చతికిల‘బడి’న అభివృద్ధి
పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ బడులకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించాలని గత ప్రభుత్వం 22 ఏప్రిల్, 2022 గత రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది.
న్యూస్టుడే, వరంగల్ విద్యావిభాగం
పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ బడులకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించాలని గత ప్రభుత్వం 22 ఏప్రిల్, 2022 గత రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద జిల్లాలో ఇప్పటి వరకు అశించిన మేరకు అభివృద్ధి పనుల జరగకపోవడం నిరాశకు గురి చేస్తోంది. జిల్లాలో మొదటి విడతలో 227 బడులను ఎంపిక చేయగా.49 పాఠశాలలకు శంకుస్థాపనలు చేశారు. వీటిలో 39 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. మిగిలిన పదితోపాటు మరో 27 పాఠశాలలకు సంబంధించి 25 శాతం నిధులను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఖాతాలకు బదిలీ చేశారు. ఇటీవల కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం, నిధులు పూర్తిస్థాయిలో లేకపోడంతో పనులు కుంటుపడ్డాయి.
నర్సంపేట, న్యూస్టుడే
అసంపూర్తిగానే పనులు
వర్ధన్నపేట: మండలంలోని 12 ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు- మన బడి కింద ఎంపిక చేసి పనులు చేపట్టారు. దమ్మన్నపేటలోని రెండు పాఠశాలలు మినహా మిగిలిన 10 పాఠశాలల్లో పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయి. వర్ధన్నపేట ప్రభుత్వ పాఠశాలలో ఒక్క ప్రహరీ తప్ప ఇతర పనులు కాలేదు. ఈ పాఠశాలలో మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉంది. ఇటీవల ఎన్నికల నిమిత్తం రెండు మరుగుదొడ్లను తాత్కాలికంగా మరమ్మతులు చేశారు.
పిల్లర్లకే పరిమితమైన భోజనశాల
- పాఠశాల : జడ్పీఎస్ఎస్ బాలుర ఉన్నతపాఠశాల, నర్సంపేట
- నిధుల కేటాయింపు : రూ.24 లక్షలు
- చేపట్టాల్సిన పనులు : భోజనశాల, విద్యుత్తు మరమ్మతు, బిగింపు పనులు
- పనులు ఏ దశలో ఉన్నాయి : విద్యుత్తు మరమ్మతు, బిగింపు పనులు రెండు తరగతి గదుల మినహా అన్ని గదుల్లో పూర్తి చేశారు. భోజనశాల నిర్మాణానికి వేసిన పిల్లర్లు నిర్మించారు. రెండేళ్ల నుంచి పనులు మధ్యలో నిలిచిపోయాయి.
- ఇతర నిధులు కేటాయించే అవకాశముందా: అమ్మ ఆదర్శ పాఠశాల కింద మరుగు దొడ్లు, మూత్రశాలల మరమ్మతులు, తాగునీరు, చిన్న మరమ్మతుల కోసం రూ.7.80 లక్షలు మంజూరు చేయగా.. స్లమ్ లెవెల్ సమాఖ్య (ఎస్ఎల్ఎఫ్) మహిళా సభ్యులు పనులు చేయిస్తున్నారు.
అన్ని దశల్లో జాప్యమే..
జిల్లాలో పాఠశాలలను పరిశీలిస్తే చాలా వరకు పనులు ప్రారంభానికి శంకుస్థాపనలు మాత్రమే చేసినట్లు తెలుస్తోంది. ప్రతిపాదనలు, అంచనాలు, పరిశీలనలు, ఆమోదం వంటి వాటికే ఎక్కువ సమయం పడుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మరోవైపు సర్కార్ పాఠశాలల పునఃప్రారంభానికి సమయం దగ్గర పడుతుండటంతో జూన్ మొదటి వారంలో బడిబాట కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వేసవి సెలవుల్లో పాఠశాలల్లో సదుపాయాలను అభివృద్ధి చేసి బడుల ప్రారంభం నాటికి వాటిని ఉపయోగంలోకి తీసుకొస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
సది రోజుల్లో పూర్తి చేయాలని సూచించాం
గత ప్రభుత్వం మన ఊరు.. మన బడి కార్యక్రమం చేపట్టింది. ప్రస్తుత ప్రభుత్వం పాఠశాల యాజమాన్య కమిటీలను రద్దు చేసి వాటి స్థానంలో అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసింది. మౌలిక వసతుల కల్పనలో భాగంగా జిల్లాలోని 645 పాఠశాలలను ఎంపిక చేశాం. అభివృద్ధి పనుల బాధ్యత స్థానిక మహిళా సంఘాలకు అప్పగించాం. అంచనాలు 24.09 కోట్లు వేశాం. దీనిలో 6.25 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. 139 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. జూన్ 10 వరకు మిగతా పాఠశాలల్లో పూర్తి చేయాలని ఆదేశించాం. మన ఊరు మన బడి కింద చేపట్టిన పనులు పూర్తికాని చోట ప్రత్యేక నిధులతో పూర్తి చేయాలని సూచించాం.
డి.వాసంతి, జిల్లా విద్యాశాఖ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల