logo

‘కేసీఆర్‌ కుటుంబం జైలుకెళ్లడం ఖాయం’

కేసీఆర్‌ కుటుంబమంతా ఒక దొంగల ముఠా అని, జూన్‌ 4 తర్వాత అందరూ చర్లపల్లి జైలుకెళ్లడం ఖాయమని పట్టుభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న అన్నారు.

Published : 25 May 2024 03:24 IST

మాట్లాడుతున్న తీన్మార్‌ మల్లన్న, చిత్రంలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, నాయకులు

నయీంనగర్, న్యూస్‌టుడే: కేసీఆర్‌ కుటుంబమంతా ఒక దొంగల ముఠా అని, జూన్‌ 4 తర్వాత అందరూ చర్లపల్లి జైలుకెళ్లడం ఖాయమని పట్టుభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న అన్నారు. శుక్రవారం హనుమకొండ కాంగ్రెస్‌ భవన్‌లో పార్టీ డివిజన్‌ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, యువజనులతో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తీన్మార్‌ మల్లన్న ప్రసంగిస్తూ.. మాజీ మంత్రి కేటీఆర్‌ నగరానికి వచ్చి తనను దొంగ అని సంబోధించారని, అసలు వారిదే దొంగల కుటుంబమని అన్నారు. తనను బ్లాక్‌మెయిలర్‌గా ఈ నెల 27 వరకు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు. జేఎన్‌టీయూ, ఓయూ, కేయూలో అభ్యసించిన వారిని పల్లీబఠానీలు అమ్ముకునేవారితో పోలిస్తే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. వక్ఫ్‌బోర్డ్‌ ఛైర్మన్‌ అజ్మతుల్లా, ఏఐసీసీసీ జార్డినేటర్‌ డా.కత్తి వెంకటస్వామిగౌడ్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ డా.రియాజ్, టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సరళ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని