భానుడితో పోటీ పడుతూ.. పట్టభద్రులు ఓటెత్తారు!
ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా సోమవారం ఎండలు భగ్గుమన్నా పట్టభద్రులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి బారులు తీరి ఓటేశారు.
ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా సోమవారం ఎండలు భగ్గుమన్నా పట్టభద్రులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి బారులు తీరి ఓటేశారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే 34 డిగ్రీలతో మొదలైన 43 డిగ్రీల మధ్య నమోదైంది. ఈ ఉష్ణోగ్రతలతో పోటీ పడుతున్నట్టు.. పోలింగ్ శాతం రెండు గంటలకోసారి పెరుగుతూ వచ్చింది. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11.40 శాతంతో మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు 72.66 శాతానికి చేరుకొంది.
వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల పరిధిలో ఒకటి రెండు చోట్ల చిన్న ఘటనలు మినహా ఎక్కడా ఇబ్బంది ఎదురు కాలేదు. అన్ని చోట్ల పట్టభద్రులు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మహిళలు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటేశారు. తొలిసారి ఓటు హక్కు పొందినవారు ఉత్సాహంగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు.
రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో..
ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఆరు జిల్లాల్లో మొత్తం పట్టభద్ర ఓటర్లు 1,68,727 ఉండగా.. సోమవారం సాయంత్రం వరకు అందిన సమాచారం మేరకు 1,21,230 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 72.66 శాతం.
2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 76.82 శాతం పోలింగ్ నమోదైంది. ప్రాథమిక సమాచారం ఆధారంగా 4.16 శాతం తక్కువ నమోదైంది. పూర్తి వివరాలు వచ్చాక పెరిగే అవకాశం ఉంది.
ముఖ్యాంశాలు..
- 2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్లో జనగామలో అత్యధిక శాతం పట్టభద్రులు ఓటేశారు. ఇప్పుడు కూడా జనగామ జిల్లానే ఓటింగ్లో ముందంజలో ఉంది.
- సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఓరుగల్లు నగరంలోనూ పోలింగ్ శాతం పెరిగింది.
- భాజపా, భారాస, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, ఏనుగుల రాకేశ్రెడ్డి, తీన్మార్ మల్లన్న వరంగల్ నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
- పోలింగ్ ముగిసే సమయం సాయంత్రం 4 గంటలకల్లా వరుసలో ఉన్న వారందరికీ ఓటేసేందుకు అవకాశం ఇవ్వడంతో అనేక చోట్ల సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది.
- వరంగల్, హనుమకొండ, ములుగు జిల్లాల కలెక్టర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- బ్యాలెట్ పెట్టెలన్నీ గట్టి పోలీసు బందోబస్తు నడుమ నల్గొండకు తరలించారు. లెక్కింపు ప్రక్రియ అక్కడే జరుగుతుంది. ఫలితాలు జూన్ 5న వెలువడుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల