ఆడిట్ విభాగంలో లెక్కలేనితనం
గతేడాది సీనియర్ అసిస్టెంట్ బండా అన్వేష్ అభివృద్ధి పనుల పేరుతో సుమారు రూ.3.31 కోట్లు కొల్లగొట్టాడు. ఆడిట్, గణాంక విభాగాల అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యంతో ప్రజాధనాన్ని ప్రైవేటు ఖాతాల్లోకి మళ్లించారు.
పరిశీలన చేయకుండానే ఎంబీలపై సంతకాలు
రంగంపేట, న్యూస్టుడే: గతేడాది సీనియర్ అసిస్టెంట్ బండా అన్వేష్ అభివృద్ధి పనుల పేరుతో సుమారు రూ.3.31 కోట్లు కొల్లగొట్టాడు. ఆడిట్, గణాంక విభాగాల అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యంతో ప్రజాధనాన్ని ప్రైవేటు ఖాతాల్లోకి మళ్లించారు. ఇద్దరు, ముగ్గురు జైలుకెళ్లి వచ్చినా.. గ్రేటర్ వరంగల్ ఆడిట్ విభాగం తీరు మారడం లేదు. పర్సంటేజీలు ఇస్తామంటే వెనుకా ముందు ఆలోచించకుండా ఎంబీలు, ఇతర చెల్లింపుల దస్త్రాలపై సంతకాలు చేస్తున్నారు. అభివృద్ధి పనుల ఎంబీలు, బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు ఆగడం లేదు. తాజాగా పాత తేదీలతో బదిలీపై వెళ్లిన ఉన్నతాధికారి ఎంబీ పుస్తకాలపై సంతకాలు చేయడం వివాదాస్పదమైంది. ఇలాంటి వాటిని కట్టడి చేయాల్సిన ఆడిట్ విభాగం ప్రేక్షకపాత్ర వహిస్తుంది. పాత తేదీలతో ఎంబీ పుస్తకాలు వస్తే, వీటిపై వెంటనే అభ్యంతరాలు చెప్పి, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాలి. ఆడిట్ విభాగం అడగక పోవడంతో చకాచకా ఎంబీలు గణాంక విభాగానికి చేరుకున్నాయి. కమిషనర్ అశ్విని తానాజీ వాకడే గుర్తించేంత వరకు ఆడిట్, గణాంక విభాగాలు నిద్రావస్థలో ఉన్నాయి.
తెరవెనుక ఇంజినీర్లు, గుత్తేదారులు
బదిలీపై వెళ్లిన ఉన్నతాధికారి పాత తేదీలతో ఎంబీ పుస్తకాలపై సంతకాలు చేయించడంలో బల్దియాకు చెందిన ఇంజినీర్లు, సివిల్ గుత్తేదారులు ప్రధాన పాత్ర వహించినట్లు తెలుస్తోంది. కమిషనర్ పేషిలో పనిచేసే ఉద్యోగులు మధ్యవర్తులుగా వ్యవహరించారని సమాచారం. ఒకేసారి కాకుండా దశల వారీగా సంతకాలు చేయించినట్లు తెలిసింది. కొందరు ఏఈలు, డీఈలు స్వయంగా వెళ్లినట్లుగా సమాచారం. కాశీబుగ్గ, కాజీపేట, నక్కలగుట్ట డ్రాయింగ్ బ్రాంచి(డీబీ) విభాగం ఉద్యోగులు, ఆడిట్ విభాగం ఉద్యోగులు సహకారం అందించారని తెలిసింది. ఇప్పటికే ముగ్గురు ఉద్యోగులకు షోకాజు నోటీసులు జారీ చేశారు. వీరు ఇచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
నిబంధనల ఉల్లంఘన
నిబంధనల ప్రకారమైతే అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపులపై ఆడిట్ విభాగం డేగ కన్ను వేయాలి. పర్సంటేజీలకు ఆశపడి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇంజినీరింగ్ విభాగం నుంచి వచ్చే ఎంబీ పుస్తకాలను ఆడిట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలి. అభివృద్ధి పని ఎక్కడ జరిగింది. ఏం పని, నిధుల కేటాయింపు, సాంకేతిక, పరిపాలనాపరమైన అనుమతులు, క్షేత్రస్థాయిలో జరిగిన అభివృద్ధి పని విలువ ఎంత, వర్క్ ఇన్స్పెక్టర్, ఏఈ, డీఈలు చేసిన ఎంబీ రికార్డు తేదీ, ఈఈ, ఎస్ఈల సంతకాలు, క్వాలిటీ కంట్రోల్ కమిటీ సర్టిఫికెట్లు తదితరములు చూడాలి. అభివృద్ధి పని ఎప్పుడు జరిగింది, ఎంబీ పుస్తకంలో నమోదు, కమిషనర్ సంతకాలు చూడాలి. ఇలాంటివేమీ పరిశీలించడం లేదు. పర్సంటేజీలు తీసుకొని గుత్తేదారులు తీసుకొస్తున్న ఎంబీలపై సంతకాలు చేస్తున్నారని తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం