యమపాశాల్లా.. వేలాడుతున్నాయ్!
మండలంలో స్తంభాలు వంగిపోవడం, తీగలు తలకు తగిలేంత ఎత్తులో ఉన్నా సరి చేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తిమ్మంపేటలో..
ప్రమాదకరంగా ఉన్నా.. పట్టించుకోరేం?..
జఫర్గఢ్: మండలంలో స్తంభాలు వంగిపోవడం, తీగలు తలకు తగిలేంత ఎత్తులో ఉన్నా సరి చేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిమ్మంపేటలో మల్లం రాములు, రాజాబోసు, ఎల్లయ్య, స్వామిలకు చెందిన వ్యవసాయ పొలం మీదుగా ఉన్న విద్యుత్తు తీగలు కిందికి ఉండటంతో, కోతల సమయంలో యంత్రాలు వచ్చినప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పనులు నిర్వహించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ నెల 20, 22 తేదీల్లో కోనాయచలం, కూనూర్లో నియంత్రిక సపోట్ వైరు తగిలి రెండు పశువులు చనిపోయాయి. తీగలు, నియంత్రికలను సరిచేయాల్సి ఉంది.
ప్రతి సంవత్సరం వర్షాకాలంలో భారీ వానలు, ఈదురుగాలులకు విద్యుత్ ప్రమాదాలు, జీవాల మరణాలు చోటుచేసుకోవడం పరిపాటిగా మారింది. ప్రధానంగా వ్యవసాయ బావుల వద్ద నియంత్రికలకు ఎలాంటి రక్షణ కంచెలు, కరెంటు స్తంభాలు సక్రమంగా లేకపోవడంతో వేలాడే కరెంటు తీగలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఆదివారం కురిసిన వర్షానికి రాష్ట్ర వ్యాప్తంగా చెట్లు, విద్యుత్తు స్తంభాలు, హోర్డింగ్స్ కూలిపోయి 13 మంది దుర్మరణం చెందారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంది. వ్యవసాయ క్షేత్రాల్లోనే కరెంట్ తీగలు, దండేలా మాదిరి ఉండటం, ఒరిగిన విద్యుత్తు స్తంభాలు, ప్రమాదకర నియంత్రికలతో అన్నదాతలు భయాందోళన చెందుతున్నారు. రానున్న జూన్ నెల నుంచి వానాకాలం ప్రారంభం కానుండటంతో అధికారులు ఈ సారి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచిస్తూ సోమవారం ప్రమాదకరమైన ప్రాంతాలను ‘న్యూస్టుడే’ పరిశీలించింది.
- జనగామ టౌన్, న్యూస్టుడే
చేయి ఎత్తులోనే తీగలు..
కొడకండ్ల: మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ నియంత్రికలు తక్కువ ఎత్తులో ఉండటంతో పశువులు ప్రమాదాల బారిన పడుతున్నాయి. పది రోజుల కింద ఏడునూతుల గ్రామంలో యుగంధర్ అనే రైతుకు చెందిన రెండు పాడి పశువుల కాలికి విద్యుత్ తీగలు తగలడంతో మృతి చెందాయి. రామవరం, రామేశ్వరం, ఏడునూతుల, పడమటి తండ, రంగాపురం గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో తీగలు చేయికి అందేంత ఎత్తులోనే ఉన్నాయి. నియంత్రికలకు రక్షణ కంచెలు ఏర్పాటు చేసి, స్తంభాలను సవరించి, తీగలను సరిచేయాలని కర్షకులు కోరుతున్నారు.
ఒరిగిన స్తంభం..
పాలకుర్తి: మండల కేంద్రంలో ఒరిగిన స్తంభాలు భయంకరంగా మారాయి. చాలా చోట్ల వ్యవసాయ క్షేత్రాల్లో ఇలానే ఉండటంతో వర్షాకాలంలో మొత్తం విరిగి పోయి ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు. అలాగే చెట్ల కొమ్మల మధ్యన ఉండే విద్యుత్తు తీగలు కనీసం గుర్తించకుండా మారాయి. ఈ నెల 13న గూడూరులో రైతు నర్సయ్యకు చెందిన ఒక దుక్కిటెద్దు విద్యుదాఘాతంతో మృతి చెందింది. చెట్ల కొమ్మలను తొలగించి, స్తంభాలను సరిచేయాలి. ఒరిగిన స్తంభం..
పాలకుర్తి: మండల కేంద్రంలో ఒరిగిన స్తంభాలు భయంకరంగా మారాయి. చాలా చోట్ల వ్యవసాయ క్షేత్రాల్లో ఇలానే ఉండటంతో వర్షాకాలంలో మొత్తం విరిగి పోయి ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు. అలాగే చెట్ల కొమ్మల మధ్యన ఉండే విద్యుత్తు తీగలు కనీసం గుర్తించకుండా మారాయి. ఈ నెల 13న గూడూరులో రైతు నర్సయ్యకు చెందిన ఒక దుక్కిటెద్దు విద్యుదాఘాతంతో మృతి చెందింది. చెట్ల కొమ్మలను తొలగించి, స్తంభాలను సరిచేయాలి.
పొంచి ఉన్న ముప్పు..
బచ్చన్నపేట: మండల కేంద్రం నుంచి పోచన్నపేట వెళ్లే రహదారిలో ఓ స్తంభం ఒరిగిపోయి ప్రమాదకరంగా మారింది. అలాగే కొద్ది దూరంలో వైర్లు కూడా కిందికి వేలాడుతున్నాయి. బాగు చేయాలని రైతులు కోరుతున్నారు.
కర్రలే ఊతంగా..
జనగామ రూరల్: గానుగుపహాడ్లో వ్యవసాయ బావుల వద్ద పలు చోట్ల 11 కె.వి విద్యుత్ లైన్లు తక్కువ ఎత్తులో వేలాడుతున్నాయి. గ్రామానికి చెందిన రైతులు ఉల్లి గట్టయ్య, ఎడమ యాదగిరి వ్యవసాయ బావుల వద్ద వైర్లు చేతికందే ఎత్తులో వేలాడుతున్నాయి. దీంతో కర్రలను ఏర్పాటు చేసుకొని కాలం వెళ్లదీస్తున్నారు. యంత్రాలు వచ్చే సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.
ఫిర్యాదు చేస్తే సత్వరం పరిష్కరిస్తాం..
- టి.వేణుమాధవ్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ, జనగామ సర్కిల్
జిల్లాలోని వ్యవసాయ బావుల సమీపంలో కరెంటు స్తంభాల మధ్యన వేలాడే తీగలు ఉంటే, మిడిల్ పోళ్ల కోసం రైతులు సమీపంలోని విద్యుత్ సెక్షన్ కార్యాలయంలో సంప్రదిస్తే మధ్య స్తంభాలను ఏర్పాటు చేస్తాం. లేదా నేరుగా డివిజనల్ కార్యాలయం, ఎస్ఈ కార్యాలయంలో ఫిర్యాదులు అందిస్తే, సమస్యలను పరిష్కరిస్తాం. పశువులు మృతి చెందితే పంచనామా, ఎఫ్ఐఆర్ నివేదికలు సమర్పిస్తే, శాఖా పరంగా సాయం అందేలా కృషి చేస్తాం. రానున్న వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్