనుమకొండ చౌరస్తాలో జరిగే కార్నర్ మీటింగ్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. ఆ రోజు రాత్రి మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో కేసీఆర్ బస చేయనున్నారు. వరంగల్ పశ్చిమ, తూర్పుతోపాటు, పరకాల తదితర నియోజకవర్గాల ద్వారా కేసీఆర్ బస్సు యాత్ర సాగేలా రూట్మ్యాప్ రూపొందిస్తున్నట్టు జిల్లా భారాస పార్టీ శ్రేణులు తెలిపారు.
- మే 1న సాయంత్రం ఆరింటికి మానుకోట పట్టణంలో కేసీఆర్ రోడ్డు షో నిర్వహిస్తారు. ఇక్కడా భారీ జనసమీకరణకు నేతలు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
నేడు నామినేషన్ ర్యాలీ
బాలసముద్రం, న్యూస్టుడే: వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థిగా సుధీర్కుమార్ సోమవారం నామినేషన్ వేస్తారని మాజీ చీఫ్ విప్, భారాస హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. ఆదివారం బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ కార్యాలయం నుంచి ఉదయం 11 గంటలకు భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పిస్తారని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తమ పార్టీకి అనుకూలంగా మారాయని, రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని భాజపాపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. అభ్యర్థి సుధీర్కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన హామీలు కాజీపేట రైల్వే కోచ్, బయ్యారం ఉక్కు పరిశ్రమల హామీలను కేంద్రం విస్మరించిందన్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి భారాసకు చేసిన అన్యాయం ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. అరూరి రమేశ్ను వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. చుట్టూ భూములు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తన నామినేషన్ కార్యక్రమానికి కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, భాజపాలు హామీలను నెరవేర్చలేదన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. వరంగల్ ప్రజలు ధర్మం వైపు ఉండి సుధీర్కుమార్ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కుడా మాజీ ఛైర్మన్లు సుందర్రాజ్ యాదవ్, యాదవరెడ్డి, భారాస కార్పొరేటర్లు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.
రేపు కేటీఆర్ పర్యటన..
భారాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ మంగళవారం వరంగల్లో పర్యటించనున్నారు. వరంగల్ నాని గార్డెన్లో తూర్పు నియోజకవర్గం, హంటర్రోడ్డులోని డి కనెక్వన్షన్ హాల్లో వర్ధన్నపేట నియోజకవర్గం విస్తృత సమావేశాల్లో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు