ప్రేమేందర్రెడ్డి గెలుపుతోనే సమస్యల పరిష్కారం
సుదీర్ఘకాలం భాజపాలో పనిచేస్తున్న స్థానికుడైన గుజ్జుల ప్రేమేందర్రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు
కేజీ-పీజీ యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి. చిత్రంలో ఎడమ నుంచి కుడికి వరుసగా వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గంటా రవికుమార్, మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ ఛైర్మన్ మార్తినేని ధర్మారావు ,మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, వరంగల్ లోక్సభ పార్టీ అభ్యర్థి అరూరి రమేశ్, హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి, మహబూబాబాద్ లోక్సభ పార్టీ అభ్యర్థి సీతారాం నాయక్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు.
సుబేదారి, న్యూస్టుడే: సుదీర్ఘకాలం భాజపాలో పనిచేస్తున్న స్థానికుడైన గుజ్జుల ప్రేమేందర్రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్ష పైచిలుకు ఓట్లు ఉన్నాయన్నారు. వీటిలో అత్యధికంగా భాజపా బలపర్చిన అభ్యర్థికి వచ్చే విధంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హనుమకొండలో ఆయన మాట్లాడుతూ సమయం తక్కువగా ఉన్నందున ప్రణాళికలను తయారు చేసుకొని పనిచేయాలన్నారు. వరంగల్ నగరాభివృద్ధికి కేంద్రం పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చిందన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం కేంద్రం ఉపకార వేతనాలు ఇస్తే అప్పటి భారాస ప్రభుత్వం నిధులను మళ్లించిందని ఆరోపించారు. శాసన మండలిలో ప్రశ్నించే వారిని ఎన్నుకోవాలన్నారు. ప్రేమేందర్రెడ్డి గెలుపుతో ఓరుగల్లు ప్రగతికి బాటలు పడతాయన్నారు. మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి భాజపాలో పనిచేస్తున్నారన్నారు. పార్టీలు మారని అభ్యర్థి అని పేర్కొన్నారు. ఆయన్ను బలపరిస్తే నిరుద్యోగ, విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తారన్నారు. సమావేశంలో వివిధ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు బుచ్చిబాబు, అశోక్బాబు, సత్యనారాయణరెడ్డి, శివకుమార్, భూపాల్రావు, వివిధ మండలాలు, డివిజన్ల నుంచి వచ్చిన నాయకులు, కారకర్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.