పట్టాలెక్కనున్న ప్రగతి..!
రామగుండం-మణుగూరు కోల్ కారిడార్ దశాబ్దాల కల.. బొగ్గు, సరకు రవాణా నిమిత్తం దాదాపు నాలుగు దశాబ్దాల కిందట ప్రతిపాదించిన ఈ రైల్వే లైను ఏర్పాటుకు మరోసారి కదలిక వచ్చింది.
రామగుండం.. మణుగూరు రైల్వే లైనుపై కదలిక
బొగ్గు, ప్రజా రవాణా సులభతరం
ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రం సమీపంలో రైల్వేలైను
కోసం మట్టినమూనాలు సేకరిస్తున్న సిబ్బంది
రామగుండం-మణుగూరు కోల్ కారిడార్ దశాబ్దాల కల.. బొగ్గు, సరకు రవాణా నిమిత్తం దాదాపు నాలుగు దశాబ్దాల కిందట ప్రతిపాదించిన ఈ రైల్వే లైను ఏర్పాటుకు మరోసారి కదలిక వచ్చింది. గత కేంద్ర బడ్జెట్లో ఈ కొత్త రైల్వే లైనుకు రూ.10 కోట్లు కేటాయించారు. తాజాగా భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైలు కల నెరవేరే అవకాశం ఉంది.
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి
అధికారుల అంచనా ప్రకారం ఈ రైల్వే లైను పెద్దపల్లి జిల్లా రామగుండం నుంచి రాఘవాపురం మీదుగా మంథని, మల్హర్ మండలం తాడిచర్ల, భూపాలపల్లి, గణపురం, ములుగు జిల్లా వెంకటాపుర్, తాడ్వాయి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వరకు ఉంటుంది.
తగ్గనున్న దూరాభారం: రామగుండం నుంచి మణుగూరుకు వరంగల్, మహబూబాబాద్ మీదుగా 300 కిలోమీటర్లు ఉంటుంది. కొత్త రైలు మార్గంతో ఇది 207.80 కిలోమీటర్లకు తగ్గుతుంది. దాదాపు 90 కి.మీ. వరకు ఆదా అవుతుంది. మణుగూరు నుంచి భద్రాచలం, కొత్తగూడెం, విజయవాడ, విశాఖపట్నం, తదితర ప్రాంతాలకు చేరుకోవచ్చు. దీంతో ప్రయాణికులకు దూరాభారం తగ్గుతుంది.
సర్వేలో భాగంగా వేసిన మార్కింగ్
రెండేళ్లుగా సర్వేలు ముమ్మరం..
భూపాలపల్లిలో 1984లోనే బొగ్గు గనులు ఏర్పాటయ్యాయి. బొగ్గు తరలింపునకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనకు అప్పుడే బీజం పడింది. అది పట్టాలెక్క లేదు. 1994, 2008, 2018 లో సర్వేలు చేపట్టారు. నివేదికలు కేంద్రానికి సమర్పించారు. రెండేళ్ల కిందట సరకు రవాణా నిమిత్తం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ (డీఎఫ్సీ) వారు నూతన మార్గానికి ఈ మార్గంలో సర్వే చేపట్టారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మట్టి నమూనాలు సేకరించారు.
పెరిగిన అంచనాలు..
ఈ రైల్వేలైను 2013-14లో రూ.1,112 కోట్ల అంచనాతో మంజూరైంది. తర్వాత రూ.2,911 కోట్లకు అంచనా వ్యయం పెంచారు. పనులు చేపట్టేందుకు నిధులను మంజూరు చేసే అవకాశం ఉంది. గత బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించారు.
కోల్ కారిడార్గా..
ఈ రైలు మార్గం ఏర్పాటైతే సులభంగా, వేగంగా సరకు రవాణాను వ్యాగన్ల ద్వారా ఒకచోటు నుంచి మరోచోటుకు చేర్చవచ్చు. రామగుండం-మణుగూరు రైలు మార్గం ద్వారా పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను కోల్ కారిడార్గా తీర్చిదిద్దనున్నారు. సింగరేణి ప్రాంతాలకు బొగ్గు రవాణా చేయవచ్చు. భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లో పంట ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు రవాణా చేయవచ్చు. ములుగు జిల్లాలోని లాటరైట్ లాంటి ఖనిజాలను రవాణా చేసే వీలుంటుంది.
భూసేకరణ ప్రక్రియతో ముందడుగు..
ఈ రైల్వే లైను ఒక్కో దశ దాటుకుని భూసేకరణ గెజిట్ నోటిఫికేషన్ వరకు వచ్చింది. నాలుగు జిల్లాల పరిధిలో 207.80 కిలోమీటర్ల రైల్వే లైను కోసం భూసేకరణ చేపట్టే అవకాశం ఉంది. ఇది దశల వారీగా చేపట్టనున్నారు. ముందుగా కేంద్ర రైల్వే శాఖ నుంచి ప్రత్యేక బృందం పర్యటించనుంది. ఆ తర్వాత ఎన్జీటీ, అటవీశాఖ అనుమతులు తీసుకోనున్నారు. అనంతరం భూనిర్వాసిత గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపడతారు. భూములకు ధరలు నిర్ణయించి పరిహారం చెల్లించిన అనంతరం పనులు పట్టాలెక్కే అవకాశం ఉంది.
పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి దోహదం
ప్రతిపాదిత రామగుండం-మణుగూరు రైల్వేలైను ఏర్పాటైతే సరకు రవాణాతో పాటు ప్రజారవాణా ప్రారంభిస్తే జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. కాళేశ్వరం, రామప్ప, మేడారం, కోటగుళ్లు, మల్లూరు ఆలయాలతో పాటు లక్నవరం జలాశయం, బొగత జలపాతం, పాండవుల గుట్టలు, తదితర పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలకు సులభంగా చేరుకోవచ్చు. ప్రముఖ పుణ్యక్షేత్రాలకు, పర్యాటక కేంద్రాలకు రైలుమార్గం ద్వారా వెళ్లొచ్చు. మేడారం మహాజాతర, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి మరింత ఆదరణ లభిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్