పట్టభద్రుల ఓటును వృథా కానివ్వను..
‘వరంగల్ నల్గొండ ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థికి విజయం దక్కలేదు.
మాట్లాడుతున్న తీన్మార్ మల్లన్న
జనగామ, న్యూస్టుడే: ‘వరంగల్ నల్గొండ ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థికి విజయం దక్కలేదు. నన్ను గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియాకు, ప్రజాపాలన అందిస్తున్న సీఎం రేవంత్రెడ్డికి కానుకగా ఇవ్వాలి’ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కోరారు. పట్టభద్రులు తనకు వేసే ఓటును వృథా కానివ్వనని అన్నారు. శాసన మండలి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జనగామలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. డీసీసీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో కలిసి ఆయన మాట్లాడారు. ఆరేళ్ల కోసం పట్టభద్రులు ఓటు వేసి గెలిపిస్తే పల్లా రాజేశ్వర్రెడ్డి మూడేళ్లకే దాన్ని ఎందుకు వదిలిపెట్టారో ప్రశ్నించాలన్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 17 వేల బోగస్ ఓట్లను ఆయన నమోదు చేయించారని, ఆధారాలతో సహా తాము బయటపెట్టినా చర్యలు తీసుకోలేదన్నారు. రానున్న కాలంలో కేసీఆర్తో పాటు పల్లా ఊచలు లెక్కపెట్టక తప్పదన్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 35 వేల కొలువులు ఇచ్చారని, మల్లన్నను గెలిపిస్తే తాము యువతకు అండగా నిలుస్తామన్నారు. తీన్మార్ మల్లన్న గెలుపునకు కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి కోరారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ భవానిరెడ్డి, టీపీసీసీ సభ్యుడు శ్రీనివాసరెడ్డి, రాజమౌళి, జిల్లా మహిళ అధ్యక్షురాలు ఇందిర, పట్టణ అధ్యక్షురాలు జక్కుల అనిత, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్లీడర్ కల్యాణి, గాదెపాక రాంచందర్, యూత్ జిల్లా అధ్యక్షుడు శివరాజ్యాదవ్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు అభిగౌడ్, పట్టణాధ్యక్షుడు బుచ్చిరెడ్డి, శ్రీనివాస్, పట్టణ నాయకులు పాల్గొన్నారు.
భూపాలపల్లి: తనను గెలిపిస్తే.. ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. అత్యధిక మెజార్టీతో తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరారు. సమావేశంలో పీసీసీ సభ్యులు చల్లూరి మధు, విజయ్కుమార్, జిల్లా నాయకులు గండ్ర సత్తిరెడ్డి, బుర్ర కొంరయ్య, దేవన్, రాజేందర్, కరుణాకర్, జోగ బుచ్చయ్య, కౌటం రవి, జంపయ్య, రమేష్, ముంజాల రవీందర్, సాంబమూర్తి, బందు సాయిలు తదితర నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్