ఫిర్యాదు.. ఆలస్యమైతే వ్యర్థమే..!
సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత చరవాణి ద్వారా పనులన్నీ పూర్తవుతున్నాయి. బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.
సైబర్ మోసాల్లో తక్షణం స్పందిస్తే రికవరీకి అవకాశం
వరంగల్క్రైం, న్యూస్టుడే: సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత చరవాణి ద్వారా పనులన్నీ పూర్తవుతున్నాయి. బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతిలో మోసాలకు పాల్పడుతున్నారు. ఖాతాల్లో నుంచి క్షణాల్లో డబ్బులు మాయం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లను అదుపు చేసేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఫలితం లేకుండాపోతుంది. ఇటీవల నూతనంగా వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే కొంతమేరకు పోయిన డబ్బులను తిరిగి రాబట్టేందుకు అవకాశం ఉంది. మూడునెలల క్రితం వరంగల్ పోలీసు కమిషనరేట్లో సైబర్ ఠాణాను ఏర్పాటు చేశారు. దీంతో వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సైబర్ మోసాలను ఎప్పటికప్పుడు ఛేదిస్తున్నారు. సైబర్ మోసం జరిగిందని గుర్తించిన వెంటనే బాధితులు 1930కు కాల్ చేసి వివరాలు తెలియజేయాలి. సాధారణ ప్రజలతో పాటు విద్యావంతులు, వైద్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా సైబర్ నేరగాళ్ల బారినపడుతున్నారు.
పరువు పోతోందని..
చాలామంది పరువు పోతుందని బయటకు చెప్పడం లేదు. రెండురోజుల క్రితం సైబర్ నేరగాళ్లు వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య ఫొటోను డీపీ(డిస్ప్లే పిక్చర్)గా పెట్టి డబ్బులు డిమాండ్ చేశారు. కలెక్టర్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో అప్రమత్తమైన సైబర్ విభాగం దానిని నిర్వీర్యం చేసింది. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఉన్నవారే ఎక్కువగా సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోతున్నారు. సైబర్ ఠాణా ఏర్పాటైనప్పటి నుంచి వరంగల్ పోలీసు కమిషనరేట్లో 15 కేసుల్లో సుమారు రూ.3 లక్షలు తిరిగి బాధితులకు ఇప్పించారు. చాలామంది ఆలస్యంగా ఫిర్యాదు చేస్తుండటంతో పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు.
ఇలా చేస్తే మోసపోతారు..!
ః చరవాణి వాట్సప్ నెంబర్లకు గుర్తు తెలియని వ్యక్తులు పంపించే లింక్లను క్లిక్ చేయొద్దు. ః సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారం కుటుంబ విషయాలపై పోస్టులు పెట్టొద్దు. ః వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలు, చరవాణికి వచ్చే ఓటీపీలను ఎవరికీ చెప్పొద్దు. ః పార్ట్టైం ఉద్యోగాలు ఇస్తామని గుర్తుతెలియని వ్యక్తులు నుంచి వచ్చే ఫోన్లను నమ్మి వివరాలు ఇవ్వొద్దు. ః ఇన్స్టాంట్గా(వెంటనే) రుణాలు ఇస్తామని చెప్పి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతారు. ః వలపు వల విసిరి సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకొని మోసం చేస్తారు. ః సీబీఐ, నార్కొటిక్ విభాగం, కస్టమ్స్ అధికారులమంటూ.. ఫోన్ చేసి మీపేరుతో డ్రగ్స్ వచ్చాయి అంటూ వీడియో కాల్ చేసి బెదిరింపులకు పాల్పడతారు. బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని తనిఖీలు చేస్తామని చెప్పి మోసం చేస్తున్నారు. ః క్రెడిట్కార్డు ఇస్తామని చరవాణికి ఫోన్లు చేస్తారు. వాటిని తిరస్కరించాలి.
ఇటీవల జరిగిన ఘటనలు
- వరంగల్కు చెందిన వ్యక్తి ఆన్లైన్లో సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి సుమారు రూ.లక్ష పోగొట్టుకున్నాడు. వెంటనే సైబర్ ఠాణాకు ఫిర్యాదు చేస్తే వారు రూ.22 వేలను సీజ్ చేశారు. ఆ మొత్తం తిరిగి బాధితుడికి ఇప్పించారు.
- జనగామ జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తి సైబర్ నేరగాళ్ల బారినపడి రూ.2.10 లక్షలు మోసపోయాడు. ఫిర్యాదు చేయడంతో రూ.27 వేలు పోలీసులు సీజ్ చేసి బాధితుడికి అందించారు.
అప్రమత్తంగా ఉండాలి
- సైబర్ విభాగం ఏసీపీ విజయ్కుమార్
అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతాల వివరాలను చెప్పొద్దు. చరవాణిలో గాని, పేపర్లపై గాని వివరాలు రాయొద్దు. విశ్రాంత ఉద్యోగులు ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. సైబర్ నేరగాళ్లకు చిన్న అవకాశం ఇచ్చినా డబ్బులను మాయం చేస్తారు. వెంటనే ఫిర్యాదు చేస్తే నగదు బ్యాంకుల్లోనే ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి