కొలువు కల్ల.. జేబు గుల్ల!
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నేరుగా లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు కొంత మంది దళారులకు కాసుల పంట పండుతోంది. వాటిని ఎరగా చేసుకుని అమాయక నిరుద్యోగులే లక్ష్యంగా గాలమేస్తున్నారు.
ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు వల
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నేరుగా లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు కొంత మంది దళారులకు కాసుల పంట పండుతోంది. వాటిని ఎరగా చేసుకుని అమాయక నిరుద్యోగులే లక్ష్యంగా గాలమేస్తున్నారు. ఉద్యోగ హోదాను బట్టి కొంత ధర నిర్ణయిస్తూ బేరమాడుతున్నారు. నిరుద్యోగులు సైతం వారి మాటలకు ఆకర్షితులై ఎలాంటి కష్టం.. పరీక్ష లేకుండా ఉద్యోగంలో చేరవచ్చని భావించి అప్పులు చేసి మరీ డబ్బులు అప్పగిస్తున్నారు. చివరకు చేతికి ఉద్యోగ లేఖ అందక.. దళారీ జాడ తెలియక మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏటా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రానున్నది ఉద్యోగ పరీక్షల కాలం కావడంతో నిరుద్యోగులు మోసానికి గుర వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కథనం...
ఈనాడు, మహబూబాబాద్-న్యూస్టుడే, వరంగల్ క్రైం
తక్కువ సమయంలో.. ఎక్కువ డబ్బే లక్ష్యంగా
ఎప్పటికీ చేతి నిండా డబ్బులు కనిపించాలనే దురాశతో కొంతమంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడమే ధ్యేయంగా వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాఫియాకు తెర లేపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వైద్య, ఆరోగ్యశాఖ, విద్యుత్తు, విద్యా శాఖల్లోని ఖాళీల ఉద్యోగ స్థాయి నుంచి వివిధ శాఖల్లోని అటెండర్ ఉద్యోగం వరకు ఇప్పిస్తామంటూ మాయమాటలతో నిరుద్యోగులను నమ్మించే ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. అందుకు వారు అధికారుల అవతారమెత్తుతారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలు చూపిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులతో మంచి సంబంధాలున్నట్లు నమ్మిస్తున్నారు. వారి మాటలకు ఆకర్షితులవుతున్న నిరుద్యోగులు రూ.లక్ష నుంచి 10 లక్షల వరకు ముట్టజెప్పుతూ మోసపోతున్నారు.
నాలుగేళ్లలో..
ఉద్యోగాల పేరిట జరిగిన మోసాలకు సంబంధించి వరంగల్ కమిషనరేట్ పరిధిలో 2020 నుంచి ఇప్పటి వరకు 157 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు పోలీసులు దాదాపు 18 కేసులు నమోదు చేశారు. అత్యధికంగా 2022లో 52 కేసులున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 2022 నుంచి ఇప్పటివరకు సుమారు 16 కేసులు నమోదయ్యాయి.
నిపుణులు ఏమంటున్నారంటే..
సర్కారీ కొలువులకు సంబంధించి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి దానికి నోటిఫికేషన్ వస్తుంది. దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో స్వీకరిస్తారు. రాత పరీక్ష సైతం పారదర్శకంగా జరుగుతుంది. ఒక వేళ అవుట్ సోర్సింగ్ అయితే.. ఏ డిపార్ట్మెంటు, అధికారిక ప్రకటన ఉందా.. స్వయంగా వెళ్లి అధికారులను కలిసి అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోవాలి. దళారులు ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామంటే అప్పుడు నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలి. డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటే.. అనుమానించి సమీపంలోని పోలీసులను ఆశ్రయించాలి.
ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు
దేవేందర్ రెడ్డి, ఏసీపీ, హనుమకొండ
ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరికీ ఊరికే రావు.. ప్రతి పరీక్ష ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా జరుగుతుంది. కష్టపడి చదువుకుని, పరీక్షల్లో ప్రతిభ చూపితే తప్ప ఉద్యోగాలు రావు. ఇటీవల కొంత మంది దళారులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు దండుకుని మోసం చేస్తున్నారు. అలాంటి వారి మాటలను నమ్మొద్దు. మీకు అలాంటి వారిపై అనుమానం వస్తే వెంటనే పోలీసులను ఆశ్రయించండి.
ఉమ్మడి జిల్లాలోని కొన్ని ఘటనలు
- మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన నిరుద్యోగి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామన్న దళారుల చేతుల్లో మోసానికి గురయ్యాడు. వారికి సుమారు రూ.10 లక్షల వరకు ఇచ్చినట్లు సమాచారం.. చివరకు ఉద్యోగం రాకపోవడంతో 2023లో పోలీసులను ఆశ్రయించాడు. ఇతనిలా ఆ ముఠా చేతిలో చాలా మంది మోసపోయినట్లు తెలిసింది. పోలీసులు ముఠాలోని కొంత మందికి నోటీసులు కూడా ఇచ్చారు.
- వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఆత్మకూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఒక నిరుద్యోగిని గురుకుల కళాశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఒక వ్యక్తి 2020లో నమ్మించాడు. మాటల్లో ముంచి రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు. చివరకు ఆ నిరుద్యోగి రూ.4.30 లక్షలు అప్పజెప్పాడు. కానీ, ఉద్యోగం ఇప్పించలేదు. చివరకు మోసపోయానని గ్రహించి ఇటీవల పోలీసులను ఆశ్రయించాడు.
- వరంగల్ పోలీస్ కమిషనరేట్ మిల్స్కాలనీ ఠాణా పరిధిలో ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సింగరేణి, గురుకుల సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన ఒక నిరుద్యోగి నుంచి 2021లో రూ.10 లక్షలు తీసుకున్నాడు. పలుమార్లు ఉద్యోగం ఇప్పించాలంటూ డిమాండ్ చేసినా ప్రయోజనం లేదు. మూడేళ్లు కావొస్తున్నా ఉద్యోగం ఇప్పించడంలో జాప్యం చేస్తుండటంతో అనుమానం వచ్చి ఇటీవల పోలీసులను ఆశ్రయించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు