ఎప్సెట్లో ర్యాంకు రాలేదా.. ఏం ఏం ఫర్వాలేదు..!
ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకు రాలేదని.. అర్హత సాధించలేదని ఆందోళన చెందుతున్నారా.. విద్యార్థులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. వీరి కోసం ఎన్నో కోర్సులు ఎదురు చూస్తున్నాయి.
విద్యార్థులకు ప్రత్యామ్నాయ అవకాశాలెన్నో..!
ఇంటర్తో ఉద్యోగాలు సైతం..
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి, కాజీపేట, న్యూస్టుడే: ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకు రాలేదని.. అర్హత సాధించలేదని ఆందోళన చెందుతున్నారా.. విద్యార్థులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. వీరి కోసం ఎన్నో కోర్సులు ఎదురు చూస్తున్నాయి. ఇటీవల వెలువడిన ఎప్సెట్ 2024 ఫలితాల్లో గతంతో పోలిస్తే చాలా తక్కువ మంది అర్హత సాధించారు. వీరి సంఖ్య 30 శాతానికిపైగా ఉంటుంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తర్వాత ఏమిటి అనే ఆందోళనలో ఉన్నారు.
సంప్రదాయ కోర్సులు అనేకం..
ఇంజినీరింగ్కు సమాన అవకాశాలు ప్రస్తుతం ఎన్నో ఉన్నాయి. డిగ్రీ కళాశాలల్లోనూ ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్లు వస్తున్నాయి. బీఎస్సీ, బీకాంలే కాకుండా ప్రస్తుతం అవసరమైన ఆధునిక కోర్సులు కంప్యూటర్ సైన్స్ లాంటివి జతచేసుకోవచ్చు. ఇంజినీరింగ్తో సంబంధం లేకుండా కోచింగ్ సెంటర్లలో పైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనాలసిస్ తదితర కోర్సులు నేర్చుకుని నేరుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది.
- డిగ్రీలో బీఎస్సీ ఎంపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) కోర్సు చేయొచ్చు. ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, జియాలజీ లాంటి కాంబినేషన్లు చదవొచ్చు. బీఎస్సీలో డేటా సైన్స్, బీబీఏ, బీకాం, జర్నలిజం, టూరిజం లాంటి కోర్సులనూ ఎంచుకోవచ్చు. న్యాయవాద వృత్తిపై ఆసక్తి ఉంటే ఐదు సంవత్సరాల ఎల్ఎల్బీలో చేరవచ్చు. సివిల్ సర్వీసెస్కు ఏ డిగ్రీ చదివినా అర్హులే. ఇవేకాక చరిత్ర, తెలుగు సాహిత్యం, ఆంగ్లం, సోషియాలజీ, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ తదితర కోర్సుల్లోనూ చేరవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్, బ్యాంకింగ్లో కూడా ఏదేని డిగ్రీ అర్హతతో పోటీ పడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఇంటి గ్రేటెడ్ కోర్సులు..
ప్రస్తుతం వరంగల్ లాంటి నగరాల్లోనూ అనేక కళాశాలలు, కోచింగ్ సెంటర్లు వస్తున్నాయి. వీటిలో విషయ నిపుణుల అవసరం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రసాయన, భౌతిక శాస్త్రం, గణిత అధ్యాపకులకు మంచి డిమాండ్ ఉంటుంది. ఎప్సెట్లో ర్యాంకులు సాధించని విద్యార్థులు ఇంటిగ్రెటెడ్ కోర్సుల్లో చేరవచ్చు. ఇది ఐదు సంవత్సరాల కోర్సుగా ఉంటుంది. నేరుగా మాస్టర్ డిగ్రీ పొందడానికి అవకాశం ఉంటుంది. కళాశాలల్లో లెక్చరర్లుగా లేదా ల్యాబ్లలో ఉద్యోగాలు సంపాదించవచ్చు. విదేశాలల్లో కూడా అధ్యాపకులుగా వెళ్లడానికి అవకాశం ఉంటుంది.
నర్సింగ్లో అనేక మార్గాలు..
ఎప్సెట్లో అనుకున్నంత ర్యాంకులు సాధించని వారు నర్సింగ్, ఫార్మసీ, పిజియోథెరఫీ, అనెస్థీషియా లాంటి కోర్సులను ప్రైవేటుగా చదువుకోవడానికి అవకాశం ఉంది. కొన్ని చోట్ల మేనేజ్మెంట్ కోటాలో పొందవచ్చు.
చదువు.. కొలువు..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్డీఏ అండ్ ఎన్ఏ) పరీక్షను ఇంటర్ అన్ని గ్రూపుల వారు రాసుకోవచ్చు. ఈ పరీక్షలో ఎంపికైన వారికి బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సులను చదివిస్తారు. శిక్షణ అనంతరం ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ల్లో తీసుకుంటారు.
‘గతంలో పరిమిత కోర్సులే ఉండేవి. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు నూతన కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ర్యాంకు రాలేదని అధైర్య పడక ముందుకు సాగాలి. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలి. సమాన అవకాశాలున్నప్పుడు ప్రయత్నిస్తే మంచి ఫలితాలు సాధించొచ్చు’.
బీఎస్సీ, బీబీఏ, బీకాం, జర్నలిజం, టూరిజం , ఎల్ఎల్బీ
ప్రవేశ పరీక్షలతోనూ..
ఇంటర్మీడియట్ విద్యార్హతతో ఎయిర్ఫోర్స్, నేవీ, ఆర్డీ, కోస్టుగార్డు, పోస్టల్, రైల్వేస్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. కానిస్టేబుల్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ లోకోపైలట్, జూనియర్ క్లర్క్, టికెట్ క్లర్క్, డివిజనల్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి ఉద్యోగాలకు అర్హులే. వాటికి సంబంధించిన ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. పోలీస్, అటవీ, ఎక్సైజ్ శాఖల్లోనూ ఉద్యోగాలు లభిస్తాయి. పరీక్ష, ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
డిగ్రీతోనూ ఉంటాయి..
- శ్యామ్ ప్రసాద్, ప్రిన్సిపల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భూపాలపల్లి
ఇంటర్ పాసై ఎప్సెట్లో మంచి ర్యాంకు రాని వారు, అర్హత సాధించని వారికి డిగ్రీలో మంచి అవకాశాలున్నాయి. బీఎస్సీ ఎంపీసీ, ఎంపీసీఎస్, బీఎస్సీ బీజడ్సీ, బీకాం, బీఏ కోర్సుల్లో చేరవచ్చు. వీటిలో కంప్యూటర్స్ కూడా సబ్జెక్ట్గా ఎంచుకోవచ్చు. బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చేసే వాళ్లకే కాకుండా డిగ్రీలో కంప్యూటర్స్ కోర్సులు చేసిన వారికి కూడా సాఫ్ట్వేర్ రంగంలో అవకాశాలుంటున్నాయి. కొన్ని డిగ్రీ కళాశాల్లో డేటా సైన్స్, బీబీఎం, బీసీఏ లాంటి కోర్సులు కూడా ఉంటున్నాయి. బీటెక్ నాలుగు సంవత్సరాలు ఉంటుంది, డిగ్రీ మూడేళ్లే. ఒక సంవత్సరం సమయం ఆదా అవుతుంది. డిగ్రీ తర్వాత ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి.
అధైర్యపడాల్సిన అవసరం లేదు
- దబ్బెట మహేష్, స్టూడెంట్ కౌన్సెలర్
ర్యాంకు రాలేదని అధైర్య పడాల్సిన అవసరం లేదు. మరోసారి ప్రయత్నం చేయవచ్చు లేదా సంవత్సరం కోల్పోవడం ఇష్టం లేని వారు అనేక ఇతర కోర్సుల్లోకి వెల్లడానికి అవకాశం ఉంది. మీరు చదువుకున్న కళాశాల అధ్యాపకుల సూచనలు పాటించి వారి సలహాతో మంచి మార్గం ఎంచుకోవాలి. ఏ రంగమైనా స్కిల్ ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగడానికి అవకాశం ఉంది. ఎప్సెట్ ప్రవేశ పరీక్ష రాసి అనుకున్న ఫలితం రాని వారు ఆర్ట్స్ కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంది. బీకాం కంప్యూటర్స్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, బీబీఎం, బీబీఏ లు పూర్తి చేసి మార్కెట్ రంగంలోకి వెళ్లడానికి అవకాశం ఉంది. ఈ కోర్సుల్లోనే హాస్పిటాలిటీ, టూరిజంతోపాటు ఇంకా అనేక అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళలు నిల్చోలేక.. పురుషులు కూర్చోలేక..
[ 15-06-2024]
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సులన్నీ కళకళలాడుతున్నాయి. మహిళా ప్రయాణికులతో నిండుగా దర్శనమిస్తున్నాయి. అదే సమయంలో సీట్ల కోసం వాగ్వాదాలు.. అప్పుడప్పుడు కొట్లాటలూ జరుగుతున్నాయి. -
వ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యాచరణ
[ 15-06-2024]
వర్షాకాల వ్యాధులను అరికట్టడానికి, ప్రజలను అప్రమత్తం చేయడానికి వైద్యాధికారులు, సిబ్బందితో కలిసి అవసరమైన కార్యాచరణ రూపొందించామని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కాజీపేట వెంకటరమణ వెల్లడించారు. -
కుక్కేసి.. కట్టేసి..!
[ 15-06-2024]
ఈ చిత్రం చూశారా.. కాళ్లు కట్టేసి, మెడలు విరిచేసి, వాహనంలో పదుల సంఖ్యలో కుక్కి ఇలా అక్రమంగా తరలిస్తున్నారు. మానవత్వాన్ని మర్చి దైవం లాంటి జీవాలను కబేళాలకు తరలిస్తున్నారు. ఇటీవల గోవిందరావుపేట మండల పరిధిలో పోలీసులు పట్టుకున్న వాహనంలో ఈ దుర్భర స్థితిలో మూగజీవాలు కనిపించాయి. -
కూచిపూడి నృత్యానికి ఖండాంతరాలు దాటి గుర్తింపు
[ 15-06-2024]
తెలుగు నేలపై పుట్టిన ‘కూచిపూడి నాట్యం’ ఖండాంతరాలు దాటి ఉనికిని చాటుకుంటోందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం రాత్రి రవీంద్రభారతి ప్రధాన మందిరంలో సద్గురు శ్రీ శివానంద నృత్యమాల (ఏ స్కూల్ ఆఫ్ డాన్స్) ఆధ్వర్యంలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ‘నృత్యోత్సవం-2024’ ఘనంగా నిర్వహించారు. -
ప్రతిభ చూపారు.. ప్రత్యేకంగా నిలిచారు!
[ 15-06-2024]
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) కోసం నిర్వహించిన పరీక్షలో ఉమ్మడి వరంగల్ విద్యార్థులు ప్రతిభ చూపారు. జాతీయ ఉపకార వేతనాలకు ఎంపికయ్యారు. -
జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు దంపతులు
[ 15-06-2024]
మావోయిస్టు దంపతులు ఇద్దరు శుక్రవారం కరీంనగర్ సీపీ, వరంగల్ కమిషనరేట్ ఇన్ఛార్జి కమిషనర్ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో జనజీవన స్రవంతిలో కలిశారు. కరీంనగర్లో జరిగిన మీడియా సమావేశంలో సీపీ వివరాలను వెల్లడించారు. -
చెరువుల పర్యవేక్షణ ఎవరిది?
[ 15-06-2024]
ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం నగరాలు, పట్టణాల్లో చెరువుల పునరుద్ధరణ పనులు తక్షణం చేపట్టాలని ఆదేశించగా, వరంగల్ నగరంలో మాత్రం వాటి బాధ్యత మాది కాదంటే మాది కాదని రెండు శాఖలు భీష్మించుకున్నాయి. వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లోని చెరువుల సంగతి నీటిపారుదల శాఖ చూసుకుంటుందని బల్దియా అధికారులంటున్నారు. -
అడ్డదారిలో మరణ ధ్రువీకరణ పత్రాల జారీ
[ 15-06-2024]
అధికారుల నిర్లక్ష్యం, పాలకవర్గం ఉదాసీనత కారణంగా జనగామ పురపాలనలో అక్రమాలు కొనసాగుతున్నాయి. మరణ ధ్రువీకరణ పత్రాల్లో అడ్డదారిలో అవకతవకలు జరుగుతున్నాయి. -
తండ్రి మందలించాడని బాలిక అదృశ్యం
[ 15-06-2024]
చదువుకోమని తండ్రి మందలించడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి సీఐ దుర్గా రామలింగ ప్రసాద్, ఎస్ఐ రాజు తెలిపిన వివరావీ.. మరిపెడ మండలం లక్ష్మతండాకు చెందిన బానోతు నరేష్ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి మియాపూర్ నడిగడ్డతండాలో కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. -
ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం
[ 15-06-2024]
జిల్లాలో ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలకు రంగం సిద్ధమైంది. దీంతో జిల్లా వ్యాప్తంగా 316 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేందుకు విద్యాశాఖ కార్యాచరణ రూపొందించింది. ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతుల నిమిత్తం ఇప్పటికే సీనియారిటీ జాబితాను అధికారులు విడుదల చేశారు. -
రెడ్క్రాస్ సొసైటీకి రాష్ట్ర స్థాయి పురస్కారాలు
[ 15-06-2024]
జిల్లాలో ఇండియన్ రెడ్క్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలకు వివిధ విభాగాల్లో జిల్లాకు నాలుగు రాష్ట్ర స్థాయి పురస్కారాలు దక్కాయి. -
కాలానుగుణ వ్యాధుల నివారణకు కార్యాచరణ
[ 15-06-2024]
‘వర్షాకాలం ఆరంభమైంది.. వాతావరణంలో మార్పులు, కలుషితమైన నీరు, అపరిశుభ్రమైన చల్లని ఆహారాలను తీసుకోవడం వల్ల కాలానుగుణ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా మలేరియా, డెంగీ, డయేరియాతో పాటు జలుబు ఇతర వ్యాధులు ప్రబలుతాయి. -
అన్నదాతలకు సేవలు మరింత విస్తరించేలా..!
[ 15-06-2024]
రాష్ట్రంలో ప్రస్తుతం 110 కేంద్రాల్లో రైతు వేదికల నుంచి నిర్వహించే రైతునేస్తం వీడియో కాన్ఫరెన్సు కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. ఈ నెలాఖరులోగా మరో 456 వేదికల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తాం.. -
సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు సిద్ధం
[ 15-06-2024]
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎ.అప్పయ్య అన్నారు. వైద్యులను, సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. -
‘మందుపాతరలతో అమాయకులను బలిగొంటున్నారు’
[ 15-06-2024]
మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోవడానికి సాధారణ ప్రజలను, భక్తులను, యాత్రికులను లక్ష్యం చేస్తూ.. నిత్యం నడిచే కాలిబాటల్లో మందుపాతరలను అమర్చి అమాయకులను బలిగొంటున్నారిని జిల్లా ఎస్పీ శబరీష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
తప్పిన ప్రాణాపాయం.. కాలు తొలగింపు
[ 15-06-2024]
మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలుడుకు తీవ్రంగా గాయపడిన వెంకటాపురం మండలంలోని వీఆర్కేపురం గ్రామానికి చెందిన డర్రా సునీత అనే మహిళకు ప్రాణాపాయం తప్పింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వర్షాకాలంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి: సీఎం రేవంత్రెడ్డి
-
వందేభారత్ స్లీపర్.. త్వరలో ట్రయల్ రన్
-
అనుకుందే జరిగింది.. భారత్, కెనడా మ్యాచ్ రద్దు
-
కేసీఆర్.. చట్టబద్ధ కమిషన్నే తప్పుపడతారా?: కేంద్ర మంత్రి బండి సంజయ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
గృహ రుణాన్ని ఆమోదించే ముందు బ్యాంకులు ఏమేం చూస్తాయ్?