చెరువుల పునరుద్ధరణకు కార్యాచరణ
రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లోని చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయించింది. చెరువుల ఆక్రమణలు, కాలుష్య నివారణ, వ్యర్థాలు తొలగించి, శుద్ధ జలాలు నిల్వ ఉండేలా చేయనున్నారు.
ఇరిగేషన్, రెవెన్యూ, గ్రేటర్ శాఖల ఆధ్వర్యంలో సర్వేకు ఆదేశాలు
భద్రకాళి చెరువులో అడవితుంగ
రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లోని చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయించింది. చెరువుల ఆక్రమణలు, కాలుష్య నివారణ, వ్యర్థాలు తొలగించి, శుద్ధ జలాలు నిల్వ ఉండేలా చేయనున్నారు. భూగర్భ జలాలు బలోపేతమయ్యేలా తగిన కార్యాచరణ రూపొందించనున్నారు. చెరువు గట్లు, బఫర్ జోన్ స్థలాల్లో మొక్కలు నాటి.. ఆహ్లాదం, ఆనందం కలిగే విధంగా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. వరంగల్ మహా నగర పరిధిలోని చెరువుల వాస్తవాలపై సమగ్ర సర్వే చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకురాలు డి.దివ్య దేవరాజన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇరిగేషన్, రెవెన్యూ, గ్రేటర్ వరంగల్ శాఖల అధికారులు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి, నెలరోజుల్లో సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు.
-కార్పొరేషన్, న్యూస్టుడే
గ్రేటర్ పరిధిలో 200 వరకు..
- కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) రూపొందించిన వరంగల్ నూతన మాస్టర్ ప్లాన్లో గ్రేటర్ వరంగల్ పరిధిలో 200 చెరువులు, కుంటలు ఉన్నట్లుగా చూపించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం కాజీపేట, హనుమకొండ, వరంగల్ త్రినగరాలతో పాటు 42 విలీన గ్రామాల్లో చెరువులు, కుంటల వివరాలు తీసుకున్నారు.
- చెరువులు, కుంటలకు హద్దులు ఖరారు చేస్తారు. గరిష్ఠ సామర్థ్యం(ఫుల్ ట్యాంకు లెవల్-ఎఫ్టీఎల్) నిర్ణయించనున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో భవిష్యత్తులో నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం ఉన్న నిర్మాణాల తొలగింపుపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు.
- నగర నడిబొడ్డున ఉన్న చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా తగిన కార్యాచరణ రూపొందించనున్నారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా..
- కాజీపేట బంధం చెరువు అక్రమార్కుల పరం అవుతోంది. 60 ఎకరాల ఆయకట్టుకు గాను ప్రస్తుతం కేవలం 20-25 ఎకరాలు ఉంది. అందులోకి మురుగునీరు చేరుతోంది. ఎఫ్టీఎల్ నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు జరుగుతున్నాయి.
- హనుమకొండ పెద్ద వడ్డేపల్లి చెరువులోకి మురుగునీరు వస్తోంది. ఫుల్ ట్యాంకు లెవల్ హద్దులు పెట్టకపోవడంతో ఇష్టానుసారంగా భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. చెరువులో వ్యర్థాలు తొలగించాలి.
- భద్రకాళి చెరువు చుట్టూ బడా భవనాలు కడుతున్నారు. ఎఫ్టీఎల్ నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. హనుమకొండ పద్మాక్షిగుట్ట, హంటర్రోడ్, ఎన్టీఆర్నగర్, సంతోషిమాత కాలనీల్లో నివాస గృహాలు వెలిశాయి. పద్మాక్షిగుట్ట వైపు నుంచి మురుగునీరు వస్తోంది. అడవి తుంగ తొలగించాలి.
- ములుగురోడ్ కోట చెరువు ఆక్రమించేస్తున్నారు. గౌతమినగర్, డాక్టర్స్ కాలనీ వైపు చెరువు లోపలికి వరకు నిర్మాణాలు వచ్చేశాయి. వరంగల్ ప్రాంతంలోని మురుగునీరంతా ఇందులోకి వస్తుంది. ఎఫ్టీఎల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారు.
- దేశాయిపేట చిన్నవడ్డేపల్లి చెరువులోనూ ఎఫ్టీఎల్ పరిధిలో భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. గణేశ్ నిమజ్జన అవశేషాలు, ఇతర వ్యర్థాలతో కాలుష్యం పెరిగింది. మురుగు పేరుకుపోయింది. అడవితుంగ తొలగించాలి.
- ఉర్సు రంగసముద్రం(ఉర్సు చెరువు)లో అడవి తుంగ, వ్యర్థాలు పేరుకుపోయాయి. మురుగునీరు చేరుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం