బూజెక్కిన చికెన్.. ఇడ్లీ పిండిలో ఈగలు!
రెస్టారెంట్లు.. పైకి చూడడానికి అందమైన అలంకరణలు, ఘుమఘుమలాడే వాసనలు.. భోజనప్రియులను ఆకర్షించే అనేక కొత్త అంశాలు. వంట గదుల్లోకి వెళ్లి చూస్తే అసలు రంగు బయటపడుతుంది.
ప్రజల ప్రాణాలతో రెస్టారెంట్ల చెలగాటం
ఇలా కుళ్లిపోయింది..
రెస్టారెంట్లు.. పైకి చూడడానికి అందమైన అలంకరణలు, ఘుమఘుమలాడే వాసనలు.. భోజనప్రియులను ఆకర్షించే అనేక కొత్త అంశాలు. వంట గదుల్లోకి వెళ్లి చూస్తే అసలు రంగు బయటపడుతుంది.
ఈనాడు, వరంగల్
బూజు పట్టి..
వరంగల్ నగరంలో పలు ఖరీదైన రెస్టారెంట్లలో గురువారం ఆహార భద్రతా అధికారులు చేసిన తనిఖీల్లో విస్తుగొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. హానికరమైన ఆహార పదార్థాలు, క్యాన్సర్ కారక నూనెలను గుర్తించారు. యాజమాన్యాలు నాణ్యతను పూర్తిగా గాలికొదిలేసి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నట్లు స్పష్టమైంది.
బెల్లం పరిస్థితి ఇది..
ఉమ్మడి వరంగల్వ్యాప్తంగా నిత్యం వేల సంఖ్యలో ప్రజలు వివిధ అవసరాల కోసం నగరానికి వస్తుంటారు. వారంతా ఆకలి తీర్చుకోవడానికి ఇక్కడి రెస్టారెంట్లపైనే ఆధారపడతారు..
- శ్రేయ హోటల్ వంట గదిలోని మూకుడులో నూనెలను యంత్రాలతో పరీక్షించగా అందులో టీపీసీ (టోటల్ పోలార్ కాంపౌండ్స్) ఏకంగా 49 శాతం వచ్చినట్టు గుర్తించారు. స్వచ్ఛమైన నూనెలో 15 శాతం ఉండాలి. మరిగించాక 18 నుంచి 20 శాతం ఉంటే సురక్షితం.. ఆ స్థాయి దాటితే అది క్యాన్సర్ కారకం అవుతుందని హోటల్ నిర్వాహకులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నూనెలను పదేపదే మరిగిస్తున్నట్టు తేలింది. ఇదే రెస్టారెంట్లో కృత్రిమ హానికరమైన రంగులతో చికెన్ కబాబ్స్, ఆహార పదార్థాల్లో కలిపి, అపరిశుభ్ర వాతావరణంలో వంటకాలు తయారుచేసి అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్టు అధికారులు పసిగట్టారు. యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి 11 కిలోల రంగు కలిపిన, బూజుపట్టిన చికెన్, బొద్దింకలతో కూడిన ఇడ్లీ పిండి, బెల్లం ధ్వంసం చేశారు.
- అశోక హోటల్ (కాకతీయ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్) తనిఖీ చేయగా హానికరమైన కృత్రిమ రంగులు కలిపిన ఆహార పదార్థాలు బయటపడ్డాయి. భారీ రంగు డబ్బాలు, మళ్లీ మళ్లీ కాచిన పది లీటర్ల నూనె, కాలం చెల్లిన కస్తూరి మేతి, చికెన్ మసాలాలను ధ్వంసం చేశారు. తయారీ తేదీ లేకుండా స్టోర్ రూంలో నిల్వ ఉంచిన రూ.5500 విలువగల 17 నూడుల్స్, 28 సోంపు ప్యాకెట్లను సీజ్ చేసి నమూనాలు తీసి ప్రయోగశాలకు పంపించారు. నిర్వాహకులకు నోటీసులిచ్చారు. ప్రయోగశాల ఫలితాల ఆధారంగా కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
- నక్కలగుట్టలోని అరణ్య జంగల్ థీమ్ రెస్టారెంట్లోని రిఫ్రిజిరేటర్లో ప్రమాణాల ప్రకారం సరైన ఉష్ణోగ్రతలు లేకపోవడాన్ని గుర్తించారు. ప్రమాదకర ప్లాస్టిక్ కవర్లలో మాంసాన్ని నిల్వ చేయడం, తుప్పు పట్టిన వంటపాత్రలను వినియోగించడంతోపాటు, బూజు పట్టిన కూరగాయలను గుర్తించారు. 26 కిలోల మాంసపు ఉత్పత్తులను ధ్వంసం చేసి నోటీసులిచ్చారు.
నోటీసులు జారీ..
తనిఖీ చేస్తున్న అధికారుల బృందం
రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల ప్రకారం జోనల్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి నేతృత్వంలో ఉమ్మడి జిల్లా ఆహార తనిఖీ అధికారుల బృందం గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వరంగల్ నగరంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. తనిఖీలు చేపట్టిన మూడు రెస్టారెంట్లలో అనేక లోపాలు బయటపడ్డట్టు జ్యోతిర్మయి తెలిపారు. నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. తనిఖీల్లో ఉమ్మడి వరంగల్ ఫుడ్ సేఫ్టీ అధికారులు వేణుగోపాల్, సీహెచ్ కృష్ణమూర్తి, పి.మనోజ్కుమార్, నల్గొండ అధికారిణి స్వాతి పాల్గొన్నారు.
ముసురుకున్న ఈగలతో..
పాడైన కోడి గుడ్లు..
దుర్వాసన వస్తున్న వంటకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్టేక్వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.