logo

ఈఏపీ సెట్లో తొమ్మిదో ర్యాంకు

తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్‌ విభాగంలో జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని శివునిపల్లికి చెందిన కొంతం వేణుగోపాల్‌-లలిత దంపతుల కుమారుడు కొంతం మణితేజ 141 మార్కులతో తొమ్మిదో ర్యాంకు సాధించాడు.

Updated : 19 May 2024 05:36 IST

మణితేజకు మిఠాయి తినిపిస్తున్న తల్లిదండ్రులు వేణుగోపాల్, లలిత  

స్టేషన్‌ఘన్‌పూర్, న్యూస్‌టుడే : తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్‌ విభాగంలో జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని శివునిపల్లికి చెందిన కొంతం వేణుగోపాల్‌-లలిత దంపతుల కుమారుడు కొంతం మణితేజ 141 మార్కులతో తొమ్మిదో ర్యాంకు సాధించాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంపీసీ పూర్తి చేశాడు. మణితేజ కుటుంబం ఏడేళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్లి.. అమీర్‌పేటలో నివాసం ఉంటున్నారు. తండ్రి వేణుగోపాల్‌ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా.. తల్లి లలిత కుట్టు మిషన్‌ కుడుతోంది. అంతకుమందు శివునిపల్లిలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. పిల్లల భవిష్యత్‌ దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌కు వెళ్లినట్లు తండ్రి వేణుగోపాల్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని