ముగిసిన పట్టభద్రుల ప్రచారం
వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్, భారాస ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నాయి
సాధారణ ఎన్నికలను తలపించేలా పార్టీల అగ్రనేతలు రాక
ఈనాడు, వరంగల్: వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్, భారాస ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నాయి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తరహాలో అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేశారు. వీరితోపాటు 49 మంది స్వతంత్రులు సైతం తలపడుతున్నారు. భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, భారాస తరఫున పోటీ చేస్తున్న ఏనుగుల రాకేశ్రెడ్డి ఉమ్మడి వరంగల్కు చెందినవారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉమ్మడి నల్గొండవాసి. వీరంతా మూడు జిల్లాల పరిధిలో జోరుగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ప్రతి రోజూ ఉదయం వాకర్స్ను కలుస్తూ వారి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు.
లోక్సభ ఎన్నిక పోలింగ్ మే 13న ముగియగానే ప్రధాన పార్టీల అగ్రనేతలు పట్టభద్రుల ఎన్నికపై దృష్టి సారించారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో విస్తృతంగా పర్యటించారు. భాజపా తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డితోపాటు ఈటల రాజేందర్, డీకే అరుణ వంటి అగ్రనేతలు 12 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించి పట్టభద్రులు భాజపాకే పట్టం కట్టి గుజ్జులను గెలిపించాలని కోరారు. భారాసలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుతోపాటు ఉమ్మడి వరంగల్కు చెందిన మాజీ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్పాటు, కరీంనగర్ నుంచి కూడా భారాస నేతలు తరలివచ్చి ఏనుగుల రాకేశ్రెడ్డికి మద్దతుగా ప్రచారాన్ని హోరెత్తించారు. అభ్యర్థులంతా ఫోన్కాల్ రికార్డింగ్ల ద్వారా ప్రతి ఓటరుకు చేరువ అయ్యేలా సాంకేతికతను వినియోగించారు. మరోవైపు సోమవారం పోలింగ్ కోసం ఆయా జిల్లాల అధికారులు సర్వం సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు.
48 గంటల పాటు మద్యం దుకాణాలు బంద్
వరంగల్క్రైం, న్యూస్టుడే: పట్టభద్రుల ఉప ఎన్నికను పురష్కరించుకొని 48 గంటల పాటు మద్యం దుకాణాలను మూసివేయాని వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం సాయంత్రం 4 నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలను ఎవరూ తెరువరాదన్నారు. ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం