logo

ప్రజా సమస్యలపై పోరాడే అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న

నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తి కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న అని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు.

Published : 26 May 2024 04:54 IST

విద్యార్థులతో ముచ్చటిస్తున్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి 

విద్యానగర్, న్యూస్‌టుడే: నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తి కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న అని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా మల్లన్నను గెలిపించాలని కోరుతూ శనివారం కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. గ్రంథాలయంలో పట్టభద్రుల కలిసి మాట్లాడారు. తొలి ప్రాధాన్యత ఓటు వేసి మల్లన్నను గెలిపించడం వల్ల విద్యావంతులు, నిరుద్యోగులు, సబ్బండ వర్గాల పక్షాన పోరాడే వ్యక్తిని మండలికి పంపినట్లు అవుతుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ తోట వెంకన్న, డాక్టర్‌ వలీఉల్లా ఖాద్రి, మంద వీరస్వామి, ప్రేమ్‌కుమార్, బండి శ్రీను, కన్నం సునీల్, సంపత్, నాయిని లక్ష్మారెడ్డి, సతీష్, భీమ, వినయ్, శ్వేత తదితర విశ్వవిద్యాలయ నాయకులు పాల్గొన్నారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని