అసంపూర్తి పనులు.. విద్యార్థులకు వెతలు
రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది.
ములుగు న్యూస్టుడే: ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా చేపట్టిన పాఠశాలల మరమ్మతులు, నూతన నిర్మాణాల పనులకు నిధుల కొరత ఏర్పడటంతో.. ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయింది. దీంతో ఏడాదిగా పనులు అసంపూర్తిగా వెక్కిరిస్తున్నాయి. గతేడాది మే చివరి నాటికి పూర్తి చేయాలని గడువు విధించినప్పటికీ.. గుత్తేదారులు, పాఠశాలల యాజమాన్య కమిటీలకు బిల్లులు రాకపోవడంతో.. పనులను మధ్యలోనే నిలిపివేశారు. రూ.30 లక్షల లోపున్న పనులను పాఠశాల యాజమాన్య కమిటీలకు, ఆపైనున్నవి గుత్తేదార్లకు టెండరు ద్వారా అప్పగించారు. ములుగు జిల్లాలో ఈ పథకం పనులు, ప్రస్తుత పరిస్థితిపై ‘న్యూస్టుడే’ బృందం శుక్రవారం పరిశీలన చేసింది.
జిల్లా పరిధిలోని 125 పాఠశాలల్లో మొత్తం 2,839 పనులు చేపట్టగా, రూ.21.79 కోట్లు బిల్లులు చేశారు. ఇందులో 2,407 పనులకు రూ.18.60 కోట్లు చెల్లించగా, రూ.3.19 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమం, ఈడబ్ల్యూ ఐడీసీ ఇంజినీరింగ్ విభాగాలు పనులను పర్యవేక్షిస్తున్నాయి.
పూర్తికాని టాయిలెట్ బ్లాక్
ఎంపికైన పాఠశాల పేరు: జడ్పీ ఉన్నత పాఠశాల, ఎంపీపీఎస్, దుంపెల్లిగూడెం
నిధుల కేటాయింపు: రూ.80 లక్షలు
చేపట్టాల్సిన పనులు: వంటశాలలు, టాయిలెట్లు నిర్మాణం
ప్రస్తుతం పనుల ఏదశలో ఉన్నాయి: టాయిలెట్ బ్లాక్ అసంపూర్తిగా మిగిలింది.
ఇతర నిధులు కేటాయించే అవకాశం ఉందా?: లేదు.
ఇతర అంశాలు: చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు పనులు నిలిపివేశారు. బిల్లులు చెల్లిస్తే అసంపూర్తి పనులు చేసే అవకాశం ఉంది.
న్యూస్టుడే, గోవిందరావుపేట
కిటికీ తలుపులు లేకుండా
- తిమ్మంపేట ప్రాథమిక పాఠశాల
- సుమారు రూ.21 లక్షలు
- కిటికీలకు తలుపులు, విద్యుత్తు, ప్రహరీ, గేటు, తాగునీరు, బోరు నిర్మాణం
- లేదు
- భవనం మాత్రమే పూర్తయింది. కిటికీలకు తలుపులు లేవు. విద్యుత్తు పనులు నాసిరకం. మిగతావన్నీ పెండింగ్లో ఉన్నాయి. ః ఉన్నతాధికారులు పరిశీలించి పెండింగ్ పనులు పూర్తయ్యేలా చూడాలి.
మంగపేట, న్యూస్టుడే
కలెక్టర్ పరిశీలించినా..
- జడ్పీ ఉన్నత పాఠశాల, వెంకటాపురం
- రూ.1.70 కోట్లు
- ఎనిమిది గదులతో భవన నిర్మాణం, డైనింగ్ హాల్, సంప్, పూర్వపు భవనాల ఆధునికీకరణ, ప్రహరీ నిర్మాణం
- లేదు.
- భవన నిర్మాణం అసంపూర్తిగా ఉంది. డైనింగ్ హాల్, సంపు, నల్లాల ఏర్పాటు ప్రక్రియ ఆగింది. ప్రహరీ మొదలు కాలేదు.
- గత నెల 15న జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ పాఠశాలను సందర్శించి గుత్తేదారు, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. పెండింగ్ బిల్లులు రూ.43 లక్షలు చెల్లిస్తామని హామీ ఇచ్చినా.. పనులు అసంపూర్తిగానే ఉన్నాయి.
న్యూస్టుడే, వెంకటాపురం
రంగులు వేయకుండా
- నర్సింగాపురం ప్రాథమిక పాఠశాల
- రూ.3.70 లక్షలు
- స్లాబుకు మరమ్మతులు, పగుళ్లను సిమెంటుతో పూడ్చడం, వంటశాలకు మరమ్మతులు, బోరుకు కొత్తమోటారు బిగించడం, విద్యుత్తు, రంగులు వేయడం
- లేదు
- స్లాబు మరమ్మతులు చేశారు. బోరుకు మోటారు బిగించారు. పగుళ్లకు మరమ్మతులు చేయాలి. రేకులు అమర్చాలి. రంగులు వేయాల్సి ఉంది.
- అధికారులు చొరవచూపితేనే విద్యార్థులకు మేలు.
న్యూస్టుడే, తాడ్వాయి
నిలిచిపోయిన వంటగది
- మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, జగన్నాథపురం
- రూ.37.90 లక్షలు
- వంటగది, భోజనశాల, బాలబాలికలకు మరుగుదొడ్లు, నల్లాలు, తాగునీరు, విద్యుత్తు
- పనులన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి.
- లేదు
- ఉన్నతాధికారులతో సమీక్షించి పెండింగ్ పనులు చేపట్టాలి.
న్యూస్టుడే, వాజేడు
అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పనులు
‘మన ఊరు మన బడి’ కింద పెండింగ్లో ఉన్న చిన్న పనులను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేయాలని సూచించాం. విద్యుత్తు, టాయిలెట్లు, తాగునీరు, రంగులు వేయడం, తదితర పనులు చేపట్టి పూర్తిచేస్తారు. పెద్ద పనుల (అదనపు తరగతి గదులు, తదితర)కు సంబంధించి తర్వాత నిర్ణయం తీసుకుంటాం. పాఠశాలల్లో చేపట్టిన పనులను పరిశీలిస్తున్నాం.
జి.పాణిని, డీఈవో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు