పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే ఉందని, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థినైన తనకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపిస్తారని గుజ్జుల ప్రేమేందర్రెడ్డి అన్నారు.
మాట్లాడుతున్న భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి
సుబేదారి, న్యూస్టుడే: నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే ఉందని, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థినైన తనకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపిస్తారని గుజ్జుల ప్రేమేందర్రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్క్లబ్లో పాత్రికేయ సంఘాలు, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ప్రేమేందర్రెడ్డి మాట్లాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం 40 ఏళ్లుగా పార్టీలో పని చేస్తున్నానని చెప్పారు. వరంగల్కు ఉద్యమ చరిత్ర ఉందని, ఇక్కడి వ్యక్తినైన తనను మండలికి పంపించాలని విద్యావంతులకు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాజపా ప్రజా ప్రతినిధులు లేనప్పటికీ కేంద్రం నిధులు ఇచ్చి అభివృద్ధి చేసిందన్నారు. పలు పథకాల కింద రూ.కోట్ల నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకుండా అడ్డుకుందని ఆరోపించారు. దేశంలో ఏడు టెక్స్టైల్ పార్కులను అనుమతి ఇస్తే.. అందులో ఒకటి వరంగల్కు ఇచ్చారని గుర్తు చేశారు. రామప్ప ఆలయానికి యూనెస్కో గుర్తింపు రావడంతో వరంగల్ జిల్లా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. కాంగ్రెస్, భారాస అభ్యర్థులు గెలిస్తే ఒరిగేది ఏమీ లేదని చెప్పారు. తనను గెలిపిస్తే నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలపై శాసన మండలిలో నిలదీస్తానని హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. మీట్ దప్రెస్ లో ప్రెస్క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి అమర్, పాత్రికేయుల సంఘం నాయకులు రాజీరెడ్డి, దయాసాగర్, వివిధ పత్రికలు, ఛానళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
[ 26-07-2024]
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
[ 26-07-2024]
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
[ 26-07-2024]
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఆకర్షక పద్దు
[ 26-07-2024]
రైతును రాజు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. వారికి అన్ని విధాలుగా మేలు చేసేలా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కేటాయింపులు చేశారు. అభివృద్ధే అజెండాగా.. సంక్షేమం దండిగా ఉండేలా ఆర్థిక పద్దు రూపకల్పన జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్కు కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం. -
పంచాయతీల్లో కానరాని పౌర సేవల పట్టికలు
[ 26-07-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పంచాయతీల్లో ప్రజలకు పౌర సేవలు అరకొరగానే అందుతున్నాయి. పంచాయతీలో ఏఏ సేవలు అందుబాటులో ఉంటాయో, వాటిని ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో సూచిస్తూ పంచాయతీ కార్యాలయాల్లో విధిగా పౌరసేవల పట్టికలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
విశ్వ క్రీడల కీర్తి.. ఓరుగల్లు పొందాలి స్ఫూర్తి
[ 26-07-2024]
ఒలింపిక్స్లో పతకాలు సాధించడం అంత సులువైన విషయం కాదు. అసాధ్యమూ అంతకన్నా కాదు. కావాల్సిందల్లా గట్టి సంకల్పం, పట్టుదల, కృషి. ఉమ్మడి వరంగల్లో క్రీడాకారుల ప్రతిభకు కొదువ లేదు. గ్రామీణ ప్రాంతాల్లో గొప్ప నైపుణ్యం ఉన్నవారు ఎందరో ఉన్నారు. వారిని గుర్తించి సానబెడితే ఒలింపిక్స్కు మనవాళ్లు అర్హత సాధించడం పెద్ద సమస్యే కాదు. -
ఆయన లేని లోకంలో ఉండలేనని..
[ 26-07-2024]
ఎక్కడో పుట్టారు.. ఎక్కడో పెరిగారు.. వివాహబంధంతో ఒకటయ్యారు.. కష్టసుఖాలు పంచుకున్నారు.. పిల్లలను ప్రయోజకులను చేశారు.. అరవై ఏళ్లు తోడు-నీడగా ఉన్నారు.. మలి సంధ్యలోనూ నీకు నేను...నాకు నువ్వు అనుకుంటూ జీవిస్తున్నారు.. ఇంతలో భర్త హఠాన్మరణంతో ఆ ఇల్లాలు కన్నీరు మున్నీరుగా విలపించారు.. -
ఎక్సైజ్కాలనీ.. ఎక్కడ చూసినా సమస్యలే
[ 26-07-2024]
హనుకొండ నడిబొడ్డున ఉన్న ఎక్సైజ్కాలనీలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కొరవడ్డాయి. అన్ని అనుమతులతో ఐదు దశాబ్దాల కిందట కాలనీ ఏర్పడింది. ఇప్పకీ కొన్ని వీధుల్లో డ్రైనేజీలు లేవు. రోడ్డు నెంబర్ 5సీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు రోడ్డుపై నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. -
సరిహద్దులో పేలిన తూటా!
[ 26-07-2024]
కొన్నాళ్లుగా తెలంగాణ-ఛత్తీస్గఢ్-మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య పోరు సాగుతోంది. గురువారం ములుగు-భద్రాద్రి జిల్లాల సరిహద్దులోని గుండాల-తాడ్వాయి మండలాల పరిధిలోని దామెరతోగు, కరకగూడెం అటవీ ప్రాంతంలో తుపాకీ తూటాల మోతలు మోగాయి. -
ఠాణాల్లో భూ తగాదాలు.. సివిల్ పంచాయితీలు!
[ 26-07-2024]
జిల్లా పరిధిలోని కొన్ని పోలీసు సబ్ డివిజన్లలో సీఐలు, ఎస్సైల తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఠాణాల్లో యథేచ్ఛగా భూ పంచాయితీలు, సివిల్ తగాదాల్లో పోలీసులు తలదూరుస్తూ అమ్యామ్యాయాలు పుచ్చుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలోనూ ఈ మాదిరిగానే వ్యవహరించగా జిల్లాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. -
కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం
[ 26-07-2024]
శాంతిభద్రతల పరిరక్షణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్