కేయూ ప్రతిష్ఠకు మరకలు
కాకతీయ విశ్వవిద్యాలయం ప్రతిష్ఠకు భంగం కలిగింది. గత ఏడాది విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో న్యాక్ ఎ ఫ్లస్ ర్యాంకు సాధించడంతో ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులు ఎంతో సంతోషించారు
విద్యానగర్, న్యూస్టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం ప్రతిష్ఠకు భంగం కలిగింది. గత ఏడాది విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో న్యాక్ ఎ ఫ్లస్ ర్యాంకు సాధించడంతో ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులు ఎంతో సంతోషించారు. ఇప్పుడు ఉప కులపతి తాటికొండ రమేశ్పై వచ్చిన పలు ఆరోపణలపై స్పందించిన రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించడంతో విశ్వవిద్యాలయ ప్రతిష్ఠకు భంగం కలిగిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ చరిత్రలో మొట్ట మొదటి సారి ఒక వీసీపై ఇలా విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశాలు వచ్చాయని అంటున్నారు.
ఆరోపణలు ఇవీ..
న్యాక్ గ్రేడింగ్ కోసం చేపట్టిన ప్రాజెక్టులు నకిలీవని, ఆ సందర్భంగా చేపట్టి అభివృద్ధి పనుల్లో రూ.కోట్లు చేతులు మారాయని వీసీపై ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగం నుంచి తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారని కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకుల సంఘం (అకుట్) ఆరోపించింది. ఈ నెల 21తో వీసీ రమేశ్ పదవీ కాలం ముగియనుంది. ఈ సమయంలో ఇష్టానుసారంగా కొత్తవారిని పరిపాలనా పదవుల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీచేయడంపై ఫిర్యాదులు అందాయి. గతేడాది చేపట్టిన పీహెచ్డీ ప్రవేశాల్లో అక్రమాలు జరిగాయని పరిశోధక విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అన్యాయం జరిగిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని స్వయంగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాలను వీసీ పెడచెవిన పెట్టారు. న్యాయ పరమైన అంశాలు పాటించకుండా అధ్యాపకులను తొలగించడం, ఇష్టానుసారంగా బదిలీలు, నియామకాలు, నకిలీ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం తదితర వాటిపై కేయూ అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆచార్య ఇస్తారి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశంకు పలుమార్లు ఫిర్యాదు చేశారు.
విచారణను స్వాగతిస్తున్నా..
రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్ర వెంకటేశం తనపై విజిలెన్స్ విచారణకు ఉత్తర్వులు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు వీసీ టి.రమేశ్ పేర్కొన్నారు. ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే