అతివలకు ఉపాధి వెలుగులు
విద్యుత్తు వినియోగం పెరుగుతూనే ఉంది.. వేసవిలోనైతే మరీ ఎక్కువ అవుతోంది.. దేశ వ్యాప్తంగా జల, పవన, బొగ్గు ఆధారిత విద్యుత్తుపై ఆధారపడుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు.
సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు కసరత్తు
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి : విద్యుత్తు వినియోగం పెరుగుతూనే ఉంది.. వేసవిలోనైతే మరీ ఎక్కువ అవుతోంది.. దేశ వ్యాప్తంగా జల, పవన, బొగ్గు ఆధారిత విద్యుత్తుపై ఆధారపడుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. వీటి ఏర్పాటుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. అయితే, స్థల సేకరణే ప్రధాన అంశం.. ప్యానళ్లను పరిచేందుకు స్థలం అవసరం ఉంటుంది. జిల్లాల్లో భూసేకరణ కోసం స్థలాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. విద్యుత్తు ఉప కేంద్రాల ఆవరణలో, వాటికి 2 కిలోమీటర్ల దూరం మించకుండా స్థలాలను గుర్తించే పనిలో అధికారులున్నారు. ఒక మెగావాట్ యూనిట్ ఉత్పత్తి చేపట్టేందుకు వీలుగా ఒక్కో ప్లాంట్ నాలుగెకరాల విస్తీర్ణంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి, టేకుమట్ల, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో 4 ఎకరాల చొప్పున చిట్యాలలో 8 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. వాటిని విద్యుత్తు శాఖ అధికారులు పరిశీలించి ఆ ప్రాంతాలు ప్లాంటు ఏర్పాటుకు అనువుగా ఉన్నాయా లేదా అధ్యయనం చేస్తారు. విద్యుత్తు అధికారులు స్థలాలు అనువుగా ఉన్నట్లు నిర్ధారిస్తే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు.
నిర్వహణ పొదుపు సంఘాలకు
సౌర విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేసి వీటి నిర్వహణ బాధ్యతలను మహిళా పొదుపు సంఘాలకు అప్పగించే అవకాశం ఉంది. నిర్వహణపై మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి బాధ్యతలను అప్పగించాలని యోచిస్తున్నారు. రూ.4.25 కోట్ల వ్యయంతో ఒక్కో ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు. సోలార్ ప్లాంట్లలో ఉత్పత్తయిన విద్యుత్తును సమీపంలోని 33/11 కేవీ ఉపకేంద్రాల ద్వారా గ్రిడ్కు అనుసంధానం చేస్తారు. సోలార్ విద్యుత్తు విక్రయం ద్వారా వచ్చే ఆదాయం ద్వారా మహిళా సంఘాలకు ఉపాధి కలగనుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా స్థలాల సేకరణ చేపడుతున్నారు. టీఎస్ రెడ్కో, విద్యుత్తు, డీఆర్డీఏ సమన్వయంతో ప్లాంట్లు రూపుదిద్దుకోనున్నాయి. త్వరలోనే ప్లాంట్ల ఏర్పాటుపై ప్రభుత్వం విధివిధానాలను ప్రకటించనుంది.
ఎన్నో ప్రయోజనాలు..
థర్మల్ కేంద్రాల్లో బొగ్గును మండించడంతో కర్బన ఉద్గారాలు వెలువడి గాలిలో కలిసి ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. సౌర విద్యుత్తుతో కాలుష్యానికి చెక్ పెట్టవచ్చు. కాలుష్య నివారణతో పర్యావరణాన్ని కాపాడవచ్చు. బొగ్గు, నీటి వినియోగం తగ్గుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చెల్పూరు కేటీపీపీలో థర్మల్ విద్యుత్తు ఉత్పత్తికి రోజుకు కనీసం 14 వేల టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది. నీరు, బొగ్గు తరలించే వ్యయం భారీగా ఉంటుంది. సౌర విద్యుత్తు ద్వారా ఆ వ్యయం ఆదా అవుతుంది. స్థానికంగా మహిళలకు, యువతకు ఉపాధి కలగనుంది. మహిళలకు ఆర్థిక తోడ్పాటుతో పాటు, స్థానికంగా విద్యుత్తు ఉత్పత్తి కావడంతో విద్యుత్తు సమస్యలకూ చెక్ పెట్టవచ్చు. ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తోంది. ఇలాంటి పథకాలకు భారం పడకుండా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్