బరువు పాఠం.. పిల్లలకు నేర్పిద్దాం
సెలవులు ముగింపు దశకు వచ్చాయి. వేసవి శిబిరాలు సైతం చివరి దశకు చేరుకున్నాయి. తాతయ్య, నానమ్మ, అమ్మమ్మల ఇళ్ల వద్దకు వెళ్లిన పిల్లలు తిరిగి వస్తున్నారు.
సెలవుల చివరి రోజులు సద్వినియోగం చేసుకోవాలి
సెలవులు ముగింపు దశకు వచ్చాయి. వేసవి శిబిరాలు సైతం చివరి దశకు చేరుకున్నాయి. తాతయ్య, నానమ్మ, అమ్మమ్మల ఇళ్ల వద్దకు వెళ్లిన పిల్లలు తిరిగి వస్తున్నారు. విహారయాత్రలు సైతం ముగిసిపోయాయి. ఈ సెలవుల్లో ఇంటి వద్ద ఉండే పిల్లలకు చదువు వల్ల కలిగే శ్రమ ఉండదు.. పైగా ఇష్టమున్నది తినడం వల్ల అధిక బరువు పెరగడానికి అవకాశముంది. ఈ నేపథ్యంలో పాఠశాలలు ప్రారంభం అయ్యే నాటికి పిల్లలను టీవీ, చరవాణులకు దూరంగా ఉంచాలి. వారు తినే ఆహారంపై దృష్టి పెట్టాలి. ఈత నేర్చుకోవడం, చిన్నచిన్న ఆటలు ఆడుకోవడం అలవాటు చేయాలి.
ఎంజీఎం ఆసుపత్రి, జనగామ టౌన్, న్యూస్టుడే
ఇదీ కారణం..
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం నివారించదగిన 10 ఆరోగ్య సమస్యల్లో స్థూలకాయం ఒకటి. ఇది పెరిగిపోతుండటానికి టీవీలు, కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం గడపటం, పిల్లలకు ఆటస్థలాలు కనుమరుగు అవుతుండటం, వ్యాయామం చేయకపోవడం, శారీరక శ్రమలేక, ఆహారంపై అవగాహన లేక చిరుతిళ్లకు అలవాటు పడటం వంటి జీవశైలి దోహదపడుతోందని నిపుణులు చెబుతున్నారు.
వ్యాధుల దాడి..
స్థూలకాయం కారణంగా గుండెజబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, ఊపిరితిత్తుల జబ్బులు, పిత్తాశయంలో, కిడ్నీలో రాళ్లు, అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు వంటివి చుట్టుముడుతున్నాయి. భారీ కాయాన్ని మోయాల్సి రావడంతో మోకాలి కీళ్లు అరిగే ప్రమాదముంది. కాలేయం దెబ్బతింటుంది. ఇన్స్లిన్ రెసిప్టెన్స్ పెరుగుతుంది. దీంతో మధుమేహ నియంత్రణ కష్టమవుతుంది. ఇవి పక్షవాతానికి, గుండె జబ్బులకు దారితీస్తాయి. లావు పెరిగేకొద్ది శారీరక, మానసిక రుగ్మతలు పెరుగుతాయి.
సర్వేలో ఆందోళనకరంగా..
పట్టణ ఉన్నత, మధ్యతరగతి మహిళల్లో 30-50 శాతం, పురుషుల్లో 32 శాతం మంది స్థూలకాయంతో బాధపడుతున్నట్లు ఇటీవల జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 18 ఏళ్లలోపు పిల్లల్లో 5 శాతం మంది ఊబకాయం, అధిక బరువుతో సతమతమవుతున్నట్లు వైద్యుల అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం..
జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్కు చెందిన 15 ఏళ్ల బాలుడు ఊబకాయంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. 20 కిలోలు అధిక బరువుతో నడవడానికి, శ్వాస తీసుకోవడంలోనూ అవస్థలు ఎదుర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు ఈ వేసవిలో మితాహారం తీసుకోవడంతో పాటు రోజూ నడక అలవాటు చేసుకున్నారు. శాఖాహారానికి మారి ఒకే పూట ఆహారం, రాత్రిళ్లు పండ్లు తింటూ, బరువు సమస్యను అధిగమించారు. ప్రస్తుతం చలాకీగా మారారు.
మీకు తెలుసా..
- అధిక లావు ఉండటమే ఊబకాయమని పిలుస్తారు. అధిక బరువును బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) అనే గణాంక పద్ధతి ద్వారా ఎత్తు, బరువు ప్రకారం లెక్కిస్తారు. ఓ వ్యక్తి ఊబకాయం కలిగి ఉన్నాడనే నిర్ధారణ చేయడానికి ఉండాల్సిన బరువు కంటే 20 శాతం అధికంగా ఉంటే ఒబెసిటి కలిగిన వ్యక్తిగా గుర్తిస్తారు.
- ఏ వయస్సులోనైనా బరువు పెరిగే అవకాశముంటుంది. కొందరూ వంశపారంపర్యంగా ఈ సమస్య భారిన పడవచ్చు. తల్లిదండ్రుల్లో ఇద్దరు స్థూలకాయులైతే 73 శాతం పిల్లలకు అది రావొచ్చు. ఎవరో ఒకరు స్థూలకాయులైతే పిల్లల్లో 45 శాతం మంది దీని బారిన పడుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరిలో వివిధ రకాల జబ్బులకు వాడే మాత్రలు అధిక బరువుకు కారణమవుతాయి.
- పిల్లల్లో అధిక బరువు నివారించాలంటే అధిక చక్కెర, కొవ్వు, ఉప్పు ఎక్కువగా ఉండే అల్ట్రాప్రాసెస్డ్ ఆహారం (చిప్స్, పిజ్జాలు, బర్గర్లు, కూల్డ్రింకులు) తగ్గించాలని ఇటీవల ‘జాతీయ పోషకాహార సంస్థ’ (ఎన్ఐఎన్) విడుదల చేసిన సర్వే పేర్కొంది.
- ఒక కిలో బరువు పెరిగితే అదనంగా 30 కిలోమీటర్ల దూరం వరకు రక్తాన్ని నెట్టాల్సిన భారం గుండెపై పడుతుంది. దీంతో గుండె ఎక్కువ బలంతోపనిచేయడం వల్ల గుండె వైఫల్యానికి దారితీస్తుంది.
- ఒబేసిటి ఉన్నట్లు అనిపిస్తే ప్రభుత్వ జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులను సంప్రదించాలని జనగామ వైద్యాధికారి హరీశ్రాజ్ తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆర్బీఎస్కే పరీక్షల్లో ఊబకాయం బారిన పడిన 18 సంవత్సరాలలోపు పిల్లలు
- హనుమకొండ 11,675
- వరంగల్ 9,535
- మహబూబాబాద్ 8,876
- జనగామ 5,741
- ములుగు 3,661
- జయశంకర్ భూపాలపల్లి 3,450
సమతుల ఆహారమే సరైనది
అధిక బరువు పెరగకుండా ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి. కూరగాయలు, పప్పులు, చిక్కుళ్లు మేలు చేస్తాయి. ఆహారంలో బియ్యం ఒక్కటే గాకుండా చిరుధాన్యాలు కలిసి ఉండేలా చూసుకోవాలి. పప్పుదినుసుల వల్ల ప్రొటీన్లు ఎక్కువ లభిస్తాయి. మంచి కొవ్వు కోసం రోజుకు 25-35 గ్రాముల నూనెగింజలు (వేరుశనగ, గుమ్మడి, బాదం) తీసుకుంటే మంచిది. ఇంట్లో తయారుచేసినవే తినిపించాలి. పిల్లలు తినడంలేదని వారడిగిన చిరుతిళ్లను ప్రోత్సహించొద్దు. చక్కర ఎక్కువగా ఉన్న మిఠాయిలు ఇవ్వొదు. ఆహారం తిన్నవెంటనే మిఠాయిలు, జ్యూస్, కూల్డ్రింక్లు ఇవ్వొద్దు. మాంసాహారం తగ్గించాలి. చిన్నచిన్న వ్యాయామాలు చేయించాలి. పిల్లలతోపాటు పెద్దలు ప్రతి రోజు ఏదో ఒక సమయంలో వ్యాయామం అలవాటు చేసుకున్నట్లయితే అధిక బరువు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
డా.రోహిణి సింధూరి, పోషకాహార నిపుణురాలు, ఎంజీఎం ఆసుపత్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే