ఆధ్యాత్మిక పర్యాటకానికి ఓరుగల్లు జై!
వేసవి సెలవులు కావడంతో విహారానికి వెళ్లాలని, హాయిగా సేద దీరాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. తరచూ సందర్శించే మన ప్రాంతాల్లోని యాత్రా స్థలాలు కాకుండా భిన్నంగా మరెక్కడికైనా వెళ్లాలనుకునేవారు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలను ఎంపిక చేసుకుంటున్నారు.
అయోధ్య, అరుణాచలం, చార్ధామ్ యాత్రకు మొగ్గు
‘ఆధ్యాత్మిక పర్యాటకం కోసం అంతర్జాలంలో శోధించే వారి శాతం ఈ వేసవిలో 103 శాతం పెరిగినట్టు ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ సర్వేలో తేలింది.’
వేసవి సెలవులు కావడంతో విహారానికి వెళ్లాలని, హాయిగా సేద దీరాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. తరచూ సందర్శించే మన ప్రాంతాల్లోని యాత్రా స్థలాలు కాకుండా భిన్నంగా మరెక్కడికైనా వెళ్లాలనుకునేవారు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలను ఎంపిక చేసుకుంటున్నారు.
స్నేహితులంతా భక్తిమార్గంలో
స్నేహితులు గతంలో సరదాగా విహార యాత్రలకు వెళ్లేవారు. ఇప్పుడు తరచూ ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లి వస్తున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన ఎం.గణేశ్ నేతృత్వంలో స్నేహితులు పదిరోజుల కిందట ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లారు.
అయోధ్య గొప్ప అనుభూతి ఇచ్చింది: తోట గణేశ్, వరంగల్
వరంగల్ నుంచి అయోధ్యకు ఇప్పటికి రెండుసార్లు వెళ్లొచ్చాం. మా కూతురు వైద్యురాలు. అయోధ్య రాముడి సేవలో పాల్గొంటున్నారు. సరయూ నదిలో లేజర్ ప్రదర్శన ఎంతో ఆహ్లాదం కలిగించింది.
వీటికి మొదటి ప్రాధాన్యం..
ఉమ్మడి వరంగల్ యాత్రికుల సరళి చూస్తే సెలవుల్లో ఎక్కువగా అయోధ్య రామాలయం, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, తమిళనాడులోని అరుణాచలం, మండువేసవిలో మంచుకొండల మధ్య ఆధ్యాత్మిక భావనతో పులకించిపోయేందుకు ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రకు చలో అంటూ భారీ సంఖ్యలో తరలివెళ్తున్నారు.
- ఈ ఏడాది ప్రతిష్ఠ పూర్తయిన అయోధ్య రామాలయంతో పాటు సరయు నదిలో బోటింగ్, లేజర్షో, లతామంగేష్కర్ కూడలి లాంటివాటిని చూసి తరిస్తున్నారు. వారణాసి, నైమిశారణ్యం ప్రాంతాలను చూసి వస్తున్నారు.
- సాహస యాత్ర ఇష్టపడే వారైతే కాజీపేట నుంచి రైల్లో లేదా హైదరాబాద్ నుంచి నేరుగా విమానంలో దిల్లీకి వెళ్లి అక్కడి నుంచి ఉత్తరాఖండ్లోని గంగోత్రి, యమునోత్రి, బద్రినాథ్, కేదార్నాథ్ యాత్రలకు వెళుతూ మంచుకొండల్లో ఆధ్యాత్మిక పారవశ్యంలో మునిగితేలుతున్నారు.
- ఇటీవల తమిళనాడులోని అరుణాచలానికి పెద్ద సంఖ్యలో వెళుతూ అక్కడ 14 కిలోమీటర్ల దూరం గిరిప్రదక్షిణం చేస్తూ భక్తి భావాన్ని చాటుతున్నారు.
- మన తెలుగు రాష్ట్రాల్లోని తిరుమల, విజయవాడ, శ్రీశైలం, మహానంది, అహోబిలం లాంటి తీర్థయాత్రలకు మన వాళ్లు భారీగానే తరలివెళుతున్నారు.
కుటుంబాలు కలిసి బస్సుల్లో వెళ్లి
బద్రినాథ్ ఆలయం ఎదుట డోర్నకల్ యాత్రికులు
పది నుంచి పన్నెండు రోజుల పాటు అయోధ్య యాత్ర చేద్దామనుకునేవారు బస్సులు మాట్లాడుకుని కుటుంబాలతో కలిసి వెళుతున్నారు. ఒక్కో బస్సులో 40 మంది ప్రయాణించే వీలుంది. ఈ క్రమంలో కుటుంబాలు, స్నేహితులు, కాలనీవాసులు సమష్టిగా యాత్రలు చేస్తున్నారు.
ట్రావెల్ ఏజెన్సీలకు డిమాండ్..
త్రినగరి పరిధిలోనే 50 వరకు ట్రావెల్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటన్నింటి నుంచి రోజుకు కనీసం 25 కార్లలో యాత్రికులు దక్షిణాది యాత్రలకు వెళుతున్నట్టు అంచనా. నగరంలో విమానం టికెట్లు బుక్ చేసే ఏజెన్సీలు పది వరకు ఉన్నాయి. వీటిల్లో రోజుకు 50 మంది వరకు దిల్లీ, తిరుపతి, వారణాసి, లక్నో తదితర ప్రాంతాలకు టికెట్లు బుక్ చేసుకుంటున్నట్టు ఏజెన్సీ నిర్వాహకుడు కిశోర్ చెప్పారు. పెద్ద సంఖ్యలో నేరుగా ఆన్లైన్లోనే విమానం, రైలు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ః వేసవిలో తాము అయోధ్యకు అయిదు ట్రిప్పుల బస్సులు నడిపించామని హనుమకొండకు చెందిన ట్రావెల్ ఏజెంట్ అనిల్ తెలిపారు. ః అరుణాచలంతోపాటు దక్షిణాది ఆధ్యాత్మిక ప్రాంతాలకు వారంలో ఒకటి రెండు కార్లు పంపుతున్నామని వరంగల్కు చెందిన యుగంధర్ చెప్పారు.
బృందంగా తరలివెళ్లారు
డోర్నకల్, న్యూస్టుడే: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్కు చెందిన 44 మంది యాత్రికులు బృందంగా ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రకు వెళ్లారు. కాలా యశోధర్ జైన్, మోనికా జైన్ నేతృత్వంలో ఆధ్యాత్మిక పర్యటన చేస్తున్నారు. ఈ నెల 29న తిరిగి రానున్నారు.
మానసిక ప్రశాంతత..
నర్సంపేట: నర్సంపేటకు చెందిన కిరాణా వ్యాపారులు వారం రోజుల పాటు గయా, బుద్ధగయ, వారణాసి, అలహాబాద్, అయోధ్య, నైమిశారణ్యం వంటి తీర్థ యాత్రలు వెళ్లి వచ్చారు. ఉత్తర భారతదేశంలో ముఖ్యమైన ఆలయాలను సందర్శించారు. తీర్థ యాత్రలతో ఆధ్యాత్మిక చింతన, మనసు ప్రశాంతత, మానసిక ఉల్లాసం, నూతనోత్తేజం కలిగిందని నర్సింహారెడ్డి, రామస్వామి తదితరులు తెలిపారు.
హరిద్వార్ బాగా నచ్చింది
- నాగిళ్ల వేణుశర్మ, మాణిక్యాపూర్
ఇప్పటికే అయోధ్య, అరుణాచలం, కాశి లాంటి తీర్థయాత్రలకు వెళ్లొచ్చా. ఇప్పుడు చార్ధామ్ యాత్రలో ఉన్నా. హిమాలయాలను చూస్తుంటే అద్భుతమైన అనుభూతి కలుగుతోంది. హరిద్వార్ నాకు బాగా నచ్చింది.
- న్యూస్టుడే, భీమదేవరపల్లి
హజ్యాత్రకు వందల సంఖ్యలో..
ఈ వేసవిలో ఓరుగల్లు నుంచి హజ్యాత్రకు తరలివెళ్లిన ముస్లిం సోదరుల సంఖ్య 300కు పైగా ఉంటుందని అంచనా. జీవితంలో ఒక్కసారైనా మక్కాను సందర్శించి తరించిపోవాలనుకునే వారు విమానం ఎక్కి విదేశీ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లివస్తున్నారు.
-ఈనాడు, వరంగల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల