వ్యర్థాల వడపోతకు బయోమైనింగ్!
పురపాలికల్లో ఏళ్లతరబడి డంపుయార్డుల్లో పేరుకున్న ఘన వ్యర్థాలను వేరు చేస్తారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంటు, విద్యుత్తు పరిశ్రమలకు విక్రయిస్తారు. మాగిన మట్టిని ఎరువుగా, రాళ్లు, పనికిరాని ఇతర వ్యర్థాలను లోతట్టు ప్రాంతాలు, భారీ గుంతలను నింపేందుకు ఉపయోగించవచ్చు.
ఏళ్లతరబడి సమస్యకు పరిష్కారం
వడపోసేందుకు ఏర్పాటు చేసిన యంత్ర సముదాయం..
పురపాలికల్లో ఏళ్లతరబడి డంపుయార్డుల్లో పేరుకున్న ఘన వ్యర్థాలను వేరు చేస్తారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంటు, విద్యుత్తు పరిశ్రమలకు విక్రయిస్తారు. మాగిన మట్టిని ఎరువుగా, రాళ్లు, పనికిరాని ఇతర వ్యర్థాలను లోతట్టు ప్రాంతాలు, భారీ గుంతలను నింపేందుకు ఉపయోగించవచ్చు.
న్యూస్టుడే, జనగామ: పట్టణాలు, నగరాల్లో పెద్ద ఎత్తున రోజువారిగా పోగయ్యే చెత్త నిర్వహణ పురపాలికలకు భారంగా మారుతోంది. వ్యర్థాల నిర్వహణ సజావుగా లేదని, జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) జరిమానా విధించిన సంగతి తెల్సిందే. ఈ సమస్య పరిష్కారానికి బయోమైనింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా రాష్ట్రంలోని 130 పురపాలికలను 9 క్లస్టర్లుగా విభజించారు. ఒక్కో క్లస్టర్లో 11 నుంచి 20 పురపాలికలను చేర్చారు. ఇందులో ఒకటో క్లస్టర్లో జనగామ, భూపాలపల్లి పురపాలిక సహా 13 పురపాలికలకు చోటు లభించింది.
10 ఎకరాల్లో డంపింగ్యార్డు
70 ఏళ్ల చరిత్ర కలిగిన జనగామ పురపాలికకు 15 ఏళ్ల క్రితం వరకు డంపు యార్డు లేదు. తొలుత చంపక్హిల్స్లో 5 ఎకరాలు కేటాయించారు. పక్కాయార్డు లేక చెత్త ప్రధాన రహదారి దాకా వచ్చింది. సమీపంలోనే ఎంసీహెచ్ వైద్యాలయం నిర్మించారు. వ్యర్థాల నిర్వహణ లోపంతో అందాల చంపక్హిల్స్ దుర్వాసనకు కేంద్రమైంది. దీంతో మరికొంత దూరంలో 10 ఎకరాలు కేటాయించారు. దశల వారీగా యార్డు ఓ రూపాన్ని సంతరించుకుంది. పదేళ్లపాటు సేకరించిన ఘన వ్యర్థాలు పెద్ద ఎత్తున పేరుకున్నాయి. ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలకు నిప్పంటించడంతో ఆసుపత్రికి, దుర్వాసన, పొగ సమస్య తీవ్రమైంది. అక్కడే తాత్కాలిక వైద్య కళాశాల ఏర్పాటైంది. ఈ పరిస్థితుల్లో బయోమైనింగ్ పథకం మంజూరైంది. సాగర్మోటర్స్ అనే సంస్థకు పని అప్పగించారు. యంత్రాల సాయంతో 8 వేల టన్నుల వ్యర్థాలను వడపోశారు. ఈ ప్రక్రియలో వేరుపడిన ఎరువు నాణ్యతను పరిశీలించాల్సి ఉందంటున్నారు. మరి కొద్ది రోజుల్లో బయోమైనింగ్ ప్రక్రియ పూర్తి కానుంది.
- పట్టణంతో పాటు.. మరో నాలుగు గ్రామాల చెత్త: 30 వార్డులున్న జనగామ పట్టణంలో రోజు సుమారు 20 టన్నుల ఘన వ్యర్థాలను సేకరించి యార్డుకు తరలిస్తున్నారు. సమీపంలోని మరో నాలుగు గ్రామాల్లో సేకరించే చెత్తను ఇక్కడికి తరలిస్తున్నారు. గతంలో కేటాయించిన ఐదెకరాల్లో పేరుకపోయిన చెత్తను సైతం బయోమైనింగ్ విధానంలో శుద్ధి చేస్తే మేలు జరుగుతుంది. స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.0లో భాగంగా పురపాలికల్లో జీరో డంపింగ్ స్థలాల సాధనే లక్ష్యంగా బయోమైనింగ్ విధానం అమల్లోకి వచ్చింది. యార్డును చెత్తకుప్పగా కాకుండా ఇళ్ల వద్దనే తడి, పొడి చెత్తను, ప్రమాదకర వ్యర్థాలను వేరు చేసే విధానాన్ని పక్కాగా అమలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా కార్యాచరణను అమలు చేయాల్సి ఉంది.
పర్యావరణానికి మేలు
వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్, జనగామ
మూడేళ్ల క్రితం ఈ ప్రతిపాదన కార్యరూపం ధరించింది. లక్ష్యానికి అనుగుణంగా బయోమైనింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఏళ్ల తరబడి పేరుకున్న ప్లాస్టిక్, ఇతర ఘన వ్యర్థాలను వడపోసే పథకం మంజూరు కావడం ఈ ప్రాంత పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. వడపోతలో వచ్చిన సేంద్రియ ఎరువు నాణ్యతను అనుసరించి వినియోగించేలా చూస్తాము.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?