నిరుద్యోగంపై పోరాడే వారికి పట్టం కట్టండి
తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై శాసన మండలిలో పోరాడే సత్తా, మేధోశక్తి భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్రెడ్డికే ఉందని పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి, పూర్వ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు.
మడికొండ సమావేశంలో మాట్లాడుతున్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, చిత్రంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజయ్య, వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్ తదితరులు
మడికొండ, న్యూస్టుడే: తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై శాసన మండలిలో పోరాడే సత్తా, మేధోశక్తి భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్రెడ్డికే ఉందని పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి, పూర్వ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం శనివారం కాజిపేట మండలం మడికొండలోని వేడుకల మందిరంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతుక పేరుతో భారీగా డబ్బులు సంపాదించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 56 కేసులు ఉన్నాయని ఆరోపించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లో గ్యారంటీల అమలు గురించి ఏనాడూ తన సామాజిక మాధ్యమంలో ప్రస్తావించని వ్యక్తి ప్రశ్నించే గొంతుక ఎలా అవుతారని ప్రశ్నించారు. అభ్యర్థి రాకేశ్రెడ్డి మాట్లాడుతూ రైతు కుటుంబంలో పుట్టిన తనను ఆశీర్వదిస్తే మీ హక్కుల సాధనకు పోరాడుతానని అన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. సమకాలీన సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న రాకేశ్రెడ్డిని గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్, వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్, భారాస నాయకులు, పట్టభద్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రజల గొంతుకను ఎమ్మెల్సీగా గెలిపించండి
దామెర: దామెరలో పరకాల నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ తీన్మార్మల్లన్న బ్లాక్మెయిలర్ అన్నారు. ఒక్కనాడూ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదన్నారు. రాకేష్రెడ్డి మాట్లాడుతూ.. ఉన్నత ఉద్యోగం వదిలి పుట్టినగడ్డకు సేవ చేసేందుకు వచ్చానన్నారు. ఎమ్మెల్సీగా గెలిచినా ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోనన్నారు. భారాస నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ పట్టభద్రులు గ్యారంటీల గారడీలో పడొద్దన్నారు. భారాస వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్ మాట్లాడుతూ నిరుద్యోగులు ఆలోచించి ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు పట్టభద్రుల చేతుల్లో ఉందన్నారు. సమావేశంలో కుడా మాజీ ఛైర్మన్ యాదవరెడ్డి, జడ్పీటీసీ సభ్యులు ధర్మారావు, సుదర్శన్రెడ్డి, కల్పన, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్