భద్రకాళి, ఉర్సు చెరువులతోనూ ప్రమాదమే!
స్మార్ట్ సిటీ పథకం ప్రతిపాదించిన చెరువుల సుందరీకరణ, బండ్ల విస్తరణ పనుల్లో అంతులేని జాప్యంతో వరంగల్ నగరానికి ముంపు ప్రమాదం పొంచి ఉంది.
వరంగల్ పోతన నగర్ వైపు భద్రకాళి చెరువు కట్ట బలహీనం
స్మార్ట్ సిటీ పథకం ప్రతిపాదించిన చెరువుల సుందరీకరణ, బండ్ల విస్తరణ పనుల్లో అంతులేని జాప్యంతో వరంగల్ నగరానికి ముంపు ప్రమాదం పొంచి ఉంది. శుక్రవారం ‘ఈనాడు’లో ‘వడ్డేపల్లి బండ్కు..పెను ముప్పు’ కథనంతో అందరి దృష్టి చెరువులపై పడింది. గతేడాది భారీ వరదలతో హనుమకొండ వడ్డేపల్లి, వరంగల్ భద్రకాళి, ఉర్సు రంగసముద్రం చెరువుల పరిసరాలన్నీ ముంపునకు గురయ్యాయి. ఇదే పరిస్థితి ఈ ఏడాది కూడా పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు బడా గుత్తేదారులకు దాసోహమవుతున్నందునే మూడు, నాలుగేళ్లవుతున్నా పనులు పూర్తి కావడం లేదని, ఆర్నెల్లకోసారి గడువు మీద గడువు పొడిగిస్తూ వస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
న్యూస్టుడే, కార్పొరేషన్
భద్రకాళి చెరువు
వరంగల్- హనుమకొండ ప్రాంతాల మధ్య భద్రకాళి చెరువు ఉంది. గత 15 ఏళ్లుగా బొందివాగు నాలా ద్వారా వరద నీరు ముంచెత్తుతోంది. పది కాలనీలు నీట మునుగుతున్నాయి. స్మార్ట్ సిటీ పథకం ద్వారా భద్రకాళి బండ్ రెండో విడత పనులు మూడేళ్లుగా సాగుతున్నాయి. సుందరీకరణ పేరుతో చెరువు కట్ట బలహీనమైంది. గతేడాది పోతననగర్ వైపు మట్టి కట్టకు గండి పడింది. వరదనీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఇంతవరకు మట్టి కట్టను బలోపేతం చేయలేదు. ఇరిగేషన్, గ్రేటర్ వరంగల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హంటర్రోడ్ 12 మోరీల నాలా నుంచి పోతన నగర్ వరకు వరద నీటి కాలువల పనులు పూర్తవ్వలేదు. భారీ వర్షాలు కురిస్తే రామన్నపేట, హంటర్రోడ్ ప్రాంతాలు నీట మునిగే అవకాశాలున్నాయి.
భద్రకాళి చెరువు కట్ట పక్కన స్టార్మ్ వాటర్ డ్రైనేజీ పనులు
ఉర్సు చెరువు: స్మార్ట్ సిటీ పథకం ద్వారా ఉర్సు రంగసముద్రం (ఉర్సు చెరువు) సుందరీకరణ పనులు ప్రతిపాదించారు. రెండేళ్లవుతున్నా అదిగో, ఇదిగో అనడం తప్ప పనులు ముందుకు సాగడం లేదు. నాలుగైదు నెలలుగా బండ్ అభివృద్ధి పనులు మొదలయ్యాయి. పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. గతేడాది ఉర్సుగుట్ట వంద అడుగుల రోడ్డులో రెండు, మూడు చోట్ల బండ్కు గండ్లు పడ్డాయి. వాటిని ఇంతవరకు ముట్టుకోలేదు. భారీ వర్షాలు పడితే చెరువులో నీళ్లు రోడ్డు మీదకు వచ్చి నగరాన్ని ముంచెత్తే ప్రమాదం పొంచి ఉంది.
గతేడాది వర్షాకాలంలో ఉర్సు రంగసముద్రం బండ్కు గండి
నీటిపారుదల శాఖకు లేఖ రాస్తాం
కార్పొరేషన్ : వరంగల్ పోతననగర్ వైపు భద్రకాళి చెరువు కట్టను బలోపేతం చేసే బాధ్యత నీటిపారుదల శాఖదే. హంటర్రోడ్ బొందివాగు నాలా అభివృద్ధిలో భాగంగా పోతననగర్, కాపువాడ మత్తడిల వైపు డౌన్ స్రీˆమ్ పల్వింగ్ షట్టర్లు ఏర్పాటు చేయాలి. భద్రకాళి బండ్ పనుల వేగం పెంచుతాం. ఉర్సు రంగసముద్రం చెరువును పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం.
ప్రవీణ్చంద్ర, పర్యవేక్షక ఇంజినీర్, గ్రేటర్ వరంగల్
వడ్డేపల్లి బండ్ను పరిశీలించిన అధికారులు
-‘ఈనాడు’ కథనంపై కమిషనర్ ఆరా
కార్పొరేషన్, న్యూస్టుడే: హనుమకొండ వడ్డేపల్లి చెరువుకు ప్రమాదం పొంచి ఉందా?, స్మార్ట్సిటీ పథకం ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులతో ఇబ్బందులున్నాయా?, ఇరిగేషన్ శాఖ ఇంజినీర్ల హెచ్చరికలు ఎందుకు పట్టించుకోలేదని పలువురు సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. సుందరీకరణ పేరుతో చెరువులు కొల్ల గొడుతున్నారని ఆరోపిస్తున్నారు. శుక్రవారం ‘ఈనాడు’లో ‘వడ్డేపల్లి బండ్కు..పెనుముప్పు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై గ్రేటర్ వరంగల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఆరా తీశారు. కమిషనర్ ఆదేశానుసారం బల్దియా ఎస్ఈ ప్రవీణ్చంద్ర, స్మార్ట్సిటీ ప్రాజెక్టు మానిటరింగ్ కమిటీ(పీˆఎంసీˆ) టీం లీడర్ ఆనంద్ వొలేటి తదితర అధికారులు వడ్డేపల్లి చెరువును సందర్శించారు. చెరువు కట్ట కట్ట విస్తరణ, ఇతర పనులు పరిశీలించారు. ఒకటి రెండు రోజుల్లో ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లతో సమావేశమయేయ అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు