పుస్తకాలు సరే.. పంపిణీ ఎప్పుడో..?
సర్కారు బడులు, గురుకులాలు, వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు అవసరమయ్యే పాఠ్య, నోటు పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. వాటిని మండల కేంద్రాలకు ఎలా పంపిణీ చేయాలో తెలియక అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది.
బడ్జెట్ లేక ప్రతిష్టంభన
జంగేడులో గోదాంలో నోటు పుస్తకాలు
న్యూస్టుడే, భూపాలపల్లి : సర్కారు బడులు, గురుకులాలు, వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు అవసరమయ్యే పాఠ్య, నోటు పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. వాటిని మండల కేంద్రాలకు ఎలా పంపిణీ చేయాలో తెలియక అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. రాష్ట్ర రాజధాని నుంచి జిల్లా కేంద్రాలకు పుస్తకాలు చేరవేసిన విద్యా శాఖ ఇక్కడ చేరుకున్న పుస్తకాలను మండల, పాఠశాల స్థాయిలో పంపేందుకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం ప్రధాన అవరోధంగా మారింది. జిల్లా కలెక్టర్ అత్యవసర నిధులను కేటాయిస్తే తప్ప గడువులోగా విద్యార్థులకు పుస్తకాలు చేరడం గగనంగా కనిపిస్తోంది.
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు 450 వరకు ఉన్నాయి. దాదాపుగా 26 వేల మంది విద్యార్థులకు ఉచిత పాఠ్య, నోటు పుస్తకాలను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. జిల్లాలో 1,96,110 పాఠ్య పుస్తకాలు అవసరం ఉండగా ఇప్పటివరకు 1,15,220 పుస్తకాలు జంగేడు ప్రభుత్వ పాఠశాలలోని గోదాంకు చేరాయి. బరువును తగ్గించేలా పార్ట్-1, పార్ట్-2లుగా విభజించి పుస్తకాలను విడతల వారీగా సరఫరా చేస్తున్నారు. పార్ట్-1 పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలన్నీ రాజధాని నుంచి చేరుకోవడంతో వాటిని జిల్లా కేంద్రంలోని జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని గోదాంలో నిల్వ చేశారు. ఈ సారి పాఠ్య పుస్తకాల బరువును దాదాపు 100 నుంచి 200 గ్రాముల మేర తగ్గించడమే కాకుండా వాటిపై ఆకర్షణీయ చిత్రాలు కనిపించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మారడంతో నోటు పుస్తకాల ముఖ చిత్రంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రాన్ని ముద్రించారు.
గోదాంలో నిల్వ
జిల్లా కేంద్రంలోని జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల గోదాంలో పాఠ్య పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు నిల్వ చేశారు. విద్యార్థులకు ఇంకా సరిపడా పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని విద్యా సంస్థల్లో ఆరు నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు వీటిని పంపిణీ చేయాల్సి ఉంది. ఆరు, ఏడు తరగతులకు ఆరు నోటు పుస్తకాలు, 8వ తరగతికి ఏడు, 9,10 తరగతులకు 14, ఇంటర్ విద్యార్థులకు 12 చొప్పున అందజేస్తారు. 1వ నుంచి 5వ తరగతి విద్యార్థులకు నోటు పుస్తకాలకు బదులు వర్క్బుక్లు ఇవ్వనున్నారు.
ప్రతిసారీ లోటు బడ్జెట్టే..
బడులు తెరిచే నాటికి పాఠ్యపుస్తకాలు చేరవేయాలని అటు ప్రభుత్వం, ఇటు అధికారులు చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో వాటిని సరఫరా చేసేందుకు అవసరమయ్యే నిధులను విడుదల చేయడం లేదు. రాజధాని నుంచి జిల్లా కేంద్రాలకు సకాలంలో చేరవేస్తున్నా అక్కడి నుంచి మండల విద్యా వనరుల కేంద్రం, ఆయా పాఠశాలలకు చేరవేయడంలో జాప్యం జరుగుతోంది. రూ.కోట్లు ఖర్చుపెట్టి పుస్తకాలను ముద్రిస్తున్న ప్రభుత్వం కీలకమైన పంపిణీ విషయంలో మాత్రం నిధులు ఇవ్వకపోవడంతో అసలైన లక్ష్యం నెరవేరకుండా పోతోంది. తామే రవాణా ఖర్చులు భరించాల్సి వస్తుందని పలువురు హెచ్ఎంలు వాపోతున్నారు.
బడులు తెరిచేలోగా పంపిణీ
- రాంకుమార్, డీఈవో, భూపాలపల్లి
ప్రభుత్వ బడులు తెరిచేలోగా జిల్లాలోని అన్ని పాఠశాలలు, గురుకులాలకు పాఠ్య, నోటు పుస్తకాలను పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటాం. రవాణా ఛార్జీలను ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది. పాఠశాలల ప్రారంభం రోజున ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు విద్యార్థులకు ఇచ్చేలా సంబంధిత మండల విద్యాశాఖ అధికారులతో మాట్లాడి పంపిణీ చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే