ఎప్సెట్లో ర్యాంకు రాలేదా.. ఏం ఏం ఫర్వాలేదు..!
ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకు రాలేదని.. అర్హత సాధించలేదని ఆందోళన చెందుతున్నారా.. విద్యార్థులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. వీరి కోసం ఎన్నో కోర్సులు ఎదురు చూస్తున్నాయి.
విద్యార్థులకు ప్రత్యామ్నాయ అవకాశాలెన్నో..!
ఇంటర్తో ఉద్యోగాలు సైతం..
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి, కాజీపేట, న్యూస్టుడే: ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకు రాలేదని.. అర్హత సాధించలేదని ఆందోళన చెందుతున్నారా.. విద్యార్థులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. వీరి కోసం ఎన్నో కోర్సులు ఎదురు చూస్తున్నాయి. ఇటీవల వెలువడిన ఎప్సెట్ 2024 ఫలితాల్లో గతంతో పోలిస్తే చాలా తక్కువ మంది అర్హత సాధించారు. వీరి సంఖ్య 30 శాతానికిపైగా ఉంటుంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తర్వాత ఏమిటి అనే ఆందోళనలో ఉన్నారు.
సంప్రదాయ కోర్సులు అనేకం..
ఇంజినీరింగ్కు సమాన అవకాశాలు ప్రస్తుతం ఎన్నో ఉన్నాయి. డిగ్రీ కళాశాలల్లోనూ ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్లు వస్తున్నాయి. బీఎస్సీ, బీకాంలే కాకుండా ప్రస్తుతం అవసరమైన ఆధునిక కోర్సులు కంప్యూటర్ సైన్స్ లాంటివి జతచేసుకోవచ్చు. ఇంజినీరింగ్తో సంబంధం లేకుండా కోచింగ్ సెంటర్లలో పైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనాలసిస్ తదితర కోర్సులు నేర్చుకుని నేరుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది.
- డిగ్రీలో బీఎస్సీ ఎంపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) కోర్సు చేయొచ్చు. ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, జియాలజీ లాంటి కాంబినేషన్లు చదవొచ్చు. బీఎస్సీలో డేటా సైన్స్, బీబీఏ, బీకాం, జర్నలిజం, టూరిజం లాంటి కోర్సులనూ ఎంచుకోవచ్చు. న్యాయవాద వృత్తిపై ఆసక్తి ఉంటే ఐదు సంవత్సరాల ఎల్ఎల్బీలో చేరవచ్చు. సివిల్ సర్వీసెస్కు ఏ డిగ్రీ చదివినా అర్హులే. ఇవేకాక చరిత్ర, తెలుగు సాహిత్యం, ఆంగ్లం, సోషియాలజీ, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ తదితర కోర్సుల్లోనూ చేరవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్, బ్యాంకింగ్లో కూడా ఏదేని డిగ్రీ అర్హతతో పోటీ పడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఇంటి గ్రేటెడ్ కోర్సులు..
ప్రస్తుతం వరంగల్ లాంటి నగరాల్లోనూ అనేక కళాశాలలు, కోచింగ్ సెంటర్లు వస్తున్నాయి. వీటిలో విషయ నిపుణుల అవసరం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రసాయన, భౌతిక శాస్త్రం, గణిత అధ్యాపకులకు మంచి డిమాండ్ ఉంటుంది. ఎప్సెట్లో ర్యాంకులు సాధించని విద్యార్థులు ఇంటిగ్రెటెడ్ కోర్సుల్లో చేరవచ్చు. ఇది ఐదు సంవత్సరాల కోర్సుగా ఉంటుంది. నేరుగా మాస్టర్ డిగ్రీ పొందడానికి అవకాశం ఉంటుంది. కళాశాలల్లో లెక్చరర్లుగా లేదా ల్యాబ్లలో ఉద్యోగాలు సంపాదించవచ్చు. విదేశాలల్లో కూడా అధ్యాపకులుగా వెళ్లడానికి అవకాశం ఉంటుంది.
నర్సింగ్లో అనేక మార్గాలు..
ఎప్సెట్లో అనుకున్నంత ర్యాంకులు సాధించని వారు నర్సింగ్, ఫార్మసీ, పిజియోథెరఫీ, అనెస్థీషియా లాంటి కోర్సులను ప్రైవేటుగా చదువుకోవడానికి అవకాశం ఉంది. కొన్ని చోట్ల మేనేజ్మెంట్ కోటాలో పొందవచ్చు.
చదువు.. కొలువు..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్డీఏ అండ్ ఎన్ఏ) పరీక్షను ఇంటర్ అన్ని గ్రూపుల వారు రాసుకోవచ్చు. ఈ పరీక్షలో ఎంపికైన వారికి బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సులను చదివిస్తారు. శిక్షణ అనంతరం ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ల్లో తీసుకుంటారు.
‘గతంలో పరిమిత కోర్సులే ఉండేవి. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు నూతన కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ర్యాంకు రాలేదని అధైర్య పడక ముందుకు సాగాలి. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలి. సమాన అవకాశాలున్నప్పుడు ప్రయత్నిస్తే మంచి ఫలితాలు సాధించొచ్చు’.
బీఎస్సీ, బీబీఏ, బీకాం, జర్నలిజం, టూరిజం , ఎల్ఎల్బీ
ప్రవేశ పరీక్షలతోనూ..
ఇంటర్మీడియట్ విద్యార్హతతో ఎయిర్ఫోర్స్, నేవీ, ఆర్డీ, కోస్టుగార్డు, పోస్టల్, రైల్వేస్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. కానిస్టేబుల్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ లోకోపైలట్, జూనియర్ క్లర్క్, టికెట్ క్లర్క్, డివిజనల్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి ఉద్యోగాలకు అర్హులే. వాటికి సంబంధించిన ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. పోలీస్, అటవీ, ఎక్సైజ్ శాఖల్లోనూ ఉద్యోగాలు లభిస్తాయి. పరీక్ష, ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
డిగ్రీతోనూ ఉంటాయి..
- శ్యామ్ ప్రసాద్, ప్రిన్సిపల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భూపాలపల్లి
ఇంటర్ పాసై ఎప్సెట్లో మంచి ర్యాంకు రాని వారు, అర్హత సాధించని వారికి డిగ్రీలో మంచి అవకాశాలున్నాయి. బీఎస్సీ ఎంపీసీ, ఎంపీసీఎస్, బీఎస్సీ బీజడ్సీ, బీకాం, బీఏ కోర్సుల్లో చేరవచ్చు. వీటిలో కంప్యూటర్స్ కూడా సబ్జెక్ట్గా ఎంచుకోవచ్చు. బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చేసే వాళ్లకే కాకుండా డిగ్రీలో కంప్యూటర్స్ కోర్సులు చేసిన వారికి కూడా సాఫ్ట్వేర్ రంగంలో అవకాశాలుంటున్నాయి. కొన్ని డిగ్రీ కళాశాల్లో డేటా సైన్స్, బీబీఎం, బీసీఏ లాంటి కోర్సులు కూడా ఉంటున్నాయి. బీటెక్ నాలుగు సంవత్సరాలు ఉంటుంది, డిగ్రీ మూడేళ్లే. ఒక సంవత్సరం సమయం ఆదా అవుతుంది. డిగ్రీ తర్వాత ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి.
అధైర్యపడాల్సిన అవసరం లేదు
- దబ్బెట మహేష్, స్టూడెంట్ కౌన్సెలర్
ర్యాంకు రాలేదని అధైర్య పడాల్సిన అవసరం లేదు. మరోసారి ప్రయత్నం చేయవచ్చు లేదా సంవత్సరం కోల్పోవడం ఇష్టం లేని వారు అనేక ఇతర కోర్సుల్లోకి వెల్లడానికి అవకాశం ఉంది. మీరు చదువుకున్న కళాశాల అధ్యాపకుల సూచనలు పాటించి వారి సలహాతో మంచి మార్గం ఎంచుకోవాలి. ఏ రంగమైనా స్కిల్ ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగడానికి అవకాశం ఉంది. ఎప్సెట్ ప్రవేశ పరీక్ష రాసి అనుకున్న ఫలితం రాని వారు ఆర్ట్స్ కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంది. బీకాం కంప్యూటర్స్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, బీబీఎం, బీబీఏ లు పూర్తి చేసి మార్కెట్ రంగంలోకి వెళ్లడానికి అవకాశం ఉంది. ఈ కోర్సుల్లోనే హాస్పిటాలిటీ, టూరిజంతోపాటు ఇంకా అనేక అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం