ఈనామ్కు ఆరేళ్లు.. అమలుకు ఎన్నేళ్లు..?
రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, మార్కెట్ ఆదాయాన్ని పెంచడం, మోసాలను అరికట్టి జవాబుదారీతనాన్ని కల్పించడం వంటి ఉన్నత లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం 2016లో జాతీయ వ్యవసాయ విపణి (నామ్) విధానాన్ని తీసుకొచ్చింది.
అడ్డదారుల కోసమే పట్టింపులేనితనం
కేసముద్రం, ఎనుమాముల మార్కెట్, నెహ్రూసెంటర్: న్యూస్టుడే
ఎనుమాముల మార్కెట్
రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, మార్కెట్ ఆదాయాన్ని పెంచడం, మోసాలను అరికట్టి జవాబుదారీతనాన్ని కల్పించడం వంటి ఉన్నత లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం 2016లో జాతీయ వ్యవసాయ విపణి (నామ్) విధానాన్ని తీసుకొచ్చింది. ఆరేళ్లు దాటుతున్నా ఎక్కడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు.. టెండర్లకు మాత్రమే పరిమితమైంది. అడ్డదారుల కోసమే కొంత మంది వ్యాపారులు ఈనామ్ అమలుకు సహకరించడం లేదని.. వారికి కొందరు అధికారులు సహకరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
టెండర్లకు మాత్రమే పరిమితం
ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, జనగామ, పరకాల, నర్సంపేట, కేసముద్రం, మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లలో ఈనామ్ అమలు చేస్తున్నారు. సౌకర్యాలు కొరత, రైతులు, వ్యాపారులు, మార్కెట్ సిబ్బందికి దీనిపై సరైన అవగాహన లేకపోవడంతో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. దోపిడీ ఎప్పటిలాగే కొనసాగడంతో రైతులు నష్టపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్ బయట ఖరీదు నిర్వహిస్తూ రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారు.
కేసముద్రం మార్కెట్లో విక్రయానికి వచ్చిన కంది రాశులపై ఈనామ్ చీటీలు
కల్పించాల్సిన సౌకర్యాలు ఇవి..
- మార్కెట్ యార్డులో అంతటా వైఫై సౌకర్యం
- గేట్ల వద్ద వేబ్రిడ్జి
- నాణ్యత వివరాలను లాట్ నెంబరు ఆధారంగా అంతర్జాలంలో నమోదు
- ఇతర రాష్ట్రాలు, జిల్లాల వ్యాపారులు ఖరీదు చేసేలా ప్రత్యేక చర్యలు
- సరకులు నిల్వకు శీతల గిడ్డంగులు ఏర్పాటు
- సరకు విక్రయించిన డబ్బులు అదే రోజు ఆన్లైన్లో రైతు ఖాతాలో జమ
- రైతుబంధు పథకంలో సరకులకు 70 శాతం రుణం
- కనీస ధరకు తక్కువ ధరతో కోట్ చేయకుండా అంతర్జాలంలో ఏర్పాట్లు
- టెండరు తెరిచిన వెంటనే రైతుల ఫోన్కు సంక్షిప్త సమాచారం
అమల్లోకి వస్తే..
ఈ నామ్ విధానంలో మార్కెట్లోని అన్ని విభాగాలను కంప్యూటరీకరిస్తారు. ఫలితంగా మార్కెట్ ప్రధాన ద్వారం నుంచే పారదర్శకత మొదలవుతుంది.
- జీరో వ్యాపారం లేకపోవడంతో మార్కెట్ ఆదాయం పెరుగుతుంది.
- ధర కోడ్ చేయడం రహస్యంగా ఉండడంతో వ్యాపారులు మధ్య పోటీ పెరుగుతుంది.
- దేశవ్యాప్తంగా వ్యాపారులు టెండరు వేయడంతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది.
- రైతులకు అదే రోజు ఆన్లైన్లో చెల్లింపు ఉంటుంది
- పంట నాణ్యతను శాస్త్రీయంగా పరీక్షించడం వల్ల రైతుకు సరైన ధర లభిస్తుంది.
- దేశవ్యాప్తంగా మార్కెట్లలో పలుకుతున్న ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
రైతులకు మేలు జరుగుతుంది
రెండెకరాల్లో మిర్చి సాగు చేశాను. మొదటి విడతలో 11 క్వింటాళ్ల మిర్చి క్వింటాలు ధర రూ.16 వేల చొప్పున విక్రయించాను. మార్కెట్ నిబంధనల ప్రకారం రూ.3,520 కమీషన్ తీసుకోవాల్సి ఉండగా అదనంగా మరో రూ.3,520 తీసుకున్నారు. ఈనామ్ పూర్తిస్థాయిలో అమలు జరిగితే కాంటా నిర్వహించిన వెంటనే ఆన్లైన్లో సొమ్ము జమవుతుంది. అదనంగా కమీషన్ చెల్లించేది ఉండదు. అమలవుతే రైతులకు మేలు జరుగుతుంది.
కన్నెబోయిన చిరంజీవి, రైతు, ధర్మారావుపేట, ఖానాపురం
సాంకేతిక పరికరాలను సమకూరుస్తున్నాం
ఈనామ్ అమలు కోసం అవసరమైన సాంకేతిక పరికరాలను సమకూర్చుతున్నాం. వరంగల్, ఖమ్మం మార్కెట్లలో మిర్చి ఎక్కువ రకాలు ఉండటంతో ఈనామ్ ఖరీదు చేయడానికి క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని కేసముద్రం, మహబూబాబాద్ మార్కెట్లలో మిర్చి ఈనామ్లో ఖరీదు చేస్తున్నాం. ఆన్లైన్ చెల్లింపుల సమస్య అన్ని రాష్ట్రాల్లో ఉంది. క్షేత్రస్థాయిలో సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం.
మల్లేశం, మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల