logo

ప్రశ్నించే గొంతుక రాకేశ్‌రెడ్డి

ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతుక ఏనుగుల రాకేశ్‌రెడ్డి అని భారాస జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు.

Published : 26 May 2024 04:48 IST

స్రమావేశంలో ప్రసంగిస్తున్న వినయ్‌భాస్కర్, చిత్రంలో అభ్యర్థి రాకేశ్‌రెడ్డి, భారాస నాయకులు 

బాలసముద్రం, న్యూస్‌టుడే : ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతుక ఏనుగుల రాకేశ్‌రెడ్డి అని భారాస జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. బాలసముద్రంలోని భారాస జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల ఎన్నికల్లో పార్టీ అధినేత కేసీఆర్‌ యువ నాయకుడికి అవకాశం కల్పించారన్నారు. అభ్యర్థి రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే విద్యార్థి, నిరుద్యోగ సమస్యలతో పాటు ఫీజు రియంబర్స్‌మెంట్‌ కోసం పోరాడుతానన్నారు. ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌ బాబు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, వరంగల్‌ ఎంపీ అభ్యర్థి మారపల్లి సుధీర్‌కుమార్, నాయకులు పాల్గొన్నారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు