సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!
ఓ వైపు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండగా అదే తరహాలో సైబర్ మోసాలు విజృంభిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కారణంగా స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగింది.
నెహ్రూసెంటర్, న్యూస్టుడే: ఓ వైపు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండగా అదే తరహాలో సైబర్ మోసాలు విజృంభిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కారణంగా స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగింది. అమాయక ప్రజలను పలు రకాల ఆఫర్లు, ప్రలోభాలకు గురి చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. దీంతోపాటు సైబర్ నేర బాధితులకు సత్వర సేవలు అందించేందుకు జిల్లాలో ప్రతి ఠాణాకు ఒక సైబర్ వారియర్ను నియమించింది.
- సైబర్ మోసానికి గురైన బాధితులు టోల్ ఫ్రీ నెంబర్ 1930కి ఫిర్యాదు చేస్తున్నారు. సంఘటన జరిగిన 24 గంటల్లో ఫిర్యాదు చేస్తే బాధితులకు న్యాయం జరిగేలా సత్వర చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. జిల్లాలో సైబర్ నేరాలను నియంత్రించేందుకు సహాయక కేంద్రాలను నెలకొల్పి బాధితులకు వెంటనే న్యాయం జరిగేలా 18 ఠాణాల్లోని సిబ్బంది కొంతమందిని ఎంపిక చేసి 18 మందిని సైబర్ వారియర్లుగా ఎంపిక చేశారు. సెక్యురిటీ పాలసీ చట్టం, కమ్యూనికేషన్ వ్యవస్థ, ఇంటర్నెట్ డాటాసెంటర్, నెట్ వర్కింగ్ వ్యవస్థ, నేషనల్ నెట్వర్కింగ్. మొబైల్ అప్లికేషన్స్, సెక్యూరిటీ రిస్క్, సోషల్ మీడియా ఇన్ గవర్నర్, సంఘటన సమాచార విధానం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు.
తీసుకోవాల్సిన చర్యలు
పోలీస్ శాఖలో నియమితులై పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు ఉన్న సిబ్బందిని ఎంపిక చేశారు. సైబర్ నేరాలను నియంత్రించేందుకు ఎక్కడికక్కడే ఠాణాల వారీగా చర్యలు తీసుకుంటారు. నేర బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు సైబర్ వారియర్లకు ఒక మొబైల్తో పాటు సిమ్కార్డును అందజేశారు. సైబర్ కేసుల్లో పూర్తి స్థాయి ఆధారాలను సేకరించి నేరస్థులను గుర్తించడం, బాధితులకు న్యాయం చేసి, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడం వారి విధి. కేసుల పరిస్థితిని బాధితులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తారు.
- జిల్లాలో జనవరి నుంచి మార్చి వరకు 189 ఫిర్యాదులు అందాయి. బాధితులు రూ.93,81,628 మోసపోయారు. ఇప్పటి వరకు 67 కేసులు పరిష్కరించగా రూ. 13,19,741 హోల్డ్లో పెట్టారు.
అవగాహన పెంపొందించుకోవాలి
సుధీర్ రాంనాథ్ కేకన్ ఎస్పీ మహబూబాబాద్
ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత వివరాలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో నమోదు చేయొద్దు. చరవాణులకు అపరిచితులు పంపిన లింకులను తెరవొద్దు. చరవాణి నుంచి ఆర్థిక లావాదేవీలు జరిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930కి ఫిర్యాదు చేసి, సంబంధిత ఠాణాలో సంప్రదించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ