నగరం.. చినుకులకే వణుకుతోంది..!
‘ఇటీవల కురుస్తున్న చిన్నపాటి వర్షాలకే వరంగల్, హనుమకొండ ప్రధాన రహదారులు, కూడళ్లలో వరదనీరు ప్రవహించింది. అంతర్గత మురుగు కాలువలు పొంగిపొర్లాయి.’
జలమయమవుతున్న రహదారులు.. నీటమునుగుతున్న కాలనీలు
వరంగల్ కాశీబుగ్గ మున్సిపల్ సర్కిల్ కార్యాలయం ముందు వరదనీరు
‘ఇటీవల కురుస్తున్న చిన్నపాటి వర్షాలకే వరంగల్, హనుమకొండ ప్రధాన రహదారులు, కూడళ్లలో వరదనీరు ప్రవహించింది. అంతర్గత మురుగు కాలువలు పొంగిపొర్లాయి.’
కార్పొరేషన్, న్యూస్టుడే
హనుమకొండ కాకతీయ కాలనీ ఫేస్1 వద్ద..
చిన్నపాటి వర్షానికే ఓరుగల్లు నగరం చిగురుటాకులా వణుకుతోంది. లోతట్టు కాలనీలు నీటమునిగి రాత్రంతా జాగరణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల నాలాల పూడికతీత పనులు పైపైన చేపట్టడంతో వరదనీరు సాఫీగా బయటకెళ్లడం లేదు. ప్రజా రవాణాకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. వచ్చేది వర్షాకాలం.. పరిస్థితి ఇలాగే ఉంటే నగరవాసులకు తీవ్ర ఇక్కట్లు తప్పేలా లేవు. కాజీపేట, హనుమకొండ, వరంగల్ త్రినగరాలకు ముంపు బెడద పొంచి ఉంది.
హనుమకొండ చౌరస్తాలో
స్మార్ట్ రోడ్లతోనే సమస్య..
- వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో 15 ప్రధాన రోడ్లను స్మార్ట్ రోడ్లుగా అభివృద్ధి పరిచేందుకు ప్రతిపాదించారు. రెండు, మూడు రోడ్లు తప్ప మిగిలినవి అసంపూర్తిగా వదిలేశారు. ప్రధాన రహదారుల్లో వర్షం నీరు నిలవడానికి స్మార్ట్ రోడ్లే కారణమని తేల్చారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు మధ్యలో ఆగాయి. ఇన్, అవుట్ లెట్లు లింకు చేయలేదు. కొన్నిచోట్ల పనులు ఆపేశారు.
- హనుమకొండ పద్మాక్షిగుట్ట, కొత్త బస్టాండ్ రోడ్, కాపువాడ, మున్నూరు కాపువాడ రోడ్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో వర్షపు నీరు రోడ్లను ముంచెత్తుతోంది.
- వరంగల్ ప్రాంతంలో ఎంజీఎం రోడ్, గోపాలస్వామి గుడి, పోచమ్మమైదాన్, తిలక్రోడ్, కాశీబుగ్గ, వరంగల్ స్టేషన్రోడ్, వరంగల్ చౌరస్తా, మేదరివాడ రహదారుల్లో డ్రైనేజీ పనులు పెండింగ్లో ఉన్నాయి. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షానికి వరద నీరంతా నేరుగా వస్త్ర దుకాణాల్లోకి వెళ్లింది.
ఇదీ పరిస్థితి..
- ప్రధాన, అంతర్గత రహదారుల్లోని మురుగు కాలువల్లో పెద్దఎత్తున వ్యర్థాలు పోగయ్యాయి. ప్రజారోగ్య విభాగం పైపైన పనులు చేసి వదిలేసింది. నగరంలోని 66 డివిజన్లలోని అంతర్గత డ్రైనేజీల్లో పూడికతీత పనులు పూర్తిగా చేయించాల్సిన అవసరం ఉంది.
- వరంగల్ బట్టలబజారు, వేంకటేశ్వరస్వామి గుడి, పిన్నావారి వీధి, పాత బీటుబజారు, అండర్బ్రిడ్జి కింద వాన నీళ్లు ఆగాయి. హనుమకొండ అలంకార్ సెంటర్, హనుమకొండ చౌరస్తా, అదాలత్ సెంటర్, సుబేదారి సెంటర్లలో వరదనీరు నిలిచింది. దీంతో రవాణాకు ఆటంకô ఏర్పడింది.
నాలాలకు అడ్డంకులు
కాజీపేట, హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో 29 నాలాలు ఉన్నాయి. పూడికతీత పనుల కోసం రూ.79.81 లక్షలు కేటాయించారు. అత్యవసరం పేరుతో నామినేషన్పై కేటాయించారు. బల్దియా ఇంజినీర్ల పర్యవేక్షణ లేకపోవడంతో పైపైన పూడికతీత పనులు చేపట్టారు. కాలనీలు నీట మునగకుండా ఉండాలంటే నాలాలు శుభ్రం చేయాలి. వ్యర్థాలు ఉండొద్దు. ఈ విషయం తెలిసి కూడా ఇంజినీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
- హనుమకొండ ప్రాంతంలో కీలకమైన నయీంనగర్ నాలా వద్ద కొత్తగా వంతెన కడుతున్నారు. దీనివల్ల ఈసారి కాలనీలకు ముంపు సమస్య ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందే.
- వరంగల్ ప్రాంతంలో పోతననగర్ నాలా అభివృద్ధి పనులు ఆలస్యమవుతున్నాయి. స్మార్ట్సిటీ పనుల కోసం పోతననగర్ నాలాను మూసేశారు. నాలుగు రోజుల కిందట కురిసిన వర్షానికి రఘునాథ్ కాలనీ, బాబీ ఫంక్షన్ గల్లీ, పోతనరోడ్, రామన్నపేట బీసీ కాలనీలు నీటమునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.
నయీంనగర్ ‘నాలా’ ఎలా.?
హనుమకొండ ప్రాంతంలో కీలకమైన నయీం నగర్ ‘నాలా’ విస్తరణ, కొత్తగా వంతెన నిర్మాణ పనులు మొదలయ్యాయి. వచ్చేది వర్షాకాలం.. ఈలోపు పనులు పూర్తవుతాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హనుమకొండ పెద్ద వడ్డేపల్లి, గోపాల్పూర్ చెరువులు అలుగు పోస్తే వరదనీరు కేయూసీ వంద అడుగులు, సమ్మయ్యనగర్, విద్యానగర్, నయీంనగర్, కిషన్పుర, పోచమ్మకుంట, భగత్సింగ్ నగర్ మీదుగా కెనాల్ టన్నెల్కు వెళ్తాయి. నయీంనగర్ ప్రధాన రహదారిలో వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న దృష్ట్యా వర్షాలు పడితే వరదనీరు ఎలా మళ్లిస్తారనే దానిపై గ్రేటర్ వరంగల్ అధికారులు దృష్టి సారించడం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే పలు కాలనీలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్